1785
1785 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1782 1783 1784 - 1785 - 1786 1787 1788 |
దశాబ్దాలు: | 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- జనవరి 1: లండన్లో డైలీ యూనివర్సల్ రిజిస్టర్ మొట్టమొదటిగా ప్రచురితమైంది. అదే ఆ తరువాత ది టైమ్స్ అయింది.
- జనవరి 7: ఫ్రెంచ్ వ్యక్తి జీన్-పియరీ బ్లాన్చార్డ్, అమెరికన్ జాన్ జెఫ్రీస్ ఇంగ్లండ్లోని డోవర్ నుండి ఫ్రాన్స్లోని కలైస్కు హైడ్రోజన్ గ్యాస్ బెలూన్లో ప్రయాణించి, ఇంగ్లీష్ ఛానెల్ను వాయుమార్గం ద్వారా దాటిన మొదటి వ్యక్తు లయ్యారు.
- జనవరి 11: రిచర్డ్ హెన్రీ లీ యుఎస్ కాంగ్రెస్ ఆఫ్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]
- ఫిబ్రవరి 9: ఫోర్ట్ విలియం (తరువాత బ్రిటిష్ ఇండియా ) ప్రెసిడెన్సీకి గవర్నర్ జనరల్గా ఉన్న వారెన్ హేస్టింగ్స్ రాజీనామా చేశాడు. 19 నెలల తరువాత చార్లెస్ కార్న్వాలిస్ వచ్చే వరకు, జాన్ మాక్ఫెర్సన్ బ్రిటిష్ ఇండియాను పరిపాలించారు.[2]
- మార్చి 7: స్కాటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త జేమ్స్ హట్టన్ మొదట తన మైలురాయి రచన థియరీ ఆఫ్ ది ఎర్త్ను రాయల్ సొసైటీ ఆఫ్ ఎడింబరోలో ప్రదర్శించాడు.[3]
- మార్చి 10: అమెరికన్ ఇంజనీర్ జేమ్స్ రమ్సే విజయవంతమైన స్టీమ్బోట్ను రూపొందించే ప్రణాళికలను తెలియజేస్తూ జార్జ్ వాషింగ్టన్కు ఒక లేఖను పంపాడు.[4]
- ఏప్రిల్ 28 – ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ 1789 లో ప్రచురితమైన తన రెండవ శ్రేణి నక్షత్రాల సర్వేలను ప్రారంభించాడు.[5]
- మే 10 – ఐర్లాండ్లోని టుల్లామోర్లో వేడి గాలి బెలూన్ కుప్పకూలి, సుమారు 100 ఇళ్ళు తగలబడ్డాయి. ఇది ప్రపంచంలోనే మొదటి విమానయాన ప్రమాదం (36 రోజుల తరువాత మరో ప్రమాదం జరిగింది).[6]
- జూన్ 15: ఇంగ్లీష్ ఛానెల్ దాటే ప్రయత్నంలో హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవడంతో ప్జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రే డి రోజీర్, కో పైలెట్ పియర్ రొమెయిన్ మరణించారు. ప్రపంచంలో మనుషులు మరణించిన మొట్ట మొదటి విమాన ప్రమాదం ఇది.
- జూలై 6 – డాలర్ను అమెరికా ద్రవ్యంగా కాన్ఫెడరేషన్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.[7]
- అక్టోబర్ 13 – బ్రిటిష్ ఇండియాలో మొదటి వార్తాపత్రిక మద్రాస్ కొరియర్ ప్రచురితమైంది. 1794 వరకు వారపత్రికగా దీని ప్రచురణ కొనసాగింది.[8]
- తేదీ తెలియదు: మొట్టమొదటిగా బొగ్గు వాయువును వెలుతురు కోసం ఉపయోగించారు.
- తేదీ తెలియదు: నెపోలియన్ ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్గా నియమితుడయ్యాడు.
- తేదీ తెలియదు: పిట్ ఇండియా చట్టం ప్రకారం భారతదేశంలో మద్రాసు ప్రావిన్సు ఏర్పాటైంది
జననాలు
- ఫిబ్రవరి 26 – అన్నా సుండ్స్ట్రోమ్, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (మ .1871)
- జూలై 20: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు. (మ.1839)
- అక్టోబర్ 17 – గుణాతీతానంద స్వామి (మూల్జీ శర్మ), స్వామినారాయణ సంప్రాదాయ శాఖకు చెందిన పరమహంస (మ. 1867)
మరణాలు
పురస్కారాలు
మూలాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా