చామరాజనగర్ జిల్లా

కర్ణాటక లోని జిల్లా

చామరాజనగర్ (కన్నడం:ಚಾಮರಾಜನಗರ) కర్నాటకా రాష్ట్రంలో దక్షిణభాగంలో ఉంది. కర్ణాటకారాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న మైసూరు జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి 1998లోచామరాజనగర్ జిల్లాగా ఏర్పాటుచేసారు. జిల్లాకు ప్రధాననగరంగా చామరాజనగర్ ఉంది.[1] కర్నాటకారాష్ట్రంలోని 30 జిల్లాలలో చామరాజనగర్ జిల్లా జనసాంద్రతలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో కొడుగు, బెంగుళూరు గ్రామీణ జిల్లా జిల్లాలు ఉన్నాయి. .[2]

Chamarajanagar district
ಚಾಮರಾಜನಗರ ಜಿಲ್ಲೆ
district
CountryIndia
రాష్ట్రంకర్ణాటక
ప్రధాన కార్యాలయంChamarajanagar
BoroughsYelandur, Gundlupet, Chamarajanagar, Kollegal, Hanur
Area
 • Total5,101 km2 (1,970 sq mi)
Population
 (2001)
 • Total9,65,462
 • Density189/km2 (490/sq mi)
భాషలు
 • అధికారకన్నడం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
571 313
టెలిఫోన్ కోడ్08226
Vehicle registrationKA-10

చరిత్ర

చామరాజనగర్ ఒకప్పుడు అరికోత్తర అని పిఉవబడుతుండేది. మైసూరును పాలించిన రాజైన చామరాజ ఉడయార్ ఇక్కడ జన్మించిన తరువాత ఈ ప్రదేశానికి చామరాజనగర్ అని నామకరణం చేయబడింది. ఇక్కడ హొయశిల రాజైన గంగరాజా వద్ద రాజప్రతినిధి పునిసదండనాయక సా.శ. 1117 లో " ది విజయ అర్స్వనాథ్ బసాడి " అనే జైన ఆలయం నిర్మించాడు. .

భౌగోళికం

కర్నాటక రాష్ట్రం దక్షిణభాగంలో ఉన్న చామరాజనగర్ జిల్లా సరిహద్దులలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లాకు వాయవ్యసరిహద్దులో మైసూరు జిల్లా, ఉత్తరసరిహద్దులో మండ్య, ఈశాన్యసరిహద్దులో బెంగుళూరు జిల్లాలు ఉన్నాయి. తూర్పుసరిహద్దులో తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా, సేలం జిల్లా, ఈరోడ్ జిల్లా, నీలిగిరి జిల్లాలు ఉన్నాయి. ఆగ్నేయంలో వేల్యాండు జిల్లాలు ఉన్నాయి.

కర్నాటక రాష్ట్రంలోని జాతీయరహదారి 209 బెంగుళూరు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ వద్ద జాతీయరహదారి 7 తో అనుసంధానించబడి ఉంది. జాతీయరహదారి 7 కర్నాటక సరిహద్దులో పడమర కనుమల వద్ద పంజూరు వద్ద ముగుస్తుంది.

జిల్లాలోని అత్యధిఅభాగం నీలగిరి పర్వతాల దిగువభూములు ఆక్రమించి ఉన్నాయి. ఇవి వర్షాధార మైదానాలుగా అరణ్యాలు, కొండలతో నిండి ఉన్నాయి.

గణాంకాలు

2011 గణాంకాలను అనుసరించి చామరాజనగర్ జిల్లా జనసంఖ్య 1,020,962.[2] ఇది దాదాపు సైప్రస్ దేశానికి సమానంగా ఉంది.[3] అలాగే యు.ఎస్ రాష్ట్రాలలోని మాంటనా రాష్టానికి సమానం.[4] 640 భారతీయ జిల్లాలలో ఇది 441వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 200. 200 inhabitants per square kilometre (520/sq mi) .[2]2001-2011 కుటునబనియంత్రణ శాతం 5.75%.[2] చామరాజనగర్ స్త్రీపురుష నిష్పత్తి 989:1000.,[2] అలాగే అక్షరాస్యత శాతం 61.12%.[2]అటవీప్రాంతం అత్యధికంగా ఉన్న జిల్లా అయినందున జిల్లాలో అత్యధికస్థాయిలో గిరిజనులు నివసిస్తున్నారు. వారిలో " సోలిగా, యరావా, జెనుకుర్బా, బెట్ట కుర్బాలు జాతి వారు ప్రధానులుగా పరిగణిచబడుతున్నారు. ఈ జాతి ప్రజల సంఖ్య మొత్తం 82,000. ఈ ప్రజలకు వారి ప్రత్యేక భాష ఉంటుంది.

ఇతర సమాచారం

జిల్లాలోని దక్షిణప్రాంతం అధికంగా దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాలు గంధపు చెట్ల అక్రమరవాణా, బందిపోటు వీరప్పన్‌కు ఆశ్రయం అయ్యాయి. వీరప్పన్ 100 కంటే అధికమైన పోలీసుల మరణానికి హేతువు కారణమయ్యాడు. వీరప్పన్ ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న " స్పెషల్ టస్క్ ఫోర్స్ " చేతిలో 2004 అక్టోబరు18 న తమిళనాడుకు చెందిన ధర్మపురి జిల్లాలో ఎంకౌంటర్‌లో హతుడయ్యాడు. విరప్పన్ దాదాపు 2 దశాబ్ధాల కాలం పరారి జీవితం గడిపాడు. వీరప్పన్ నల్లరాతి అక్రమరవాణా చేసి అటవీ శాఖను హడకెత్తించాడు.

.

మూలాలు

వెలుపలి లింకులు


వర్గం:భారతదేశం లోని జిల్లాలు