భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు | |
---|---|
రకం | రాష్ట్రాల సమాఖ్య |
స్థానం | భారతదేశం |
సంఖ్య | 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు |
జనాభా వ్యాప్తి | రాష్ట్రాలు: సిక్కిం - 610,577 (అత్యల్ప); ఉత్తర ప్రదేశ్ - 199,812,341 (అత్యధిక) కేంద్రపాలిత ప్రాంతాలు : లక్షద్వీప్ - 64,473 (అత్యల్ప); ఢిల్లీ - 16,787,941 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | రాష్ట్రాలు : 3,702 km2 (1,429 sq mi) గోవా – 342,269 km2 (132,151 sq mi) రాజస్థాన్ కేంద్ర భూభాగాలు: 32 km2 (12 sq mi) లక్షద్వీప్ – 59,146 km2 (22,836 sq mi) లడఖ్ |
ప్రభుత్వం | రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం (కేంద్ర భూభాగాలు) |
ఉప విభజన | జిల్లాలు, పరిపాలనా విభాగాలు |
బాధ్యతలు, అధికారాలు
భారత రాజ్యాంగం రాష్ట్ర భూభాగానికి సంబంధించి సార్వభౌమిక కార్యనిర్వాహక, శాసన అధికారాలను కేంద్రానికి రాష్ట్రాలకు పంచింది.[1]
చరిత్ర
స్వాతంత్రానికి పూర్వం
చరిత్రలో భారతీయ ఉపఖండాన్ని అనేక విభిన్న జాతుల వారు పాలించారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో పరిపాలనా విభజన కోసం వారి స్వంత విధానాలను ఏర్పాటు చేశారు.[2][3][4][5][6][7][8][9][10] బ్రిటిష్ పాలన కాలంలోను, అంతకు ముందరి మొఘలు పరిపాలనా విధానాన్నే ఎక్కువగా ఉంచేసారు.భారతదేశాన్ని ప్రావిన్స్లుగా (ప్రెసిడెన్సీలు అని కూడా అంటారు) విభజించారు. వీటిని బ్రిటిషు వారు నేరుగా పాలించారు. కొన్ని సంస్థానాలను సంస్థాధీశులు నేరుగా పరిపాలించినప్పటికీ, వీటిని స్థానిక రాజో యువరాజో నామమాత్రంగా నియంత్రించేవారు. ఈ రాజు బ్రిటిషు సామ్రాజ్యానికి విధేయుడుగా ఉండేవాడు. అంతిమంగా బ్రిటిషు వారు సంస్థానాలపై వాస్తవ సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవారు.
1947-1950
1947-1950 ల మధ్య సంస్థానాలు రాజకీయంగా భారత యూనియన్లో కలిసిపోయాయి. వీటిలో చాలావరకు అప్పటికే ఉన్న ప్రావిన్సులలో విలీనం కాగా, మిగిలినవి రాజ్పుతానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య భారత్, వింధ్య ప్రదేశ్ వంటివి బహుళ రాచరిక రాష్ట్రాలుగా ఏర్పాటయ్యాయి. మైసూరు, హైదరాబాదు, భోపాల్, బిలాస్పూర్ వంటివి ప్రత్యేక ప్రావిన్సులుగా మారాయి. 1950 జనవరి 26 న అమల్లోకి వచ్చిన కొత్త రాజ్యాంగం ప్రకారం భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది. కొత్త రిపబ్లిక్ను "యూనియన్ ఆఫ్ స్టేట్స్" గా ప్రకటించారు.[11] 1950 రాజ్యాంగం మూడు ప్రధాన రకాల రాష్ట్రాలను నిర్వచించింది:
- పార్ట్ ఎ రాష్ట్రాలు: బ్రిటిష్ ఇండియా లోని మాజీ గవర్నర్ల ప్రావిన్సులు, ఎన్నికైన గవర్నరు, రాష్ట్ర శాసనసభలు పాలించాయి. ఈ విభాగం లోని తొమ్మిది రాష్ట్రాలు అస్సాం, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ (పూర్వం సెంట్రల్ ప్రావిన్స్, బెరార్), మద్రాస్, ఒరిస్సా, పంజాబ్ (పూర్వం తూర్పు పంజాబ్), ఉత్తర ప్రదేశ్ (గతంలో యునైటెడ్ ప్రావిన్సెస్), పశ్చిమ బెంగాల్ (గతంలో బెంగాల్లో భాగం).
