రాయ్గంజ్
రాయ్గంజ్ అనేది భారత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లోని ఒక నగరం, మునిసిపాలిటీ. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దినజ్పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఇక్కడ 125 సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబడింది. రైల్వే సౌకర్యం 115 సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రదేశానికి అందుబాటులో ఉంది. ఈ నగరంలో 106 సంవత్సరాల పురాతన రాయ్గంజ్ కొరోనెషన్ ఉన్నత పాఠశాల ఉంది. రాయ్గంజ్కు 1896 లో రైల్వే కనెక్షన్ వచ్చింది. ఈ రైలు రాయ్గంజ్ నుంచి బంగ్లాదేశ్లోని పర్బాటిపూర్ జంక్షన్కు వెళ్లేది. ఇది 200 సంవత్సరాల పురాతన పట్టణం. [5]
రాయ్గంజ్ | |||||
---|---|---|---|---|---|
పట్టణం | |||||
From top: Clock Tower of Raiganj Raiganj railway station Sudarshanpur Durga Puja | |||||
Coordinates: 25°37′N 88°07′E / 25.62°N 88.12°E | |||||
దేశం | భారతదేశం | ||||
రాష్ట్రం | పశ్చిమబెంగాల్ | ||||
జిల్లా | ఉత్తర దినాజ్ పూర్ | ||||
Government | |||||
• Type | మ్యునిసిపాలిటీ | ||||
• Body | రాయ్గంజ్ మ్యునిసిపాలిటీ | ||||
విస్తీర్ణం | |||||
• పట్టణం | 10.76 km2 (4.15 sq mi) | ||||
Elevation | 40 మీ (130 అ.) | ||||
జనాభా | |||||
• పట్టణం | 1,83,682 | ||||
• జనసాంద్రత | 18,378/km2 (47,600/sq mi) | ||||
• Metro | 1,99,758 | ||||
భాషలు | |||||
• అధికార | బెంగాలీ[3][4] | ||||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | ||||
టేలిఫోన్ కోడ్ | 03523m | ||||
Vehicle registration | WB-60/ WB-59 | ||||
లోక్సభ నియోజకవర్గం | రాయ్గంజ్ లోక్సభ నియోజకవర్గం |
పేరు వెనుక చరిత్ర
"రాయ్గంజ్"కు ఆ పేరు రావడానికి మూలం ఖచ్చితంగా లభించనప్పటికీ దానికి కొన్ని కారణాలు తెలుపబడినవి. ఈ ప్రాంతం దినాజ్పూర్ రాజకుటుంబం అధీనంలో ఉన్నందున ఈ ప్రాంతానికి ఆ రాజ కుటుంబం ఇంటి పేరు "రాయ్" వచ్చిందని చెబుతారు. విస్తృతంగా ఆమోదించబడిన అభిప్రాయం ఏమిటంటే, ఈ ప్రదేశంలో ప్రాచీన కాలం నుండి రాయ్ సోర్షే (ఒక ప్రత్యేక రకమైన ఆవాలు) పంట పండేదని, దీని నుండి పట్టణ నామం పుట్టిందని చెబుతారు. [6] "రాయ్గంజ్" అనే పదం "రాయ్" నుండి వచ్చింది, రాయ్ అంటే " రాధా " (కృష్ణుడి భార్య). ఈ పట్టణానికి సమీపంలోని వేరొక పట్టణం కలియాగంజ్ ఉంది. కలియా గంజ్ లోని "కలియా" అనగా "కృష్ణ" అని అర్థం. రాయ్గంజ్ వ్యుత్పత్తికి రాధాదేవి(రాయ్) కారణమైతే, కలియాగంజ్ వ్యుత్పత్తికి కృష్ణ (కలియా) కారణంగా చెబుతారు.
