పంకజ్ చరణ్ దాస్
పంకజ్ చరణ్ దాస్ (ఆంగ్లం: Pankaj Charan Das; 1919 మార్చి 17 - 2003 జూన్ 11) భారతీయ శాస్త్రీయ నృత్యకారుడు, కొరియోగ్రాఫర్, ఒడిస్సీ నృత్యంలో ఆది గురువు. ఆయనని 'గురు'వుగానే కాక 'ఒడిస్సీ నృత్య పితామహుడు' అని పిలుస్తారు.[1] 1992లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను సత్కరించింది.
ఆది గురువు పంకజ్ చరణ్ దాస్ | |
---|---|
ପଙ୍କଜ ଚରଣ ଦାସ | |
జననం | |
మరణం | 2003 జూన్ 11 భువనేశ్వర్, ఒడిషా, భారతదేశం | (వయసు 84)
వృత్తి | భారత శాస్త్రీయ నృత్యకారుడు, కొరియోగ్రాఫర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1933–2000 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఒడిస్సీ |
గుర్తించదగిన సేవలు | పంచకన్యా గ్లానిసంఘారా బాలగోపాలాష్టక |
పురస్కారాలు | పద్మశ్రీ |
కెరీర్
పంకజ్ చరణ్ దాస్ మహారి అంటే ఆలయ నర్తకి రత్న ప్రభా దేవి దత్తపుత్రుడు. ఆమె నుండి భక్తి ఉద్యమ కళను నేర్చుకున్నాడు. ఒడిస్సీ పుట్టుకకు ఆధారమైన నృత్య రూపాన్ని పునరుద్ధరించడానికి అతను బాధ్యత వహించాడు. కేవలం ఆలయ ప్రాంగణంలోనే కాక ఒడిస్సీని జనాల్లోకి తీసుకురావడానికి కారణమైన వ్యక్తి.
ఆయన దేశంలోని గొప్ప కవులు కాళిదాస్, జయదేబ జీవితాల ఆధారంగా నృత్య ఎపిసోడ్లను కొరియోగ్రఫీ చేశాడు. ఆయన ఒడిషా ఏకైక నృత్య & సంగీత కళాశాల ఉత్కల్ సంగీత మహావిద్యాలయంలో ఒడిస్సీ నృత్య విభాగానికి అధిపతిగా 25 సంవత్సరాలకు పైగా కళాశాలతో అనుబంధం కలిగి ఉన్నాడు. అక్కడ ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేశాడు.[2]
అవార్డులు
- సంగీత నాటక అకాడమీ ద్వారా రాష్ట్రపతి అవార్డు
- ఒరిస్సా సాహిత్య అకాడమీ అవార్డు
- రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అవార్డు
- కబీ సామ్రాట్ ఉపేంద్ర భంజా అవార్డు
- 1992లో ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
గురు పంకజ్ చరణ్ దాస్ వేడుక
భుబనేశ్వర్లోని ఉద్రా కల్చర్ అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం ఆదిగురు పంకజ్ చరణ్ దాస్ ఉత్సవాన్ని గురు పంకజ్ చరణ్ దాస్ జ్ఞాపకార్థం నిర్వహిస్తారు. దీనిని ఆయన కుమారుడు బసంత్ దాస్, మనవరాలు పల్లవి దాస్ చేస్తున్నారు.