- ఎనిమిది పార్ట్ బి రాష్ట్రాలు: వీటిలో పూర్వపు రాచరిక రాష్ట్రాలు లేదా రాచరిక రాష్ట్రాల సమూహాలు. వీటిని రాజ్ప్రముఖ్ (సాధారణంగా రాజ్యాంగ బద్ధంగా పాలకుడు), ఎన్నుకోబడిన శాసనసభలు పాలిస్తారు. రాజ్ప్రముఖ్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ రాష్ట్రాలు హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పాటియాలా, తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పిఇపిఎస్యు), రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్-కొచ్చిన్ .
- పది పార్ట్ సి రాష్ట్రాలు: వీటిలో మాజీ చీఫ్ కమిషనర్ల ప్రావిన్సులు, కొన్ని రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి,, ప్రతి ఒక్కటి భారత రాష్ట్రపతి నియమించిన చీఫ్ కమిషనర్ చేత పాలించబడుతుంది. పార్ట్ సి రాష్ట్రాలు అజ్మీర్, భోపాల్, బిలాస్పూర్, కూర్గ్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కచ్, మణిపూర్, త్రిపుర, వింధ్య ప్రదేశ్ .
- పార్ట్ డి రాష్ట్రం ఇది ఒక్కటే: అండమాన్, నికోబార్ దీవులు, వీటిని కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తారు.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (1951-1956)
గతంలో ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న పాండిచ్చేరి, కారైకల్, యానాం, మహే లని కలిపి 1954 లో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసారు.[12] మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఉత్తర జిల్లాలను విడదీసి, 1953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచారు.[13]
1956 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం భాష ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించింది. దీని ఫలితంగా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.[14] ఈ చట్టం ఫలితంగా, మద్రాస్ రాష్ట్రం లోని కన్యాకుమారి జిల్లాను చేర్చడంతో ట్రావెన్కోర్-కొచ్చిన్ ఏర్పడింది . విలీనం రూపొందించారు ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలనూ కలిపి 1956 నవంబరు 1 న ఆంధ్ర ప్రదేశ్ను ఏర్పరచారు. మద్రాస్ రాష్ట్రంలోని మలబార్ జిల్లా, దక్షిణ కెనరా జిల్లా లోని కాసరగోడ్ తాలూకాలను ట్రావెన్కోర్-కొచ్చిన్తో విలీనం చేసి కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. మద్రాస్ రాష్ట్రం నుండి బళ్లారి, దక్షిణ కెనరా జిల్లాలు (కాసరగోడ్ తాలూకా మినహా), కోయంబత్తూర్ జిల్లాలోని కొల్లెగల్ తాలూకాలు, బొంబాయి రాష్ట్రం లోని బెల్గాం, బీజాపూర్, ఉత్తర కెనరా, ధార్వాడ్ జిల్లాలను, హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ మట్లాడే బీదర్, రాయచూర్, గుల్బర్గా జిల్లాలనూ కూర్గ్ ప్రావిన్సునూ, మైసూరు రాష్ట్రంతో కలిపి కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. మద్రాస్ రాష్ట్రంలోని దక్షిణ కెనరా, మలబార్ జిల్లాల్లో ఉండే లక్కదీవులను విడదీసి, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పరచారు. మధ్యప్రదేశ్లోని నాగ్పూర్ డివిజన్లోని మరాఠీ మాట్లాడే జిల్లాలు, హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతం, సౌరాష్ట్ర రాష్ట్రం, కచ్ స్టేట్ను చేర్చడం ద్వారా బొంబాయి రాష్ట్రాన్ని విస్తరించారు. రాజస్థాన్ లోకి, అజ్మీర్ పంజాబ్ లోకి, పాటియాలా, తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ లను కలిపారు.బీహార్ లోని కొన్ని ప్రాంతాలను పశ్చిమ బెంగాల్కు బదిలీ చేసారు.