భౌగోళికం
రాయ్గంజ్ వన్యప్రాణుల అభయారణ్యం
రాయ్గంజ్ లో రాయ్గంజ్ వన్యప్రాణుల అభయారణ్యం (కులిక్ బర్డ్ సాంచురి అని కూడా పిలుస్తారు) ముఖ్యమైన పర్యాటక స్థలం. ఇక్కడ ఆసియా ఓపెన్బిల్స్, ఇతర నీటి పక్షులు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆసియాలో అతి పెద్ద పక్షుల అభయారణ్యం. రాయ్గంజ్ కులిక్ నది ఒడ్డున ఉంది. ఇది పట్టణానికి జల రవాణాకు అనుకూలంగా ఉండేది. కాలక్రమేణా, కులిక్ నది యొక్క నావిగేబిలిటీ తగ్గింది. 1970 సంవత్సరం మొదటి భాగంలో ఈ నదిపై వరదలను నివారించడానికి ఆనకట్టను నిర్మించిన తరువాత జలమార్గం ద్వారా వ్యాపారం ఆగిపోయింది. ఓడరేవు ప్రాంతం నెమ్మదిగా దాని ప్రాముఖ్యతను కోల్పోయింది. ప్రస్తుతం, ఇది రాయ్గంజ్ యొక్క అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది.
ప్రదేశం
ఈ పట్టణ విస్తీర్ణం సుమారు 36.51 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ప్రస్తుతం పట్టణీకరణ ధోరణి బాగా పెరుగుతుంది. సమీప ప్రాంతాలు కూడా ఈ పట్టణీకరణ ధోరణిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు బిర్ఘై, మరైకురా, రూపహార్, బాహిన్, కర్నోజోరా, మహారాజా హేట్ లు ఈ పట్టణ పరిధిలోని విస్తారమైన ప్రాంతాలు. వీటి జనాభా కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ జనాభా రాయ్గంజ్ పట్టణంపై ఆధారపడి ఉంది. [7]
పోలీస్ స్టేషన్లు
రాయ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయ్గంజ్ మునిసిపల్ ప్రాంతం, రాయ్నాజ్ సిడి బ్లాక్ లు ఉన్నాయి. ఈ పోలీసు స్టేషను పరిధి సుమారు 472.13 చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ పట్టణానికి రెండు పోలీసు ఔట్ పోస్టులున్నాయి. అవి మోహన్ బతి, బాండోర్ లు. ఇది కాకుండా మరో ఔట్ పోస్ట్ కరంజోరా అవుట్పోస్ట్ ఉంది. భతున్ వద్ద ఒక పోలీసు క్యాంప్ ఉంది. [8] [9]
రాయ్గంజ్ మహిళా పోలీస్ స్టేషన్ రాయ్గంజ్ వద్ద ఉంది. [8] [10]
సిడి బ్లాక్ హెడ్ క్వార్టర్స్
రాయ్గంజ్ సిడి బ్లాక్ యొక్క ప్రధాన కార్యాలయం రాయ్గంజ్ నగరంలో ఉంది. [11] [12]
జనాభా
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, రాయ్గంజ్ జనాభా 199,758. ఇందులో పురుషులు 104,966 మంది కాగా మహిళలు 94,792 మంది ఉన్నారు. ఈ జనాభాలో 0–6 సంవత్సరాల జనాభా 22,028 ఉంది. 7+ జనాభాకు సమర్థవంతమైన అక్షరాస్యత రేటు 81.71 శాతం ఉంది. [13]
భారతదేశ జనాభా యొక్క తాత్కాలిక నివేదికల ప్రకారం, 2011 లో రాయ్గంజ్ జనాభా 183,612, వీరిలో పురుషులు 96,388, మహిళలు 87,224 ఉన్నారు.రాయ్గంజ్ నగరంలో 183,612 జనాభా ఉన్నప్పటికీ, దాని పట్టణ / మెట్రోపాలిటన్ జనాభా 199,690, వీరిలో 104,733 మంది పురుషులు, 94,957 మంది మహిళలు ఉన్నారు.
