1630
క్యాలెండర్ సంవత్సరం
1630 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
- మార్చి 9: 1630 క్రీట్ భూకంపం సంభవించింది.
- ఏప్రిల్ 8: న్యూ ఇంగ్లాండ్కు ప్యూరిటన్ల వలస (1620-1640) : అర్బెల్లా ఓడ, మరో మూడు ఓడలతో కూడిన విన్త్రోప్ ఫ్లీట్ ఇంగ్లండ్లోని సోలెంట్ నుండి బయలుదేరాయి. జాన్ విన్త్రోప్ నాయకత్వంలో 400 మంది ప్రయాణికులు అమెరికాలోని మసాచుసెట్స్ బే వలసకు వెళ్లారు; మరో కొన్ని వారాల్లో మరో ఏడు ఫ్లీట్లు కూడా వెళ్ళాయి.
- జూన్ 14: అర్బెల్లా నౌక లోని ప్రయాణీకులు చివరకు మసాచుసెట్స్లోని సేలం వద్ద కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టారు. వారిలో అమెరికా యొక్క మొట్టమొదటి ప్రముఖ కవి అన్నే బ్రాడ్స్ట్రీట్తో కూడా ఉంది.
- జూలై: 1629–31 నాటి ఇటాలియన్ ప్లేగు వెనిస్కు చేరుకుంది.
- సెప్టెంబర్ 17: మసాచుసెట్స్ బే వలసలో బోస్టన్ స్థావరాన్ని స్థాపించారు.[1]
తేదీ తెలియదు
- పరమారిబోలో (ఆధునిక సురినామ్లో ) మొదట ఆంగ్లేయులు స్థిరపడ్డారు.
- భారతదేశంలో 1630-32 నాటి దక్కన్ కరువు ప్రారంభమవుతుంది; ఇందులో ఇరవై లక్షల మంది చనిపోయారు.
- మొఘల్ సామ్రాజ్యంలో, లాహోర్ కోటలోని షాజహాన్ యొక్క పెర్ల్ మసీదు పవిత్రం చేయబడింది (1635 లో ఇది పూర్తయింది).
- జోహాన్ హెన్రిచ్ ఆల్స్టెడ్ యొక్క ఎన్సైక్లోపీడియా సెప్టెంబర్ టోమిస్ డిస్టింకా ప్రచురించబడింది.
జననాలు
- ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజి, మహారాష్ట్ర స్థాపకుడు.
మరణాలు
- నవంబర్ 15: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (జ.1571)
మూలాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా