ఎస్వాటినీ
26°30′S 31°30′E / 26.500°S 31.500°E
Kingdom of Eswatini Umbuso weSwatini (Swazi) | |
---|---|
నినాదం: "Siyinqaba" (Swazi) "We are a fortress" "We are a mystery/riddle" "We hide ourselves away" | |
గీతం: | |
రాజధాని |
|
అతిపెద్ద నగరం | Mbabane |
అధికార భాషలు |
|
పిలుచువిధం | Swazi |
ప్రభుత్వం | Unitary parliamentary absolute diarchy |
• Ngwenyama | Mswati III |
• Ndlovukati | Ntfombi Tfwala |
• Prime Minister | Ambrose Dlamini |
శాసనవ్యవస్థ | Parliament |
• ఎగువ సభ | Senate |
• దిగువ సభ | House of Assembly |
Independence from the United Kingdom | |
• Granted | 6 September 1968 |
• United Nations membership | 24 September 1968 |
• Current constitution | 1975 |
విస్తీర్ణం | |
• మొత్తం | 17,364 km2 (6,704 sq mi) (153rd) |
• నీరు (%) | 0.9 |
జనాభా | |
• 2016 estimate | 1,343,098[1] (154th) |
• 2017 census | 1,093,238[2] |
• జనసాంద్రత | 68.2/km2 (176.6/sq mi) (135th) |
GDP (PPP) | 2018 estimate |
• Total | $12.023 billion[3] |
• Per capita | $10,346[3] |
GDP (nominal) | 2018 estimate |
• Total | $4.756 billion[3] |
• Per capita | $4,092[3] |
జినీ (2015) | 49.5[4] high |
హెచ్డిఐ (2017) | 0.588[5] medium · 144th |
ద్రవ్యం |
|
కాల విభాగం | UTC+2 (SAST) |
వాహనాలు నడుపు వైపు | left |
ఫోన్ కోడ్ | +268 |
ISO 3166 code | SZ |
Internet TLD | .sz |
ఎస్వాటినీ దక్షిణ ఆఫ్రికాలో ఒక భూపరివేష్టిత దేశం. గతంలో దీన్ని స్వాజిల్యాండ్ అని పిలిచేవారు. ఈశాన్య సరిహద్దులో మొజాంబిక్, ఉత్తర, తూర్పు దక్షిణ సరిహద్దులలో దక్షిణాఫ్రికా ఉంది. ఉత్తర సరిహద్దు, దక్షిణ సరిహద్దు మద్య దూరం 200 కిలోమీటర్లు (120 మైళ్ళు), తూర్పుసరిహద్దు, పశ్చిమసరిహద్దు మద్య దూరం 130 కిలోమీటర్ల (81 మైళ్ళు) ఉంది. ఆఫ్రికాలోని అతి చిన్న దేశాలలో ఈస్వాటిని ఒకటి. అయినప్పటికీ దాని శీతోష్ణస్థితి, భౌగోళిక ఆకృతి వైవిధ్యంగా ఉంటాయి. చల్లని, పర్వత ప్రాంత హిగ్వెల్డు ప్రాంతంలో వేడి, పొడి వాతావరణం ఉంటుంది.
