1846

1846 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1843 1844 1845 - 1846 - 1847 1848 1849
దశాబ్దాలు:1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు
శతాబ్దాలు:18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • మార్చి 9:
    • మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం, లాహోరు ఒప్పందం కుదరడంతో ముగిసింది.[1]
    • కాశ్మీరు ఈస్టిండియా కంపెనీ హస్తగతమైంది.
    • కోహినూర్ వజ్రం బ్రిటిషు రాణి విక్టోరియా వశమైంది.
  • మే 12: కోలా శేషాచలం తన నీలగిరి యాత్రను మొదలు పెట్టాడు. దీన్ని నీలగిరి యాత్ర పేరుతో గ్రంథస్థం చేసాడు.
  • జూన్ 10: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల లోని బ్రిటిషు వారి ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు. దాంతో అతడి తిరుగుబాటు మొదలైంది
  • సెప్టెంబరు 10: ఎలియాస్ హోవ్ కు కుట్టుమిషను పేటెంటు లభించింది.[2]
  • సెప్టెంబరు 23: జర్మను ఖగోళవేత్తలు యోహన్ గాట్‌ఫ్రీడ్ గాల్, హీఓంరిచ్ లూయీ డి అరెస్ట్‌లు నెప్ట్యూన్ గ్రహాన్ని కనుగొన్నారు.\
  • తేదీ తెలియదు: హైదరాబాద్ మెడికల్ స్కూల్ పేరుతో ఉస్మానియా వైద్య కళాశాల మొదలైంది.
  • తేదీ తెలియదు: అమెరికాలో స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ను స్థాపించారు.
  • తేదీ తెలియదు: ఇంగ్లండులో కలరా అంటువ్యాధి వ్యాప్తి మొదలైంది
  • అక్టోబరు 16: అమెరికా లోని మసాచుసెట్స్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో విలియమ్స్‌ థామస్‌ గ్రీన్‌ మార్టన్‌ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్‌కొలిన్స్‌తో కలిసి గిల్బర్ట్‌ అంబార్టు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు తొలిసారిగా ఈథర్‌ మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశాడు. ఇదే మత్తుమందు వాడడం మొదలైన ఈ రోజే ప్రపంచ అనస్థీసియా దినోత్సవం

జననాలు

మరణాలు

స్వాతి తిరుణాళ్
  • మే 18: బాలశాస్త్రి జంబేకర్, సంఘ సంస్కర్త (జ. 1812)
  • అగస్టు 1: ద్వారకానాథ్ టాగూర్, మొదటి భారతీయ పారిశ్రామికవేత్తలలో ఒకడు (జ. 1794) [3]
  • డిసెంబరు 25: స్వాతి తిరునాళ్, కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813)

పురస్కారాలు

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1846&oldid=4190829" నుండి వెలికితీశారు