1960 మే 1 న బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా బొంబాయి రాష్ట్రాన్ని గుజరాత్, మహారాష్ట్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించారు.[15] 1963 డిసెంబరు 1 న నాగాలాండ్ ఏర్పడింది.[16] 1966 పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఫలితంగా నవంబరు 1 న హర్యానా ఏర్పడింది. పంజాబ్ రాష్ట్రపు ఉత్తర జిల్లాలను హిమాచల్ ప్రదేశ్కు బదిలీ చేసారు.[17] ఈ చట్టం ప్రకారమే చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగాను, పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధానిగానూ ఏర్పాటు చేసారు.[18][19]
1968 లో మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చారు. 1972 జనవరి 21 న ఈశాన్యంలో మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలని ఏర్పాటు చేసారు.[20] 1973 లో మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకఅని పేరు మార్చారు. 1975 మే16 న సిక్కిం భారతదేశపు 22 వ రాష్ట్రంగా అవతరించింది. అక్కడ రాచరికాన్ని రద్దు చేసారు.[21] 1987 లో, ఫిబ్రవరి 20 న అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలు అవతరించగా, మే 30 న గోవా రాష్ట్రం, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.[22]
2000 నవంబరులో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పరచారు. అవి, తూర్పు మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్, వాయవ్య ఉత్తర ప్రదేశ్ నుండి ఉత్తరాంచల్ (2007 లో ఈ పేరును ఉత్తరాఖండ్గా పేరు మార్చారు), బీహార్ దక్షిణ జిల్లాల నుండి జార్ఖండ్.[23][24][25][26] ఒరిస్సా రాష్ట్రం పేరును 2011 లో ఒడిషాగా మార్చారు. 2014 జూన్ 2 న వాయవ్య ఆంధ్రప్రదేశ్లోని పది జిల్లాలను విడదీసి, తెలంగాణను ఏర్పరచారు.[27][28]
2019 ఆగస్టులో, భారత పార్లమెంటు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ను ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడానికి ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి; 2019 అక్టోబరు 31 నుండి అమలులోకి వచ్చింది.[29]
2019 నవంబరులో, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి భారత ప్రభుత్వం చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిని దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యు అని పిలుస్తారు, ఇది 2020 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.[30][31][32]
రాష్ట్రాలు
వరుస సంఖ్య | రాష్ట్రం | ఐఎస్ఒ 3166-2:ఐఎన్ | వాహన రిజిస్ట్రేషను కోడ్ | ప్రాంతం | రాజధాని | అతిపెద్ద నగరం | రాష్ట్రావతరణ | జనాభా[33] | విస్తీర్ణం (చ.కి.మీ.) | అధికారిక భాషలు [34] | అదనపు అధికారిక భాషలు [34] |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ఆంధ్రప్రదేశ్ | IN-AP | AP | దక్షిణ | అమరావతి Note 1[35] | విశాఖపట్నం | 1953 అక్టోబరు 1 | 49,506,799 | 160,205 | తెలుగు | — |
2 | అరుణాచల్ ప్రదేశ్ | IN-AR | AR | ఈశాన్య | ఇటానగర్ | 1987 ఫిబ్రవరి 20 | 1,383,727 | 83,743 | ఇంగ్లీషు | — | |