రాయ్గంజ్ జనాభాలో 97.37% మంది ప్రజలకు హిందూ మతం ప్రధాన మతం. తర్వాత ఇస్లాం రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన మతం. ఒక్కడ ఇస్లాం మతాన్ని సుమారు 2.16% మంది దీనిని అనుసరిస్తున్నారు. క్రైస్తవ మతాన్ని 0.13%, జైన మతాన్ని 0.16%, సిక్కు మతాన్ని 0.05%, బౌద్ధమతాన్ని 0.05% అనుసరిస్తున్నారు. సుమారు 0.11% మంది 'ప్రత్యేక మతం లేదు'.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, రాయ్గంజ్ జనాభా 165,222. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. రాయ్గంజ్ సగటు అక్షరాస్యత రేటు 75%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 79%, స్త్రీ అక్షరాస్యత 71%. రాయ్గంజ్లో, జనాభాలో 11% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.
వాతావరణం
రాయ్గంజ్లో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది. జూలైలో సగటు అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, ఇది వెచ్చని నెల. ఈ నెలలో ఉష్ణోగ్రత 39 °C (102 °F) ఉంటుంది. జనవరి అతి శీతల నెల. ఈ నెలలో సుమారు 26 °C (79 °F) ఉంటుంది. సగటు వార్షిక ఉష్ణోగ్రత 24.9 °C (76.8 °F) . సగటున వార్షిక వర్షపాతం 1430 మిల్లీమీటర్లు ఉంటుంది. ఎక్కువ భాగం జూన్ నుండి సెప్టెంబర్ వరకు తడి వాతావరణం వస్తుంది. [14]
రవాణా
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/NBSTC%2C_Raiganj.jpg/220px-NBSTC%2C_Raiganj.jpg)
రిక్షాలు, ఆటో-రిక్షాలు, ఇ-రిక్షాలు, సిటీ ఆటోలు రాయ్గంజ్లో విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రజా రవాణా. ఈ వాహనదారులు చాలా మంది పట్టణ కేంద్రం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటారు. వారి స్వంత వాహనాలు, ఎక్కువగా మోటార్ సైకిళ్ళు, సైకిళ్ళు ఉన్నాయి .
రాయ్గంజ్ రైల్వే స్టేషన్ బార్సోయి-రాధికపూర్ బ్రాంచ్ లైన్లో ఉంది. ఈ ప్రాంతానికి రైల్వే సేవలు 150 సంవత్సరాల క్రితం నుండి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అయితే, 1971 లో ఇండో-బంగ్లాదేశ్ విభజన కారణంగా బంగ్లాదేశ్ ద్వారా ఈ సంబంధాలు పోయాయి. ప్రస్తుతం ఇక్కడ రైల్వే ఒక బ్రాంచ్ లైన్ మాత్రమే అయింది. NH 34 రాయ్గంజ్ గుండా వెళుతుంది. ఇది రాష్ట్ర రాజధాని కోల్కతాకు అనుసంధానించబడి ఉంది. రహదారిని నాలుగు లైన్లు (ఫోర్ లైన్స్) గా మార్చడం జరుగుతోంది. ప్రతిపాదిత రహదారి రాయ్గంజ్ను సుమారు 6కి.మీ దూరంలో ఉంది. రోజూ దల్ఖోలా వద్ద ట్రాఫిక్ జామ్ కారణంగా రోడ్డు కనెక్టివిటీ కి యిబ్బంది ఏర్పడుతుంది. స్టేషన్ బ్రాంచ్ లైన్లో ఉన్నందున రాయ్గంజ్కు రైల్వే కనెక్టివిటీ కూడా లేదు. 1960 వ దశకంలో, బ్రాడ్ గేజ్ లైన్ మాల్డా-బార్సోయి-డల్ఖోలాకు మార్చబడింది. [15]
రహదారులు
రాయ్గంజ్ను బస్సుల ద్వారా ఎన్బిఎస్టిసి, ప్రైవేట్ బస్సు సర్వీసుల ద్వారా కొన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించారు. NH 12, SH 10A దాని లైఫ్లైన్లు. [16] SH 10A కాలియాగంజ్, బాలుర్గంజ్,హిలి లను కలుపుతుంది. బలుర్ఘాట్, సిలిగురి, జల్పాయిగురి, అలీపుర్దువార్, కూచ్బెహార్, మాల్డా, కోల్కతా, మరికొన్ని ముఖ్యమైన నగరాలకు రోజంతా బస్సులు అందుబాటులో ఉన్నాయి. రాత్రిపూట బస్సు సౌకర్యాలు ఎక్కువగా కోల్కతా, ధుబ్రికి అందుబాటులో ఉన్నాయి.
