ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం, 2019 లో అవశేష ఆంధ్రప్రదేశ్ కొరకు ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం. అంతకుముందు హైదరాబాదు లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా పనిచేసేది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొని ఉంది.[2] "జ్యుడిషియల్" హైకోర్టు భవనం
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం | |
---|---|
స్థాపితం | 2019 జనవరి 1[1] |
దేశం | భారతదేశం |
ప్రదేశం | అమరావతి, ఆంధ్రప్రదేశ్ |
భౌగోళికాంశాలు | 16°31′10″N 80°29′08″E / 16.5195°N 80.4856°E |
సంవిధాన పద్ధతి | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత రాష్ట్ర గవర్నరు సలహా మేరకు రాష్ట్రపతిచే నియామకం. . |
అధికారం పొందినది | భారత రాజ్యాంగం |
తీర్పులపై ఉత్తరాభియోగం | భారత అత్యున్నత న్యాయస్థానం |
న్యాయమూర్తుల పదవీ కాలం | 62 సంవత్సరాల వయసులో తప్పనిసరి పదవీ విరమణ |
స్థానాల సంఖ్య | 37 శాశ్వత: 28 ; అడిషనల్: 9 |
ఛీఫ్ జస్టిస్ | |
ప్రస్తుతం | జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ |
చరిత్ర
1954 సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దీన్ని స్థాపించారు. 1956 నాటికి ఆంధ్ర హైకోర్టు గుంటూరులో ఉండేది. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం తర్వాత కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్కు తరలించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా విడిపోయాకా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధప్రదేశ్కు ప్రత్యేకించి హైకోర్టు ఏర్పాటుచేసేదాకా, హైదరాబాద్లోని హైకోర్టు ఉమ్మడి న్యాయస్థానంగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొల్పారు. సి. ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ (విభజన తర్వాత) ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా 2019 జనవరి 1 న నియమించబడ్డాడు.[3] 2019 అక్టోబరు 7 న నేలపాడు లో కొత్తగా నిర్మించిన హైకోర్ట్, న్యాయమూర్తులతో కొలువుదీరిన తరువాత, గవర్నర్ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ మహేశ్వరి తో ప్రమాణం చేయించాడు. 2021 జనవరి 6న అరూప్ కుమార్ గోస్వామి మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశాడు.[4]
భౌగోళికం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో అంతర్భాగమైన నేలపాడు వద్ద నెలకొంది.[5] కృష్ణా నదికి 6.4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రధాన న్యాయమూర్తులు
- చాగరి ప్రవీణ్ కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి - 1 జనవరి 2019 నుండి 6 అక్టోబర్ 2019
- జితేంద్ర కుమార్ మహేశ్వరి 7 అక్టోబరు 2019 – 5 జనవరి 2021
- అరూప్ కుమార్ గోస్వామి 6 జనవరి 2021- 12 అక్టోబరు 2021
- ప్రశాంత్ కుమార్ మిశ్రా 13 అక్టోబరు 2021- 18 మే 2023
- ఆకుల వెంకట శేష సాయి 19 మే 2023 - 25 జులై 2023
- ధీరజ్ సింగ్ ఠాకూర్ - 25 జులై 2023[6][7]
హైకోర్టు న్యాయమూర్తులు
- జె.ఉమాదేవి
- కన్నెగంటి లలిత
- బొప్పూడి కృష్ణ మోహన్
- కంచిరెడ్డి సురేష్ రెడ్డి
- నైనాల జయసూర్య
- దొనడి రమేశ్
- బట్టు దేవానంద్
- రావు రఘునందన్ రావు
- కొనకంటి శ్రీనివాస రెడ్డి - 2022 ఫిబ్రవరి 14 - ప్రస్తుతం
- తర్లాడ రాజశేఖర రావు - 2022 ఫిబ్రవరి 14 - ప్రస్తుతం
- వడ్డిబోయిన సుజాత - 2022 ఫిబ్రవరి 14 - ప్రస్తుతం
- గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ - 2022 ఫిబ్రవరి 14 - ప్రస్తుతం
- సత్తి సుబ్బారెడ్డి - 2022 ఫిబ్రవరి 14 - ప్రస్తుతం
- నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు - 2022 ఫిబ్రవరి 14 - ప్రస్తుతం
- చీమలపాటి రవి - 2022 ఫిబ్రవరి 14 - ప్రస్తుతం[8]
మాజీ న్యాయమూర్తులు
- నక్కా బాలయోగి - 2017 జనవరి 17 నుండి 2019 జనవరి 14
- టి.రజనీ - 2017 జనవరి 1 నుండి 2020 నవంబరు 5
- రాకేష్ కుమార్ - 2019 నవంబర్ 8 నుండి 2020 డిసెంబరు 31
- మటం వెంకటరమణ- 2019 జూన్ 20 నుండి 2022 ఫిబ్రవరి 11
- అషానుద్దీన్ అమానుల్లా - 2021 అక్టోబరు 10 – 2022 జూన్ 20