జాన్ ఎలియట్ డ్రింక్వాటర్ బెథూన్
జాన్ ఇలియట్ డ్రింక్వాటర్ బెథూన్ (1801 - 1851) విద్యావేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, బహుభాషావేత్త. అతను భారతదేశంలో మహిళల విద్యను ప్రోత్సహించడంలో చేసిన కృషికి పేరుగాంచాడు. [1] అతను కలకత్తాలోని కలకత్తా ఫిమేల్ స్కూల్ (ప్రస్తుతం బెథూన్ కాలేజ్ అని పిలుస్తారు) స్థాపకుడు, [2] ఇది ఆసియాలోని పురాతన మహిళా కళాశాలగా పరిగణించబడుతుంది. [3] అతను ఇంగ్లాండ్లో న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో న్యాయ సభ్యుడిగా నియమించబడి భారతదేశానికి వచ్చాడు. [4] తదుపరి మహిళా విద్యలో ఆయన చేసిన ప్రయత్నాలకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, బెంగాలీ పునరుజ్జీవనోద్యమ సభ్యులు చురుకుగా మద్దతు ఇచ్చారు. [5]
జాన్ ఎలియట్ డ్రింక్వాటర్ బెథూన్ | |
---|---|
జననం | 1801 శాల్ఫోర్డ్?, ఇంగ్లాండు |
మరణం | ఆగష్టు 12, 1851 |
వృత్తి | స్త్రీవిద్యా ప్రోత్సాహము |
1849లో, బెథూన్ అప్పటి బ్రిటీషు ఇండియా రాజధాని అయిన కలకత్తా నగరంలో మహిళా విద్యకై ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ఆ తరువాతి కాలంలో ఈయన పేరు మీదుగా నామకరణం చేయబడి బెథూన్ కళాశాలగా ప్రసిద్ధి చెందింది.[6]
జీవిత విశేషాలు
బెథూన్, జాన్ డ్రింక్వాటర్ బెథూన్ యొక్క పెద్ద కుమారుడు ఇంగ్లాండ్లోని ఈలింగ్లో జన్మించాడు. [7] అతను కేంబ్రిడ్జి లోని ట్రినిటీ కాలేజీలో చదువుకున్నాడు. తరువాత అతను హోమ్ ఆఫీస్ కౌన్సెల్ గా ఉద్యోగం పొందాడు. మునిసిపల్ సంస్కరణ చట్టం, టైథే కమ్యుటేషన్ చట్టం, కౌంటీ కోర్టుల చట్టం సహా అనేక ముఖ్యమైన సంస్కరణలను ఆయన ఈ పదవిలో ఉండగా రూపొందించాడు. 1848 లో, అతను సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా నియమితుడయ్యాడు. తరువాత కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడయ్యాడు. [8]
బెథూన్ కళాశాల స్థాపన
దక్షిణారంజన్ ముఖర్జీ, రామ్గోపాల్ ఘోష్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, మదన్ మోహన్ తార్కాలంకర్ ల మద్దతుతో బెథూన్ 1849 లో కలకత్తా ఫిమేల్ స్కూల్ను స్థాపించాడు. [9] ఈ పాఠశాల బైతఖానాలోని ముఖర్జీ ఇంటిలో ప్రారంభమైంది (ప్రస్తుతం దీనిని బౌబజార్ అని పిలుస్తారు). అందులో 21 మంది బాలికలు చేరారు. [10] : 11–12
మరుసటి సంవత్సరం, నమోదు 80 కి పెరిగింది. [11] నవంబరులో, కార్న్వాలిస్ స్క్వేర్ యొక్క పడమటి వైపున ఉన్న ఒక ప్లాట్లో, శాశ్వత పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసారు. శంకుస్థాపన రాతిపై ఉంచిన రాగి పలకపై "హిందూ బాలికల పాఠశాల" అనే పేరు చెక్కారు. [12] : 15–16 1851 ఆగష్టులో బెథూన్ మరణించిన తరువాత పాఠశాలకు మద్దతు క్షీణించింది. [11] 1856 లో ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుంది, 1862-63లో దాని స్థాపకుడి పేరుమీద బెథూన్ స్కూల్ అని నామకరణం చేసింది. [13] 1879 లో దీనిని భారతదేశంలో మొట్టమొదటి మహిళా కళాశాల, బెథూన్ కాలేజీగా అభివృద్ధి చేశారు. [14]
మరణం
జాన్ ఇలియట్ బెథూన్ 1851 లో కలకత్తాలో మరణించాడు. అతన్ని లోయర్ సర్క్యులర్ రోడ్ శ్మశానవాటికలో ఖననం చేశారు. [15]