సత్పాల్ సింగ్
గురు సత్పాల్ అని కూడా పిలువబడే సత్పాల్ సింగ్ (జననం 1 ఫిబ్రవరి 1955), కుస్తీ కోచ్, భారత మాజీ మల్లయోధుడు. అతను 1982 ఆసియా క్రీడలలో బంగారు పతక విజేత, 1974 ఆసియా క్రీడలలో కాంస్య పతక విజేత. అతను ఒలింపిక్ పతక విజేతలు సుశీల్ కుమార్, రవి కుమార్ దహియా లకు కోచ్ గా బాగా ప్రసిద్ధి చెందాడు. [2] [3] ఆయనకు 2015లో భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది.
సత్పాల్ సింగ్ | |
---|---|
జననం | [1] బవానా, ఢిల్లీ | 1955 మే 11
జాతీయత | భారతీయుడు |
ఎత్తు | 182 cm (6 ft 0 in) |
జీవిత చరిత్ర
సత్పాల్ 1955 ఫిబ్రవరి 1న ఢిల్లీలోని బవానా గ్రామంలో జన్మించాడు. ఢిల్లీలోని హనుమాన్ అఖారాలో ప్రముఖ రెజ్లింగ్ కోచ్ గురు హనుమాన్ ఆయనకు శిక్షణ ఇచ్చాడు. [4] సత్పాల్ ఇప్పుడు ఢిల్లీ లోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పనిచేస్తున్నారు. అతను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ పాట్రన్. అతను ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో 1988 నుండి తోటి కోచ్ వీరేందర్ సింగ్ తో కుస్తీ కోచింగ్ కోసం అఖాడాను నడుపుతున్నాడు. అతను బీజింగ్ ఒలింపిక్స్ 2008, లండన్ ఒలింపిక్స్ 2012 కోసం రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ కు శిక్షణ ఇచ్చాడు.
ఆయనకు భారత ప్రభుత్వం 2009లో ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేసింది. అంతకు ముందు 1983లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. [5]
అవార్డులు
- 1974:అర్జున అవార్డు (రెజ్లింగ్)
- 1983:పద్మశ్రీ
- 2009:ద్రోణాచార్య పురస్కారం
- 2015: పద్మభూషణ్