దేశ ప్రజలలో స్వాజీలు అధికంగా ఉన్నారు. వీరికి సిస్వాటి భాష (స్వాజీభాష) వాడుక భాషగా ఉంది. వారు మూడవ న్వెనె నాయకత్వంలో 18 వ శతాబ్దం మధ్యలో వారీ రాజ్యాన్ని స్థాపించారు.[6] స్వాజీ 19 వ శతాబ్దానికి చెందిన రెండవ మస్మాటి నుండి స్వాజి ప్రజలు, స్వాజీ దేశం తమ పేర్లను స్వీకరించాయి. ప్రస్తుత సరిహద్దులు 1881 లో ఆఫ్రికా కొరకు వలసరాజ్యాల పెనుగులాట మధ్యలో రూపొందించబడ్డాయి.[7] రెండవ బోయెరు యుద్ధం తర్వాత 1903 నుండి ఈ రాజ్యం స్వాజీల్యాండు పేరుతో బ్రిటీషు సంరక్షకరాజ్యం అయింది. 1968 సెప్టెంబరు 6 న తిరిగి స్వాతంత్రాన్ని తిరిగి పొందడం వరకు ఇది కొనసాగింది.[8] ఏప్రిల్ 2018 ఏప్రెలులో దేశం పేరు అధికారికంగా " కింగ్డం ఆఫ్ స్వాజీల్యాండు " నుండి " కింగ్డం ఆఫ్ ఈస్వాటిని " గా మార్చబడింది.[9][10]
ప్రభుత్వం ఒక సంపూర్ణ డయామార్జిగా ఉంది. 1986 నుంచి గ్వెన్యాయమా ("రాజు") మూడవ స్వాటి, డ్లొవుకాటి ("రాణి మాత") త్ఫోంబి ఫ్వాలాగా సంయుక్తంగా పాలించారు.[11][12] మాజీ ప్రభుత్వాధికారి, దేశ ప్రధానమంత్రులు, దేశం పార్లమెంటులో రెండు సభల (సెనేట్, హౌస్ ఆఫ్ అసెంబ్లీ) ప్రతినిధులను నియమిస్తారు. జాతీయ అగ్రగామి దేశం రిచ్యుయలు ఫెష్యూసు వార్షిక ఉహ్లాంగా ఆచారం సమయంలో అధ్యక్షత వహిస్తాడు. హౌసు ఆఫ్ అసెంబ్లీ, సెనేటూ మెజారిటీని నిర్ణయించడానికి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2005 లో ప్రస్తుత రాజ్యాంగం స్వీకరించబడింది. ఆగస్టు, సెప్టెంబరు [13] ఇంక్వాలా డిసెంబరు, జనవరిలో జరిగిన రాజ్యాధికార నృత్యాలు దేశం అత్యంత ముఖ్యమైన సంఘటనలుగా ఉన్నాయి.[14]
ఈశాటిని ఒక చిన్న ఆర్థిక వ్యవస్థతో అభివృద్ధి చెందుతున్న దేశం. $ 9,714 అమెరికా డాలర్ల తలసరి జి.డి.పితో, ఇది దిగువ- మధ్యతరహా ఆదాయం కలిగిన దేశంలాగా వర్గీకరించబడింది. [3] దక్షిణాఫ్రికా కస్టమ్సు యూనియను, " కామన్ మార్కెట్టు ఫర్ ఈస్టర్ను & సదరను ఆఫ్రికా సభ్యదేశంగా ఉంది. ప్రధాన స్థానిక వ్యాపార భాగస్వామి దక్షిణాఫ్రికా ఉంది. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈస్వాటిని కరెన్సీ " లిలన్గేని " ఎక్చేజి వెల దక్షిణాఫ్రికా ర్యాండుకు అనుగుణంగా ఉంది. ఈవాటిని ప్రధాన విదేశీ వ్యాపార భాగస్వాములుగా యునైటెడు స్టేట్సు,[15] ఐరోపా సమాఖ్య ఉన్నాయి. [16] దేశంలో వ్యవసాయం, ఉత్పాదక రంగాలు ప్రజలలో అధిక భాగానికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈవాటిని దక్షిణాఫ్రికా డెవలప్మెంటు కమ్యూనిటీ, ఆఫ్రికా యూనియను, కామన్వెల్తు ఆఫ్ నేషన్సు, యునైటెడు నేషంసులో సభ్యదేశంగా ఉంది.
స్వాజీ జనాభా ప్రధాన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది: ఎయిడ్సు కొంతవరకు, క్షయవ్యాధి విస్తారంగా వ్యాపించింది.[17][18] ఇది వయోజన జనాభాలో 26% హెచ్.ఐ.వి- పాజిటివు అని అంచనా వేయబడింది. 2018 నాటికి ఈవాటిని ఆయుఃప్రమాణం 58 సంవత్సరాలలో ఉంది. ఇది ప్రపంచంలోని 12 వ స్థానం.[19] ఈవాటిని ప్రజలలో యువత అధికంగా ఉంది. మెయిడను వయసు 20.5 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయస్కులు దేశ మొత్తం జనాభాలో 37.5% ఉన్నారు.[20] ప్రస్తుత జనాభా పెరుగుదల రేటు 1.2%.
