జాతీయ ప్రజాస్వామ్య కూటమి
జాతీయ ప్రజాస్వామ్య కూటమి భారతదేశానికి చెందిన రాజకీయ కూటమి, ఇది 1998లో అటల్ బిహారి వాజపేయి నాయకత్వంలో స్థాపించబడింది. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది.[1]
జాతీయ ప్రజాస్వామ్య కూటమి | |
---|---|
Chairperson | అమిత్ షా |
లోక్సభ నాయకుడు | నరేంద్ర మోడీ (భారతదేశ ప్రధానమంత్రి) |
రాజ్యసభ నాయకుడు | పీయూష్ గోయల్ |
మాజీ ప్రధానమంత్రులు | అటల్ బిహారి వాజపేయి (1998–2004) |
స్థాపకులు | (భారతీయ జనతా పార్టీ) |
స్థాపన తేదీ | 1998 |
కూటమి | 29 Parties |
లోక్సభ స్థానాలు | 334 / 543 |
రాజ్యసభ స్థానాలు | 116 / 245 |
శాసన సభలో స్థానాలు | See § Strength in legislative assemblies |
ఈ కూటమి ఇంతకు ముందు 1998 నుండి 2004 వరకు అధికారంలో ఉంది. ఆ తరువాత 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో 38.5శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది.[2] ఈ కూటమి ముఖ్య నాయకుల్లో ఒకడైన నరేంద్ర మోడీ 2014 మే 26న భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. 2019 సాధారణ ఎన్నికల్లో కూడా ఈ కూటమి 45.53శాతం ఓట్లతో మళ్ళి అధికారం చేజిక్కించుకుంది.[3]
చరిత్ర
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) 1998 మే నెలలో జాతీయ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కూటమి అయిన ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) ని ఓడించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ (BJP) నాయకత్వం వహించింది. ఈ కూటమిలో బిజెపితో సహా సమతా పార్టీ, AIADMK పార్టీ ఇంకా శివసేన ఉన్నాయి, అయితే 2019లో కొన్ని కారణాలవల్ల శివసేన ఈ కూటమి నుండి వైదొలగి కాంగ్రెస్ కూటమిలో చేరింది.[4]
రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతుల జాబితా
గమనిక : ఇక్కడ సూచించిన రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఈ కూటమి మద్దతు పొంది ఆ పదవికి ఎన్నికైన వారు.
రాష్ట్రపతులు
No. | చిత్రం | పేరు (జననం-మరణం) | పదవి కాలం | మునుపటి పదవి | ఉపరాష్ట్రపతి | Party[5] | ||
---|---|---|---|---|---|---|---|---|
11 | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931–2015) | 2002 జూలై 25 | 2007 జూలై 24 | ప్రధానమంత్రికి శాస్త్ర పరిశోధన సలహాదారు | కృష్ణ కాంత్ (2002)భైరాన్సింగ్ షెకావత్ (2002–07) | స్వతంత్ర అభ్యర్థి | ||
2002 | ||||||||
5 సంవత్సరాలు, 0 రోజులు | ||||||||
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబిదీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు..[6][7][8] | ||||||||
14 | రామ్నాథ్ కోవింద్(b.1945) | 2017 జూలై 25 | ప్రస్తుతం | బీహార్ రాష్ట్ర గవర్నరు | మహమ్మద్ హమీద్ అన్సారీ (2017) ముప్పవరపు వెంకయ్య నాయుడు (2017–ప్రస్తుతం) | భారతీయ జనతా పార్టీ | ||
2017 | ||||||||
6 సంవత్సరాలు, 269 రోజులు | ||||||||
[9] |
ఉప రాష్ట్రపతులు
No. | చిత్రం | పేరు (జననం-మరణం)[10] | సంవత్సరం (% votes) | బాధ్యతలు చేపట్టినది | విరామ తేదీ | పదవి కాలం | రాష్ట్రపతులు | పార్టీ | |
---|---|---|---|---|---|---|---|---|---|
11 | భైరాన్సింగ్ షెకావత్ ⸸ (1925–2010) | 2002 (59.82) | 2002 ఆగస్టు 19 | 2007 జూలై 21 | 4 సంవత్సరాల, 273 రోజులు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ | భారతీయ జనతా పార్టీ | ||
13 | ముప్పవరపు వెంకయ్య నాయుడు (1948) | 2017 (67.89) | 2017ఆగస్టు 11 | ప్రస్తుతం | 6 సంవత్సరాలు, 252 రోజులు | రామ్నాథ్ కోవింద్ | భారతీయ జనతా పార్టీ |