మనోహర్ పారికర్
మనోహర్ గోపాలకృష్ణ పార్రికర్, 1955, డిసెంబరు 13 న గోవాలోని మపూసాలీలో జన్మించాడు. ఇతను రాజకీయ నాయకుడు. ఐఐటిలో చదివాడు. ఐఐటిలో గ్రాడ్యుయేషన్ చేసి ఒక రాష్ట్రపు ముఖ్యమంత్రి పదవి పొందిన వారిలో ఇతను ప్రథముడు.
మనోహర్ పారికర్ | |||
పదవీ కాలం 2012, మార్చి 13 నుంచి | |||
వ్యక్తిగత వివరాలు | |||
---|---|---|---|
జననం | మపూసాలి, గోవా | 1955 డిసెంబరు 13||
మరణం | మార్చి 17, 2019[1] గోవా | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | గోపాలకృష్ణ పారికర్, రాధాబాయి పారికర్ | ||
జీవిత భాగస్వామి | మేధా పారికర్ | ||
సంతానం | ఉత్పల్ పారికర్, అభిజిత్ పారికర్ | ||
మార్చి 16, 2012నాటికి |
రాజకీయ జీవితం
1994లో మనోహర్ పార్రికర్ తొలిసారిగా గోవా శాసనసభకు ఎన్నికయ్యాడు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు. 2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్నాడు. మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా నెట్టుకొచ్చాడు. 2007 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంతో దిగంబర్ కామత్కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించాడు. 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పార్రికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యాడు. రాఫెల్ ఒప్పందం వివాదం లో ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది.