అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత, దర్శకుడు.[3][4] పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[5] అంతకు మునుపు కందిరీగ, మసాలా, ఆగడు మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.
అనిల్ రావిపూడి | |
---|---|
జననం | [1][2] | 1982 నవంబరు 23
విద్య | ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ |
విద్యాసంస్థ | విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల |
వృత్తి | సినీ రచయిత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008 - ప్రస్తుతం |
బంధువులు | అరుణ్ ప్రసాద్ (బాబాయి) |
బాల్యం, విద్యాభ్యాసం
అనిల్ స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా, అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. [4] అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది. చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంటు హాలులో కూర్చుని సినిమాలు చూసే అలవాటు కలిగింది. తండ్రికి ఆర్టీసీలో డ్రైవరుగా ఉద్యోగం వచ్చింది. తర్వాత వారి కుటుంబం అద్దంకికి తరలి వచ్చింది. పదో తరగతి దాకా అద్దంకిలో తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో చదివాడు. తర్వాత వడ్లమూడి లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివాడు.
సినిమాలు
ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు. 2005 లో విడుదలైన గౌతమ్ ఎస్.ఎస్.సి. చిత్రానికి సహాయకుడిగా పనిచేశాడు.[6]
రచయితగా
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర |
---|---|---|
2008 | శౌర్యం | సంభాషణ రచయిత |
2009 | శంఖం | సంభాషణ రచయిత |
2011 | కందిరీగ | కథ/ సంభాషణ రచయిత |
2012 | దరువు | సంభాషణ రచయిత |
2012 | సుడిగాడు | సంభాషణ రచయిత |
2013 | మసాలా | సంభాషణ రచయిత |
2014 | ఆగడు | కథ/ సంభాషణ రచయిత |
2015 | పండగ చేస్కో | కథ రచయిత |
2021 | గాలి సంపత్ | స్క్రీన్ ప్లే రచయిత |
దర్శకుడిగా
దర్శకుడిగా అనిల్ తొలి సినిమా కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన పటాస్. రెండో చిత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్. రవితేజ కథానాయకుడిగా నటించిన రాజా ది గ్రేట్ 2017 లో విడుదలైంది.
సంవత్సరం | చలన చిత్రం | తారాగణం | |
---|---|---|---|
2018 | ఎఫ్2 | దగ్గుబాటి వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా | |
2017 | రాజా ది గ్రేట్ | రవితేజ , మెహ్రీన్ పిర్జాదా | |
2016 | సుప్రీమ్. | సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా | |
2015 | పటాస్ | కళ్యాణ్ రామ్, శృతి సోది | |
2020 | సరిలేరు నీకెవ్వరు | మహేష్ బాబు, రష్మిక మందన్న | |
2023 | భగవంత్ కేసరి[7] | నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల |
అవార్డ్స్
అనిల్ రావిపూడి 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమంలో 2019గాను మోస్ట్ పాపులర్ డైరెక్టర్ (ఎఫ్2) సినిమాకు గాను అవార్డును అందుకున్నాడు.[8]