పాత పార్లమెంట్ హౌస్ (న్యూఢిల్లీ)
ఓల్డ్ పార్లమెంట్ హౌస్, అధికారికంగా సంవిధాన్ సదన్ (రాజ్యాంగ సభ) అని పిలుస్తారు.[1] [2] 1927 జనవరి 18 నుండి 1947 ఆగస్టు 15 వరకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంగా పనిచేసింది.1947 ఆగస్టు 15 నుండి 1950 జనవరి 26 వరకు భారత రాజ్యాంగ సభ, 1950 జనవరి 26 నుండి 2023 సెప్టెంబరు 18 వరకు భారత పార్లమెంటుఇందులో కొనసాగాయి. దీనిలో భారతదేశ ద్విసభ పార్లమెంటులో వరుసగా 73 సంవత్సరాలు లోక్సభ, రాజ్యసభ (దిగువ, ఎగువ సభలు) కార్యకలాపాలు జరిగాయి.
ఓల్డ్ పార్లమెంట్ హౌస్, | |
---|---|
సంవిధాన్ సదన్ | |
సాధారణ సమాచారం | |
స్థితి | Retired and waiting for heritage restoration |
రకం | వారసత్వ భవనం |
నిర్మాణ శైలి | లుటియన్స్ ఢిల్లీ |
ప్రదేశం | న్యూఢిల్లీ |
చిరునామా | సంసద్ మార్గ్, న్యూ ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ |
పట్టణం లేదా నగరం | న్యూఢిల్లీ |
దేశం | India |
భౌగోళికాంశాలు | 28°37′02″N 77°12′29″E / 28.6172°N 77.2081°E |
ప్రస్తుత వినియోగదారులు | మ్యూజియం |
సంచలనాత్మక | 1921 ప్రిన్స్ ఆర్థర్, డ్యూక్ ఆఫ్ కన్నాట్, స్ట్రాథెర్న్ |
నిర్మాణ ప్రారంభం | 1921 |
పూర్తి చేయబడినది | 1927 జనవరి 18 |
ప్రారంభం | 1927 జనవరి 18 భారత వైస్రాయ్ ,ఎడ్వర్డ్ వుడ్, 1వ ఎర్ల్ ఆఫ్ హాలిఫాక్స్ |
యజమాని | భారత ప్రభుత్వం |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ |
ఇతర విషయములు | |
సీటింగు సామర్థ్యం | 790 |
ఈ భవనాన్ని బ్రిటిష్ వాస్తుశిల్పులు ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ రూపొందించారు. దీనిని 1921 -1927 మధ్య నిర్మించారు. ఇది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్థానంగా జనవరి 1927లో ప్రారంభించబడింది. దీనిని కౌన్సిల్ హౌస్ అని కూడా పిలుస్తారు.[3] భారతదేశం నుండి బ్రిటీష్ ఉపసంహరణ తరువాత, దీనిని భారత రాజ్యాంగ సభ స్వాధీనం చేసుకుంది. ఆ పై భారత రాజ్యాంగం ఏర్పడిన తరువాత 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించడంతో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత పార్లమెంటు స్వాధీనం చేసుకుంది.[4]
2020 నుండి 2023 వరకు త్రిభుజాకార ప్లాట్లో ఈ భవనం సమీపంలో నిర్మించిన కొత్త పార్లమెంట్ హౌస్ 2023 మే 28న ప్రారంభించబడింది. ఇది భారత ప్రభుత్వం సెంట్రల్ విస్టా రీడెవలప్మెంటు ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించబడింది.
చరిత్ర
ఈ భవనాన్ని 1912-1913లో బ్రిటిష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్ ,సర్ హెర్బర్ట్ బేకర్ రూపొందించారు.[5]ఈ నిర్మాణం 1921లో ప్రారంభమై 1927లో ముగిసింది.ఆరు సంవత్సరాల కాలంలో ఇది నిర్మించబడింది. 1919లో మోంటాగు - చెమ్స్ఫోర్డ్ సంస్కరణల తరువాత, శాసనసభ విస్తరణ జరిగింది. దీని వలన భవన నిర్మాణం అవసరమైంది.[6] ఐకానిక్ వృత్తాకార రూపకల్పన లుటియన్స్ ప్రతిపాదించారు. భవనం ఉన్నస్థలం త్రిభుజాకార ఆకృతిని బట్టి, ఇది అత్యంత సమర్థవంతమైన రూపకల్పన అని నమ్మాడు.
