లోక్ ఇన్సాఫ్ పార్టీ
లోక్ ఇన్సాఫ్ పార్టీ అనేది పంజాబ్ లోని రాజకీయ పార్టీ. 2016లో సిమర్జిత్ సింగ్ బైన్స్ ఈ పార్టీని స్థాపించాడు. ఇది 2017 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుతో ఐదు స్థానాల్లో పోటీ చేసింది.[2]
లోక్ ఇన్సాఫ్ పార్టీ | |
---|---|
Chairperson | బల్వీందర్ సింగ్ బెయిన్స్ |
స్థాపన తేదీ | 2016 అక్టోబరు 28[1] (7 సంవత్సరాలు, 217 రోజులు ago) |
కూటమి |
|
లోక్సభ స్థానాలు | 0/543 |
రాజ్యసభ స్థానాలు | 0 / 245 |
శాసన సభలో స్థానాలు | 0 / 117 |
2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు
ఈ పార్టీ 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడింది.[3] ఐదు స్థానాలకు గానూ ఆ పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే పొందగలిగింది. ఐదు స్థానాల్లో 26.46% ఓట్లు రాగా, మొత్తం 1.22% ఓట్లు వచ్చాయి. సిమర్జిత్ సింగ్ బైన్స్ ఆటమ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని, బల్వీందర్ సింగ్ బైన్స్ లుధియానా సౌత్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకున్నారు.
2019 సాధారణ ఎన్నికలు
2019 భారత సార్వత్రిక ఎన్నికలలో, పంజాబ్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యునిగా పంజాబ్లోని మూడు లోక్సభ స్థానాల్లో పార్టీ పోటీ చేసింది; అయితే, ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు.[4] ఇవి ఉన్నాయి: