అణుపరీక్ష

అణ్వాయుధ పరీక్షలు (ఆంగ్లం: Nuclear weapons tests), అణ్వాయుధాలను పరిశోధించడానికి, చేపట్టే పరీక్షలే, ఈ అణ్వాయుధ పరీక్షలు లేదా అణుపరీక్షలు. ఇరవై శతాబ్దంలో, అనేక దేశాలు పోటా పోటీగా ఈ పరీక్షలు జరిపి, పరోక్షంగా యుద్ధరంగాలను సిద్ధం చేసాయి.

భూగర్భ అణుపరీక్ష కొరకు తయారీ, 1980లో 'నెవాడా పరీక్షా ప్రదేశం' వద్ద. పరీక్ష నిర్వహణా పరికరాలు, క్రిత పరీక్షలవలన ఏర్పడిన గుంతలు (క్రేటర్లు).

ప్రప్రథమ అణుపరీక్ష అమెరికా 1945 జూలై 16 న "ట్రినిటీ సైట్" అనే చోట, చేపట్టింది. దీని వలన 20 కిలోటన్నుల శక్తికి సమానంగా శక్తి వెలువడింది. అమెరికా చే 1952 నవంబరు 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది. అతిపెద్ద అణుబాంబు సోవియట్ యూనియన్కు చెందిన త్సార్ బోంబా, 1961 అక్టోబరు 30 న 'నొవాయా జెమ్ల్యా' వద్ద పరీక్షింపబడింది. దీని శక్తి విలువ 50 మెగాటన్నులు.

అణువరీక్షల వల్ల జరిగే అనార్ధాలను సభ్యదేశాలకు అవగాహన కలిగించి, అణుపరీక్షలను నిలిపివేసేలా చేసేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. మానవ మనుగడపై ఈ వినాశకర పరిణామాలను నివారించేందుకు అణుపరీక్షల తొలగింపును ప్రోత్సహిస్తూ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.[1]

అణుపరీక్షల రకాలు

నాలుగు మేజర్ అణుపరీక్షలు : 1. వాతావరణ, 2. భూగర్భ 3. ఆవలి-వాతావరణ, 4. సముద్రగర్భ.
కాసెల్ బ్రేవో విస్ఫోటనం, 1954లో, సముద్రంలో 100 మైళ్ళ ప్రభావాన్ని కలుగజేసింది. చుట్టూ వున్న మానవసహిత దీవులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది.

అణుపరీక్షలను చారిత్రకంగా ఈ విధంగా వర్గీకరించవచ్చును.: వాతావరణ, సముద్రగర్భ,, భూగర్భ పరీక్షలు.

  • వాతావరణ పరీక్షలు భూవాతావణంలో చేపడతారు. దీనిలో కుక్కగొడుగు మేఘం (మష్రూమ్ క్లౌడ్) యేర్పడుతుంది.
  • సముద్రగర్భ పరీక్షలు, నీటి లోపల చేపడతారు. సాధారణంగా ఒక ఓడను గాని ఒక బార్జ్ను గాని అణ్వాయుధాన్ని అనుసంధానించి పేల్చివేస్తారు. ఈ పరీక్షల వలన, రేడియోధార్మిక నీరు, చుట్టు ప్రక్కల నీటి ప్రాంతాలను విపరీతంగా కాలుష్యపరుస్తుంది.
  • భూగర్భ పరీక్షలు, భూమి లోపల సొరంగాలను త్రవ్వి అందులో అణ్వాయుధాలను అమర్చి పేల్చుతారు. దీని వల్ల భూమిపై పెద్ద పెద్ద గుంతలు (క్రేటర్లు) ఏర్పడుతాయి.[2] 1974 లో భారతదేశం ఇలాంటి పరీక్షలే చేపట్టింది.

చరిత్ర

మొదటి అణుపరీక్ష 'ట్రినిటి' 1945 జూలై 16 న జరిగింది. (అమెరికా).
ప్రపంచంలోని డజనుకు పైగా ప్రదేశాలలో 2,000 కు పైగా అణుపరీక్షలు జరిగాయి.

భూమిపై మొట్టమొదటి అణుపరీక్ష జూలై 16, 1945 న అమెరికా చేపట్టింది. ఇది మాన్‌హట్టన్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. దీనికి "ట్రినిటి" అని పేరు పెట్టారు. న్యూమెక్సికో లోని "అలమగోడ్రో" ప్రాంతంలో చేపట్టారు. ఈ పరీక్షా ఫలితంగా, జపాన్ పై ఆణుబాంబు ప్రయోగం జరిగింది.

దేశాల వారీగా అణుపరీక్షలు

అణు బలాలు గల దేశాలు, ఇప్పటివరకు 2,000 అణుపరీక్షలు జరిపాయి. ఈ విస్ఫోటనాలవలన, ధరిత్రికి ఏలాంటి హాని జరిగింటుందో ఊహించవచ్చు.

  • అమెరికా: అధికారికంగా 1,054 పరీక్షలు జరిపింది. (కనీసం 1,151 అణ్వాయుధాలు, 331 వాతావరణ పరీక్షలు), ఎక్కువగా నెవాడా పరీక్షా స్థలం వద్ద, మార్షల్ దీవులలో, అలాస్కా, కొలరాడో, మిసిసిపీ, న్యూ మెక్సికో వద్ద. (వివరాలకొరకు [1])
  • సోవియట్ యూనియన్: 715 పరీక్షలు (969 అణ్వాయుధాలు) అధికారికంగా.[2], చాలా మటుకు, సెమీపలాటిన్స్క్, నొవాయ జెమ్ల్యా వద్ద, ఇంకొన్ని రష్యా, కజకస్తాన్, తుర్క్‌మేనిస్తాన్, ఉక్రెయిన్ లలో.
  • ఫ్రాన్స్: 210 అధికారికంగా పరీక్షలు. (50 వాతావరణ, 160 భూగర్భ [3]), 4 అణ్వ వాతావరణ పరీక్షలు సి.ఇ.ఎస్.ఎమ్. 'రెగ్గానె' వద్ద, 13 భూగర్భ పరీక్షలు సి.ఇ.ఎమ్.ఓ. ఇన్ ఎక్కెర్, అప్పటి అల్జీరియన్ సహారా,, ఫ్రెంచ్ పాలినేషియా, మొరురో, ఫంగతౌఫఅ వద్ద.
  • యునైటెడ్ కింగ్‌డమ్: 45 పరీక్షలు (21 పరీక్షలు ఆస్ట్రేలియా భూభాగంలో,, అనేకం అమెరికా లో.
  • చైనా: 45 పరీక్షలు (23 వాతావరణ,, 22 భూగర్భ, లోప్‌నూర్ వద్ద, మాలన్,, జింజియాంగ్ వద్ద.
  • భారతదేశం: 6 భూగర్భ పరీక్షలు (1974 లో మొదటిది), పోఖ్రాన్ వద్ద.
  • పాకిస్తాన్: 6 భూగర్భ పరీక్షలు, రాస్-కోహ్ కొండలు, చగాయి జిల్లా, ఖరన్ ఎడారి, ఖరన్ జిల్లా, బలూచిస్తాన్ రాష్ట్రం లో.
  • ఉత్తర కొరియా: మొదటి పరీక్ష 2006 హ్వదేరి వద్ద.

ఇవీ చూడండి

  • పోఖ్రాన్
  • అణువిస్ఫోటనాల ప్రభావాలు
  • అణ్వాయుధాల చరిత్ర
  • అణుపరీక్షల జాబితా
  • అణుధార్మికత

మూలాలు

వెలుపలి లంకెలు