పవిత్ర జయరామ్
పవిత్ర జయరామ్, తెలుగు, కన్నడ భాషా టెలివిజన్ రంగాలకు చెందిన భారతీయ నటి. జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్లో తిలోత్తమ అనే నెగిటివ్ రోల్ పోషించిన ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది.
పవిత్ర జయరామ్ | |
---|---|
జననం | ఏప్రిల్ 14 |
మరణం | 2024 మే 12 |
మరణ కారణం | రోడ్డు ప్రమాదం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
తెలుగులో నిన్నే పెళ్లాడతా ధారావాహికతో పరిచయం అయిన ఆమె, స్వర్ణా ప్యాలెస్, కోడళ్లు మీకు జోహర్లు అనే సీరియల్స్లోనూ ప్రతినాయిక పాత్రలతో మెప్పించింది.[1]
కెరీర్
కర్ణాకటలోని మాండ్యా ప్రాంతానికి చెందిన ఆమె రోబో ఫ్యామిలీ అనే కన్నడ సీరియల్ ద్వారా అరంగేట్రం చేసింది. అక్కడ వరుసగా పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న ఆమె, నిన్నే పెళ్లాడతా ధారావాహికతో తెలుగు నాట అడుగుపెట్టింది.
వ్యక్తిగత జీవితం
చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. కాగా ఆమెకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.
మరణం
ఆమె మహబూబ్నగర్ జిల్లా శేరిపల్లి వద్ద 2024 మే 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. బెంగళూరు నుంచి షూటింగ్ కోసం హైదరాబాద్ కారులో వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.[2]