3 | అసోం | IN-AS | AS | ఈశాన్య | దిస్పూర్ | గువహాటి | 1950 జనవరి 26 | 31,205,576 | 78,550 | అస్సామీ | బెంగాలీ, బోడో |
4 | బీహార్ | IN-BR | BR | తూర్పు | పాట్నా | 1950 జనవరి 26 | 104,099,452 | 94,163 | హిందీ | ఉర్దూ | |
5 | చత్తీస్గఢ్ | IN-CT | CG | మధ్య | నయా రాయ్పూర్ | 2000 నవంబరు 1 | 25,545,198 | 135,194 | హిందీ | — | |
6 | గోవా | IN-GA | GA | పశ్చిమ | పనాజీ | వాస్కో డా గామా | 1987 మే 30 | 1,458,545 | 3,702 | కొంకణి | ఇంగ్లీషు, మరాఠీ |
7 | గుజరాత్ | IN-GJ | GJ | పశ్చిమ | గాంధీనగర్ | అహ్మదాబాదు | 1960 మే 1 | 60,439,692 | 196,024 | గుజరాతీ | — |
8 | హర్యానా | IN-HR | HR | ఉత్తర | చండీగఢ్ | ఫరీదాబాదు | 1966 నవంబరు 1 | 25,351,462 | 44,212 | హిందీ | పంజాబీ[36][37] |
9 | హిమాచల్ ప్రదేశ్ | IN-HP | HP | ఉత్తర | సిమ్లా (వేసవి)ధర్మశాల (శీతాకాలం) | సిమ్లా | 1971 జనవరి 25 | 6,864,602 | 55,673 | హిందీ | ఇంగ్లీషు |
10 | జార్ఖండ్ | IN-JH | JH | తూర్పు | రాంచీ | జంషెడ్పూర్ | 2000 నవంబరు 15 | 32,988,134 | 74,677 | హిందీ | ఉర్దూ[38] |
11 | కర్ణాటక | IN-KA | KA | దక్షిణ | బెంగుళూరు | 1956 నవంబరు 1 | 61,095,297 | 191,791 | కన్నడ | ఇంగ్లీషు | |
12 | కేరళ | IN-KL | KL | దక్షిణ | తిరువనంతపురం | కొచ్చి | 1956 నవంబరు 1 | 33,406,061 | 38,863 | మలయాళం | ఇంగ్లీషు |
13 | మధ్య ప్రదేశ్ | IN-MP | MP | మధ్య | భోపాల్ | ఇండోర్ | 1956 నవంబరు 1 | 72,626,809 | 308,252 | హిందీ | — |
14 | మహారాష్ట్ర | IN-MH | MH | పశ్చిమ | ముంబై (వేసవి)నాగపూర్ (శీతాకాలం)[39] | ముంబై | 1960 మే 1 | 112,374,333 | 307,713 | మరాఠీ | — |
15 | మణిపూర్ | IN-MN | MN | ఈశాన్య | ఇంఫాల్ | 1972 జనవరి 21 | 2,855,794 | 22,347 | మీటీ | ఇంగ్లీషు | |
16 | మేఘాలయ | IN-ML | ML | ఈశాన్య | షిల్లాంగ్ | 1972 జనవరి 21 | 2,966,889 | 22,720 | ఇంగ్లీషు | Khasi[a] | |
17 | మిజోరం | IN-MZ | MZ | ఈశాన్య | ఐజాల్ | 1987 ఫిబ్రవరి 20 | 1,097,206 | 21,081 | ఇంగ్లీషు, హిందీ, మిజో | — | |
18 | నాగాలాండ్ | IN-NL | NL | ఈశాన్య | కోహిమా జిల్లా | దీమాపూర్ జిల్లా | 1963 డిసెంబరు 1 | 1,978,502 | 16,579 | ఇంగ్లీషు | — |
19 | ఒరిస్సా | IN-OR | OD | తూర్పు | భుబనేశ్వర్ | 1936 ఏప్రిల్ 1 | 41,974,218 | 155,820 | ఒడియా | — | |
20 | పంజాబ్ | IN-PB | PB | ఉత్తర | చండీగఢ్ | Ludhiana | 1966 నవంబరు 1 | 27,743,338 | 50,362 | పంజాబీ | — |
21 | రాజస్థాన్ | IN-RJ | RJ | ఉత్తర | జైపూర్ | 1956 నవంబరు 1 | 68,548,437 | 342,269 | హిందీ | ఇంగ్లీషు | |
22 | సిక్కిం | IN-SK | SK | ఈశాన్య | గాంగ్టక్ | 1975 మే 16 | 610,577 | 7,096 | నేపాలీ, ఇంగ్లీషు | భూటియా, గురుంగ్, లెప్చా, లింబు, మంగర్, ముఖియా, నెవారి, రాయ్, షెర్పా, తమంగ్ | |
23 | తమిళనాడు | IN-TN | TN | దక్షిణ | చెన్నై | 1950 జనవరి 26 | 72,147,030 | 130,058 | తమిళం | ఇంగ్లీషు | |
