కర్కట రేఖ

భూమధ్య రేఖకు 23° 26′ 22″ ఉత్తరాన ఉన్న అక్షాంశ రేఖను కర్కట రేఖ అంటారు. ఈ కర్కాటక రేఖ భూమి చుట్టూ వున్న వ్యాసం దాదాపు 36,788 కి.మీ. పొడవు వుంటుంది. ఈ రేఖ 16 దేశాల మీద వ్యాపించి ఉంది. ఆయా దేశాల వాతావరణాన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి. మన దేశంలో ఈ రేఖ రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, మిజోరంల మీదుగా పయనిస్తున్నది.[1]

కర్కట రేఖను చూపుతున్న ప్రపంచపటము

చైత్రమాసంలో లేదా మేష మాసంలో భూమధ్యరేఖ మీద ఉన్న సూర్యుడు ఆషాఢ మాసం నాటికి కర్కట రేఖ మీద ప్రవేశిస్తాడు. అప్పటినుంచి ‘దక్షిణం’గా సూర్యుడు జరగడం దక్షిణాయనం.[2]

మూలాలు