బొరుగులు

మరమరాలను వివిధ ప్రాంతాల్లో బొరుగులు, ముర్ముర్లు, మురీలు (ఆంగ్లం: Puffed rice) అని కూడా అంటారు.జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి చేసిన పేలపిండిని రైతులు తొలి ఏకాదశి రోజున కచ్చితంగా తింటారు.[1][2]

మరమరాలు.
బొరుగులు

తయారుచేసే విధానం

  1. వరిని ఉడకబెట్టండి
  2. నీరు వంచి వెయ్యండి
  3. ఎండ బెట్టండి
  4. పొట్టు తీసివెయ్యండి
  5. ఒక గిన్నెలో ఇసుక వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించండి
  6. జల్లెడ పట్టి ఇసుకని తీసివెయ్యండి

ఉపయోగాలు

మరమరాలు చాలా తేలినకైన ఆహారం. చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. సోడియం తక్కువగా ఉండటం లన రక్తపోటు స్థిరంగా ఉంటుంది ఇది సాధారణంగా అల్పాహారం తృణధాన్యాలు, ఉప్మా, [3] బేల్ పూరి వంటి చిరుతిండ్లు, మిఠాయి లలో ఉపయోగించబడుతుంది. వీటిలో తరచుగా కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇవి ఆరోగ్యకరమైన[4], సంతృప్తికరమైన చిరుతిండి కోసం చూస్తున్నవారికి ప్రసిద్ధ ఎంపిక.[5]

మూలాలు