గొంతునొప్పి

వేడి ద్రవ పదార్ధాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. వేడి పాలల్లో మిరియాలపొడి కలిపి త్రాగితే గొంతునొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో నిమ్మరసం, ఉప్పు, పంచదార కలిపి త్రాగినా ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి తో తినడం, మాట్లాడలని బాధాకరంగా ఉంటుంది. ఇది గొంతు బిగ్గరగా ( బొంగుగా ), ఉండటం, నొప్పిగా ఉండటం వంటివి మనుషులకు ఉంటాయి. గొంతునొప్పి కి జలుబు, ఫ్లూ , బ్యాక్టీరియా వంటివి వైరల్ సంక్రమణ కు కారణాలు. గొంతు నొప్పి తో భాధ లేదు , కానీ శ్వాస తీసుకోవడం , వంటి వి ఉంటాయి .సాధారణంగా, ఇంటి చిట్కాలు నివారణలు కొంత వరకు ఉపశమనం కలిగిస్తాయి. అయితే, కొన్నిసార్లు దీనికి వైద్య చికిత్స అవసరం. సాధారణ జలుబు ఇన్ఫ్లుఎంజా ఎప్స్టీన్ బార్ వైరస్ (EBV), ఇది అంటు మోనోన్యూక్లియోసిస్ (మోనో) కు దారితీస్తుంది, దీనిని కొన్నిసార్లు గ్రంధి జ్వరం అని పిలుస్తారు.లక్షణాలు ఎక్కువ గా ఉంటే, వైద్యుడి సంప్రదించడం , వైద్యులు వైరస్ కోసం యాంటీబయాటిక్స్ మందులను సూచించడు. రోగ గ్రస్తులు ఎక్కువగా గొంతు నొప్పితో ఉండటం ,శ్వాస తీసుకోవడం, మింగడం, నోరు తెరవడం కష్టం గా ఉండటం ,ముఖం లేదా మెడలో వాపు, 101 ° F లేదా అంతకంటే ఎక్కువ జ్వరం లాలాజలం లేదా శ్లేష్మం లో రక్తం పడటం ,మెడలో గడ్డలు 2 వారాలకు పైగా ఉంటే ,చెవిపోటు , దద్దుర్లు ( శరీరం పై ఉండటం వంటివి ఉంటే రోగ నివారణకు డాక్టర్ల ను సంప్రదించవలెను [1] వైద్యులు వివిధ రకమైన పరీక్షలతో గుర్తించి , మందులు వ్యాధి గ్రస్తులకు వాడమని సలహాలు ఇస్తారు [2]

గొంతు నొప్పి
చిన్న పిల్ల వానిలో కోరింతదగ్గు

కోరింత దగ్గు లక్షణములు (హూపింగ్ దగ్గు ,పెర్టుస్సిస్) తొందరగా అంటుకొనే శ్వాసకోశ సంక్రమణ. చాలా మందిలో, ఇది తీవ్రమైన హ్యాకింగ్ దగ్గుతో గుర్తించబడింది, తరువాత అధిక శ్వాస తీసుకోవడం "హూప్" లాగా ఉంటుంది. దీని నివారణ వ్యాక్సిన్ చేయడానికి ముందు, హూపింగ్ దగ్గు బాల్య వ్యాధిగా పరిగణించబడింది. ఇప్పుడు కోరింత దగ్గు ప్రధానంగా టీకాల ఇవ్వడం , చిన్న పిల్లలలో ప్రభావితం చేస్తుంది , బాల్య వయసుతో ఉన్నవారు ,పెద్దలలో రోగనిరోధక శక్తి పోతుంది ,కోరింత దగ్గుతో సంబంధం ఉన్న మరణాలు చాలా అరుదు ,కాని శిశువులలో సంభవిస్తాయి. అందువల్ల గర్భిణీ స్త్రీలకు ,శిశువుతో సంబంధాలు కలిగి ఉన్న ఇతర వ్యక్తులకు, కోరింత దగ్గుకు టీకాలు వేయడం చాలా ముఖ్యం. కోరింత దగ్గు బారిన పడిన తర్వాత, లక్షణాలు కనిపించడానికి ఏడు నుండి పది రోజులు పడుతుంది, అయినప్పటికీ ఇది కొన్నిసార్లు ఎక్కువ సమయం పడుతుంది. కారుతున్న ముక్కు,ముక్కు దిబ్బెడ, కళ్ళలో నీరు రావడం ,జ్వరం,దగ్గు, కోరింతదగ్గుకు సామాన్యమైన సంకేతములు . వారం లేదా రెండు తరువాత, లక్షణాలు తీవ్రమవుతాయి. తీవ్రంగా ఉంటే ఈ లక్షణములు లేకున్నా కొరింత దగ్గు మనుషులకు రావచ్చును . ఇంజక్షనులు , మందుల ద్వారా కోరింతదగ్గును పరీక్షలు జరిపి ఈ వ్యాధిని నిరోధించ వచ్చును [3] [4]

భారతదేశములో కోరింత దగ్గుతో 2015 లెక్కల ప్రకారం చూస్తే 31482 ప్రజలు మరణించారు [5]

గొంతునొప్పికి కారణాలు

మూలాలు