రైల్వేలు
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/ca/RDP-SGUJ_DEMU_at_SGUJ.jpg/220px-RDP-SGUJ_DEMU_at_SGUJ.jpg)
రాయ్గంజ్ రైల్వే స్టేషన్ బార్సోయి-రాధికపూర్ బ్రాంచ్ లైన్లో ఉంది . రాధికాపూర్ ఎక్స్ప్రెస్ రైలు కోలకతా వెళ్ళేందుకు అందుబాటులో ఉంది. ఒక లింక్ సూపర్ఫాస్టు ఎక్స్ప్రెస్ రైలు, రాధికాపూర్-అనంద్విహార్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ వెళ్ళేందుకు అందుబాటులో ఉంది. కతిహార్కు వెళ్లే రెండు స్థానిక ప్యాసింజర్ రైళ్లు, సిలిగురి బౌండ్ డిఎంయు ప్యాసింజర్ను కూడా ఉంది..
పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతదేశానికి రైల్వే మంత్రిణిగా ఉన్న కాలంలో ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టును ప్రకటించింది. వీటి వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఆమె ప్రకటించిన ప్రాజెక్టులు:
- రాయ్గంజ్- దల్ఖోలా లైన్ (43.43 కిమీ)
- రాయ్గంజ్-ఇటాహర్-గాజోల్ లైన్
వైమానిక సేవలు
రాయ్గంజ్కు సొంత విమానాశ్రయం లేదు. రాయ్గంజ్ విమానాశ్రయం పేరుతో రాయ్గంజ్లోని విమానాశ్రయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
సమీప ఆపరేటింగ్ విమానాశ్రయం సిలిగురికి సమీపంలో ఉన్న బాగ్డోగ్రా విమానాశ్రయం. ఇది రాగంజ్ నుండి సుమారు 166 కి.మీ దూరంలో ఉంది. ఇండిగో, స్పైస్జెట్ లు ఢిల్లీ, కోలకతా, హైదరాబాద్, గౌహతి, ముంబై, చెన్నై, బ్యాంకాక్, పారో, చండీగఢ్విమానాశ్రయాలకు వెళ్లే విధంగా సేవలనందిస్తున్నాయి..
పర్యాటక రంగం
రాయ్గంజ్ పక్షుల అభయారణ్యం
రాయ్గంజ్ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి, కులిక్ నది ప్రక్కన 35 ఎకరాల విస్తీర్ణం , 286 ఎకరాల బఫర్ ప్రాంతం ఉన్న రాయ్గంజ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఇది ఆసియాలో అతిపెద్ద పక్షుల అభయారణ్యం. అటవీ, నీటి వనరుల మూలంగా అనేక పక్షులు ఈ ప్రాంతానికి వస్తాయి. దక్షిణ బిల్ ఆసియా దేశాలు, తీర ప్రాంతాల నుండి ఓపెన్ బిల్ కొంగ, నైట్ హెరాన్, కార్మోరెంట్, చిన్న కార్మోరెంట్, ఎగ్రెట్ వంటి వలస పక్షులను ఈ ప్రాంతం ఆకర్షిస్తాయి. పావురం, బుల్బుల్, పిచ్చుక, కింగ్ఫిషర్, వడ్రంగిపిట్ట, గుడ్లగూబ, బాతు, కోకిల వంటి స్థానిక పక్షులను కూడా పెద్ద సంఖ్యలో చూడవచ్చు.