24 | తెలంగాణ | IN-TG | TS | దక్షిణ | హైదరాబాదు Note 1 | 2014 జూన్ 2 | 35,193,978[40] | 114,840[40] | తెలుగు, ఉర్దూ[41] | — | |
25 | త్రిపుర | IN-TR | TR | ఈశాన్య | అగర్తలా | 1972 జనవరి 21 | 3,673,917 | 10,492 | బెంగాలీ, ఇంగ్లీషు, కోక్బోరోక్ భాష | — | |
26 | ఉత్తర ప్రదేశ్ | IN-UP | UP | ఉత్తర | లక్నో | కాన్పూర్ | 1950 జనవరి 26 | 199,812,341 | 243,286 | హిందీ | ఉర్దూ |
27 | ఉత్తరాఖండ్ | IN-UT | UK | ఉత్తర | డెహ్రాడూన్ Note 2 | 2000 నవంబరు 9 | 10,086,292 | 53,483 | హిందీ | సంస్కృతం[42] | |
28 | పశ్చిమ బెంగాల్ | IN-WB | WB | తూర్పు | కోల్కాతా | 1950 జనవరి 26 | 91,276,115 | 88,752 | బెంగాలీ, నేపాలీ[b] | హిందీ, ఒడియా, పంజాబీ, సంతాలీ, ఉర్దూ |
- ^Note 1 2014 జూన్ 2 న ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణను ఏర్పాటు చేసారు.[43][44] తెలంగాణ లోని హైదరాబాదు తెలంగాణాకు రాజధాని. ఆంధ్రప్రదేశ్కు కూడా గరిష్ఠంగా పదేళ్ళ పాటు రాజధానిగా ఉంతుంది.[45] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త రాజధాని అమరావతికి 2017 లోనే ప్రభుత్వాన్ని శాసనసభనూ తరలించింది.[35]
- ^Note 2 ఉత్తరాఖండ్కు డెహ్రాడూన్ తాత్కాలిక రాజధాని. రాష్ట్రానికి కొత్త రాజధానిగా గెయిర్సైన్ ను నిర్ణయించారు.
కేంద్ర పాలిత ప్రాంతాలు
వరుస సంఖ్య | కేంద్ర భూభాగం | ISO 3166- 2: IN | వాహన నమోదు కోడ్ | రాజధాని | అతిపెద్ద నగరం | జనాభా [33] | ప్రాంతం (కిమీ 2 ) | అధికారిక భాషలు [34] | అదనపు అధికారిక భాషలు [34] |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | అండమాన్, నికోబార్ దీవులు | IN-AN | AN | పోర్ట్ బ్లెయిర్ | 380.581 | 8.249 | ఇంగ్లీష్, హిందీ | ||
2 | చండీగఢ్ | IN-CH | CH | చండీగఢ్ | - [c] | 1.055.450 | 114 | ఆంగ్ల | |
3 | దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ | IN-DD | DD | డామన్ | 586.956 | 603 | ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కొంకణి | హిందీ | |
4 | ఢిల్లీ | IN-DL | DL | న్యూఢిల్లీ | - [d] | 16.787.941 | 1,490 | హిందీ | పంజాబీ, ఉర్దూ [46] |
5 | జమ్మూ కాశ్మీరు | IN-JK | JK | శ్రీనగర్ (వేసవి కాలం) జమ్మూ (శీతాకాలం) | శ్రీనగర్ | 12.258.433 | 55,538 Note 3 | హిందీ, ఇంగ్లీష్ | డోగ్రి, కాశ్మీరీ, ఉర్దూ |
6 | లడఖ్ | IN-LH | LA | లేహ్, కార్గిల్ | లేహ్ | 290.492 | 174,852 Note 4 | లద్దాఖీ | బల్టీ |
7 | లక్షద్వీప్ | IN-LD | LD | కవరట్టి | 64.473 | 32 | మలయాళం | ఆంగ్ల | |
8 | పుదుచ్చేరి | IN-PY | PY | పాండిచ్చేరి | 1.247.953 | 492 | ఇంగ్లీష్,[47] తమిళం | మలయాళం, తెలుగు |
^Note 3 జమ్మూకాశ్మీరులో 42,241 చ.కి.మీ. భూభాగాన్ని భారత్ పాలిస్తూండగా, 13,297 చ.కి.మీ. భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. కాశ్మీరు ప్రభువు మహారాజా హరిసింగ్ భారత్లో కలవాలని 1947 అక్టోబరు 26 న సంతకం చేసాడు కాబట్టి, ఈ భూభాగం కూడా చట్టపరంగా భారత్దే.
