ఎటపాక మండలం
ఎటపాక మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మండలం.[3] 2014 వరకు ఎటపాక పట్టణం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలంలో ఉండేది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలం మండలంలోని భద్రాచలం పట్టణం తప్ప మిగిలిన గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసాయి.OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°41′20″N 80°54′11″E / 17.689°N 80.903°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు జిల్లా |
మండల కేంద్రం | ఎటపాక |
Area | |
• మొత్తం | 364 km2 (141 sq mi) |
Population (2011)[2] | |
• మొత్తం | 38,961 |
• Density | 110/km2 (280/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
చరిత్ర
2014 వరకు ఎటపాక గ్రామం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలంలో ఉండేది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలం పట్టణం తప్ప భద్రాచలం మండలంలోని 73 గ్రామాలు (అందులో 8 నిర్జన గ్రామాలు) ఆంధ్రప్రదేశ్ లో కలిసాయి [4][5]
గణాంకాలు
2001 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా -మొత్తం 77,960, అందులో పురుషులు 39,330 మంది ఉండగా, స్త్రీలు 38,630 మంది ఉన్నారు.
సమీప పట్టణాలు
- భద్రాచలం - తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పట్టణం.
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- ఎటపాక
- కన్నాయిగూడెం
- తాళ్ళగూడెం
- గొట్టుగూడెం
- ఫెర్గుసన్ పేట
- తునికిచెరువు
- లింగాలపల్లె
- రామగోపాలపురం
- పట్టుచీర
- బూరుగువాయి
- లక్ష్మీపురం
- మాధవరావుపేట
- గొల్లగుప్ప
- బండిరేవు
- రంగాపురం
- కన్నాపురం
- విశ్వాపురం
- ఎర్రబోరు
- నరసింగపేట
- పిచ్చికలపేట
- సీతంపేట
- చింతలగూడెం
- చంద్రంపాలెం
- లక్ష్మీదేవిపేట
- పురుషోత్తపట్నం
- సీతారామపురం
- గుండాల
- కె.నారాయణపురం
- పినపల్లె
- రాయనపేట
- పెనుబల్లి
- పాండురంగాపురం
- ఎర్రగుంట
- చోడవరం
- చిన్న నల్లకుంట
- నెల్లిపాక
- బుట్టాయిగూడెం
- దేవరపల్లి
- గోగుపాక
- గొమ్ము కోయగూడెం
- కాపవరం
- కొత్తగూడెం
- బొడ్డుగూడెం
- అయ్యవారిపేట
- త్రిపుర పెంటవీడు
- గొల్లగూడెం
- తోటపల్లి
- కాపుగంపల్లి
- రాచగంపల్లి
- గన్నవరం
- రాజుపేట
- కిష్టారం
- కుసుమానపల్లి
- అచ్యుతాపురం
- రాఘవాపురం
- చెలెంపాలెం
- నల్లకుంట
- ముమ్మడివరు
- గౌరిదేవిపేట
- నందిగామ
- మురుమూరు
సమీప పర్యాటక స్థలాలు
- భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం
- కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాం, అద్దాల మందిరం, జింకల పార్కు ఉన్నాయి.
- పర్ణశాల: వనవాసం సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడినుండే సీతాదేవిని, రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
- పాపి కొండలు: సుందరమైన గోదావరినది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం చూడదగ్గవి.