1921 ఫిబ్రవరిలో కన్నాట్, స్ట్రాథెర్న్ డ్యూక్ హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ ఆర్థర్ దీనికి పునాది రాయి వేశారు.1927 జనవరి 18న, పరిశ్రమలు, కార్మిక శాఖకు బాధ్యత వహించిన గవర్నరు జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు సర్ భూపేంద్ర నాథ్ మిత్రా, అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ను భవనాన్ని ప్రారంభించడానికి ఆహ్వానించారు. కేంద్ర శాసనసభ మూడవ సమావేశం 1927 జనవరి 19న దీనిలో జరిగింది.[7][8]
స్వాతంత్ర్యం తరువాత, ఈ భవనం 1947-1950 వరకు రాజ్యాంగ సభ స్థానంగా పనిచేసింది. రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఇక్కడ భారత రాజ్యాంగం రూపొందించబడింది.[9]ఎక్కువ స్థలం ఉపయోగ కోసం1956లో నిర్మాణానికి రెండు అంతస్తులు జోడించబడ్డాయి.[10] 2006లో ప్రారంభమైన పార్లమెంటు సంగ్రహశాల, పార్లమెంటు భవనం పక్కన, పార్లమెంటరీ గ్రంధాలయ భవనం ఉంది.[11]
వివరణ
నిర్మాణ శైలిని గ్రీస్, రోమన్ నుండి ప్రేరణ పొందిన శాస్త్రీయ శైలి, భారతీయ వాస్తుశిల్పం నుండి నిర్మాణ అంశాలు, అలంకార మూలాంశాల సమ్మేళనం అని వర్ణించవచ్చు.[12] భవన చుట్టుకొలత వెలుపల 144 స్తంభాలతో వృత్తాకారంగా ఉంటుంది. భవనం మధ్యలో వృత్తాకార సెంట్రల్ ఛాంబర్ ఉంది. ఈ ఛాంబర్ చుట్టూ మూడు అర్ధ వృత్తాకార మందిరాలు ఉన్నాయి, వీటిని రాజ్యసభ లోక్సభ కోసం నిర్మించారు (ఇప్పుడు అది గ్రంధాలయ భపనంగా మారింది) స్టేట్ కౌన్సిల్ (తరువాత రాజ్యసభ కోసం ఉపయోగించారు), సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (తరువాత లోక్సభ కోసం ఉపయోగించారు. పూర్వ పార్లమెంటు చుట్టూ పెద్ద తోటలు ఉన్నాయి. చుట్టూ ఇసుకరాయి రెయిలింగ్లతో (జాలీ) కంచె వేయబడింది.[13] కొత్త పార్లమెంటు భవనం వాడక మొదలుపెట్టిన తర్వాత ప్రస్తుత భవనాన్ని మ్యూజియం ఆఫ్ డెమోక్రసీగా మార్చాలని ప్రణాళిక చేయబడింది.[14]
కొత్త పార్లమెంటు భవనం
నేపథ్యం
అసలు నిర్మాణ స్థిరత్వం గురించి అడిగిన ప్రశ్నల ఫలితంగా 2010ల ప్రారంభంలో పార్లమెంటు భవనం స్థానంలో కొత్త పార్లమెంటు భవనం కోసం ప్రతిపాదనలు వెలువడ్డాయి.[15] 2012లో అప్పటి స్పీకర్ మీరా కుమార్ ఈ భవనం వినియోగానికి అనేక ప్రత్యామ్నాయాలను సూచించడానికి, అంచనా వేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.[16]
ప్రారంభం
2019లో భారతప్రభుత్వం న్యూఢిల్లీలోని రైసినా హిల్ సమీపంలో ఉన్న భారతదేశ కేంద్రపరిపాలనా ప్రాంతమైన సెంట్రల్ విస్టాను పునరాభివృద్ధి చేయడానికి బహుళ-బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించింది.కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం, అలాగే రాజ్పథ్ పునరాభివృద్ధి భారత ప్రధానమంత్రికి కొత్త కార్యాలయ నివాసంగా సమకూరింది. అలాగే ఒకే కేంద్ర సచివాలయంలో అన్ని మంత్రి భవనాలను మిళితం చేసింది.[17] కొత్త భవనానికి శంకుస్థాపన కార్యక్రమం 2020 అక్టోబరులో జరిగింది. పునాది రాయి 2020 డిసెంబరు 10న వేయబడింది.[18][19]
మ్యూజియం ఆఫ్ డెమోక్రసీ