^Note 4 లడాఖ్లో 59,146 చ.కి.మీ. భూభాగం భారత్ నియంత్రణలో ఉంది. 72,971చ.కి.మీ. భూభాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. ఇదే కాకుండా పాకిస్తాన్ 5,180 చ.కి.మీ. భూభాగాన్ని కారకోరం రహదారి కోసం చైనాకు అప్పజెప్పింది. లడాఖ్లో మరో 37,555 చ.కి.మీ. అక్సాయ్చిన్ ప్రాంతం చైనా ఆక్రమణలో ఉంది. ఈ భూభాగాలన్నీ భారత్వేనని భారత్ వాదన.
పూర్వపు రాష్ట్రాలు
మ్యాప్ | రాష్ట్రం | రాజధాని | ఇయర్స్ | తదుపరి ఏర్పడిన రాష్ట్రాలు లేక కేంద్రపాలిత ప్రాంతాలు |
---|---|---|---|---|
మధ్య భారత్ | ఇండోర్ (వేసవి) గ్వాలియర్ (శీతా) | 1947-1956 | మధ్యప్రదేశ్ | |
తూర్పు రాష్ట్రాల యూనియన్ | రాయ్పూర్ | 1947-1948 | బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ | |
మద్రాస్ రాష్ట్రం | మద్రాస్ | 1950-1969 | ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక | |
మైసూర్ రాష్ట్రం | మైసూర్ | 1947-1973 | కర్ణాటక | |
పాటియాలా, తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ | పాటియాలా | 1948-1956 | పంజాబ్ | |
బొంబాయి రాష్ట్రం | బాంబే | 1947-1960 | మహారాష్ట్ర, గుజరాత్ | |
భోపాల్ రాష్ట్రం | భూపాల్ | 1949-1956 | మధ్యప్రదేశ్ | |
సౌరాష్ట్ర | రాజ్కోట్ | 1948-1956 | బొంబాయి రాష్ట్రం | |
కూర్గ్ రాష్ట్రం | మడికేరి | 1950-1956 | మైసూర్ రాష్ట్రం | |
ట్రావెన్కోర్-కొచ్చిన్ | త్రివేండ్రం | 1949-1956 | కేరళ, మద్రాస్ రాష్ట్రం | |
హైదరాబాద్ రాష్ట్రం | హైదరాబాద్ | 1948-1956 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (2014 నుండి), పాక్షికంగా మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక | |
వింధ్య ప్రదేశ్ | రేవా | 1948-1956 | మధ్యప్రదేశ్ | |
కచ్ స్టేట్ | భుజ్ | 1947-1956 | బొంబాయి రాష్ట్రం | |
బిలాస్పూర్ రాష్ట్రం | బిలాస్పూర్ | 1948-1954 | హిమాచల్ ప్రదేశ్ | |
కూచ్ బెహర్ రాష్ట్రం | కూచ్ బెహర్ | 1949 | పశ్చిమ బెంగాల్ | |
అజ్మీర్ రాష్ట్రం | అజ్మీర్ | 1947-1956 | రాజస్థాన్ | |
జమ్మూ కాశ్మీరు | శ్రీనగర్ (వేసవి) </br> జమ్మూ (వింటర్) | 1954-2019 | జమ్మూ కాశ్మీర్, |
ఇవి కూడా చూడండి
మూలాలు
Notes
Citations