వలస పక్షులు మే చివరి వారం నుండి జూలై మొదటి వారం వరకు వస్తాయి. డిసెంబర్ మధ్య నుండి జనవరి చివరి వరకు ఇక్కడి నుండి బయలుదేరుతాయి. అవి గూడు కట్టుకునే సమయం జూలై నుండి ఆగస్టు వరకు ఉంటుంది. అవి ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు గ్రుడ్లు పెడతాయి. అక్టోబర్ నుండి నవంబర్ వరకు చిన్న పక్షి పిల్లలకు ఎగిరేందుకు శిక్షణ సమయం. ప్రతి శీతాకాలంలో దాదాపు 150 వేర్వేరు పక్షి జాతులు ఉత్తరం నుండి 65,000 నుండి 75,000 వరకు ఇక్కడకు వస్తాయి.
ఈ అభయారణ్యం కులిక్ నదికి అనుసంధానించబడిన మానవ నిర్మిత కాలువల యొక్క కృత్రిమ నెట్వర్క్ను కలిగి ఉంది. రుతుపవనాల నెలలలో నది నుండి వచ్చే వరద నీరు అభయారణ్యం యొక్క మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా పక్షి జాతులకు ఆహారానికి ముఖ్యమైన వనరుగా పనిచేస్తుంది.
అడవి యొక్క చట్టపరమైన స్థితి:
రిజర్వు ఫారెస్ట్ | 573.71 ఎకరాలు |
రక్షిత అటవీ ప్రాంతం | 249.50 ఎకరాలు |
వర్గీకరించని అటవీ ప్రాంతం | 660.54 ఎకరాలు |
మొత్తం అటవీ ప్రాంతం | 1483.75 ఎకరాలు = 610.71 హెక్టారు = 6.01 చ. కి.మీ. |
ఈ పక్షుల అభయారణ్యం పునరుజ్జీవనం కానుంది, త్వరలోనే జింకల ఉద్యానవనం, తాబేలు పార్కును అభయారణ్యం యొక్క ప్రధాన భాగంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. [17]
రాయ్గంజ్ చర్చి
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f5/Raiganj_Church.jpg/220px-Raiganj_Church.jpg)
రాయ్గంజ్ చర్చి సెయింట్ జోసెఫ్ కు అంకితం చేయబడింది. అతను రాగంజ్ డియోసెస్ యొక్క పోషకుడు. విశాలమైన భవనంలో గాజు, పైకప్పు పెయింటింగ్లు ఉన్నాయి. రెండు వైపులా ముఖ్యమైన స్తంభాలు గ్రీకు స్తంభాలు గా తీర్చిదిద్దబడినవి. చెక్కిన తలుపులు, దాని పైన షట్కోణ గోపురం ఉన్న ఎత్తైన కట్టడం ఉన్నాయి.
జైన దేవాలయాలు
అయోధ్య ప్రాంతం ఆదినాథ్, అజిత్నాథ్, అభినందన్నాథ్, సుమతినాథ్, అనంతనాథ్ అనబడే ఐదుగురు తీర్థంకరుల జన్మస్థానం. శ్రీ 1008 దిగమాబార్ ఆదినాథ్ జైన మందిర్ అయోధ్యలోని అత్యంత గుర్తింపు పొందిన ఆలయం. నిలబడి ఉన్న భంగిమలో 31 అడుగుల పొడవైన ఆదినాథ్ విగ్రహం ఇక్కడ ఉంది. ఈ స్థలాన్ని ఇటీవల ఆచార్య రత్న దేశ్భూషణ్జీ మహారాజ్, గనిని ప్రముఖ్ ఆరిక జ్ఞానమతి మాతాజీ ఆశీర్వాదంతో అభివృద్ధి చేశారు. 30 సెం.మీ రాగి రంగు విగ్రహంతో అజిత్నాథ్ కు అంకితం చేసిన ప్రసిద్ధ శ్వేతాంబర్ ఆలయం ఉంది. కమల్ మందిర్, చౌబిసి ఆలయంతో సహా ఇతర జైన దేవాలయాలు ఉన్నాయి. [18] [19] [20]
మూలాలు
బాహ్య లింకులు
Raiganj travel guide from Wikivoyage