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం తరువాత,పాత పార్లమెంటు భవనాన్ని మ్యూజియం ఆఫ్ డెమోక్రసీగా మార్చబడింది.[20] 2023 సెప్టెంబరు 19న నిర్వహించిన ప్రసంగంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ భవనానికి సంవిధాన్ సదన్ (రాజ్యాంగ భవనం)గా పేరు మార్చాలని ప్రతిపాదించారు.[21] తరువాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి పేరు మార్చినట్లు ప్రకటించారు.[22]
సంఘటనలు
భగత్ సింగ్ బాంబు దాడి
1929 ఏప్రిల్ 8న హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ) విప్లవకారుడు భగత్ సింగ్ సందర్శకుల గ్యాలరీ నుండి తక్కువ తీవ్రత గల బాంబులను సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హాల్లోకి (తరువాత, లోక్సభ గదిలోకి) విసిరారు. బటుకేశ్వర్ దత్ అతనితో ఉన్నాడు. కానీ ఏ బాంబు విసిరలేదు. ఇద్దరూ కరపత్రాలను విసిరి, "సామ్రాజ్యవాదాన్ని అణచివేయండి!", "ప్రపంచ కార్మికులారా, ఏకం అవ్వండి!", "విప్లవంతో దీర్ఘాయువు పొందండి!" వంటి సామ్రాజ్యవాద వ్యతిరేక, కమ్యూనిస్టు వ్యతిరేక నినాదాలు చేశారు. వారిని వెంటనే అరెస్టు చేశారు. సూత్రధారి అయిన సింగ్, 1893లో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ బాంబు దాడి చేసిన ఫ్రెంచ్ అరాచకవాది అగస్టే వైలంట్ నుండి ప్రేరణ పొందాడు. హెచ్ఎస్ఆర్ఏ విప్లవకారులు విప్లవం ఆలోచనలను వ్యాప్తి చేయడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి భారతీయులను ప్రేరేపించడానికి ఉద్దేశించారు. పేలుళ్ల కారణంగా, గదిలో కూర్చున్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.[23][24]
2001 తీవ్రవాద దాడి
2001 డిసెంబరు13న లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (జేఎం) -రెండు పాకిస్తాన్-పెంచిన ఉగ్రవాద సంస్థలు-ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంటు మైదానంలోకి ప్రవేశించి భవనంపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారందరూ భవనం వెలుపల చంపబడ్డారు. ఈ దాడి ఆరుగురు ఢిల్లీ పోలీసు సిబ్బందిని, ఇద్దరు పార్లమెంటు భద్రతా సేవల సిబ్బందిని, ఒక తోటమాలితో సహా మొత్తం తొమ్మిది మంది మరణానికి దారితీసింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి ఇది దారితీసింది, ఫలితంగా భారతదేశం-పాకిస్తాన్ మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.[25]
గ్యాలరీ
- లార్డ్ మౌంట్ బాటన్ 1947లో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ని వైస్రాయ్ అని సంబోధించిన సన్నివేశ చిత్తరువు
- 11950లో భారత రాజ్యాంగ సభ సమావేశం.
- భారత ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ 1978లో భారత పార్లమెంట్లో యు.ఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మాటలు వింటున్నారు.
- 25వ స్వాతంత్ర్య వార్షికోత్సవం (1947-1972) స్మారకార్థం 1972 నాటి 10 రూపాయల వెండి నాణెం వెనుక భాగంలో భారత పార్లమెంటు భవనం చిత్రీకరించబడింది.
- గతంలో లోక్సభ ఛాంబర్.