చరిత్ర
ఈశాటిని దేశంలో 2,00,000 సంవత్సరాల క్రితం ప్రారంభకాల రాతి యుగం నాటి మానవ కార్యకలాపాన్ని సూచిస్తున్న కళాకృతులు కనుగొనబడ్డాయి. దేశంలో కనుగొనబడిన చరిత్రపూర్వ రాతి చిత్రలేఖనాలు నాటి నుండి 27,000 సంవత్సరాల క్రితం నాటివని భావిస్తున్నారు. 19 వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈ రాతిచిత్రాలు కనుగొనబడ్డాయి.[21]
ఈ ప్రాంతం మొట్టమొదటి నివాసులు ఖొసియను వేట-సంగ్రాహక ప్రజలుగా భావిస్తున్నారు. బంటు వలసల సందర్భంగా ఈ ప్రజల స్థానాన్ని గుని ప్రజల భర్తీ చేసారు. ఈ ప్రజలు తూర్పు, మధ్య ఆఫ్రికా గ్రేటు లేక్స్ ప్రాంతాలు నుండి ఈ ప్రాంతంలో ప్రవేశించారు. 4 వ శతాబ్దం నుండి ఈ ప్రాంతం లోని ప్రజలు వ్యవసాయం, ఇనుము ఉపయోగించినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత సోథొ, గుని భాషలను మాట్లాడే ప్రజలు 11 వ శతాబ్దం కంటే ముందుగా ఇక్కడ స్థిరపడ్డారు.[22]
స్వాజీ సెటిలర్లు (18 వ - 19 వ శతాబ్ధాలు)
స్వాజిలాండులోకి ప్రవేశించడానికి ముందు స్వాజి సెటిలర్లు తరువాత న్గ్వానే (లేదా బకన్వావాన్) అని పిలువబడేవారు. వీరు పాంగోలా నది ఒడ్డున స్థిరపడ్డారు. దీనికి ముందు వారు ప్రస్తుత మపుటో, మొజాంబిక్ వద్ద ఉన్న టెంబే నది ప్రాంతంలో స్థిరపడ్డారు. డ్వాండ్వే ప్రజలతో కొనసాగిన వివాదం కారణంగా వీరు మరింత ఉత్తరం వైపుకి నెట్టివేయబడ్డారు. మ్లోసేని కొండల పాదాల వద్ద ఉన్న షిసెవెనిలో మూడవ నెగ్వను తన రాజధానిని స్థాపించాడు.[22]
మొదటి సోబూజా పాలనలో గ్వానే ప్రజలు ప్రస్తుత ఈస్వటీని కేంద్రస్థానంలో ఉన్న జొంబొడ్జె వద్ద వారి రాజధాని స్థాపించారు. ఈ విధానంలో ఎమాఖందాంబిల్లిగా పిలిచే దేశంలోని దీర్ఘ-కాలపు స్వాజీ భూభాగాలను వారు స్వాధీనం చేసుకుని విలీనం చేసుకున్నారు.[22]
దాని తరువాత పాలించిన రెండవ మస్వాటి పేరు నుండి స్వాజీల్యాండు అనే పేరు వచ్చింది. మూడవ కంగ్వాని పేరుతో పిలువబడిన కాంగ్వేని స్వాజిలాండుకు ఒక ప్రత్యామ్నాయ పేరుగా మారింది. తరువాత రాజును ఖొషి అని పిలిచారు. రెండవ స్వాటి స్వాజీల్యాండు పోరాట వీరులలో గొప్పవాడుగా ప్రఖ్యాతి వహించాడు. ఆయన దేశం వైశాల్యాన్ని రెండు రెట్లు చేసి ప్రస్తుత పరిమాణంలో విస్తరించాడు. ఎమాఖండ్జాంబిలి వంశాలు ప్రారంభంలో తరచుగా ప్రత్యేక ఆచారాలతో రాజకీయ హోదాలతో విస్తార స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాలుగా ఉన్నాయి. వారి స్వయంప్రతిపత్తి విస్తరించింది. 1850 లలో వారిలో కొందరు దాడి చేసి వారిని అణచివేసిన తరువాత స్వాటిని ప్రాభవం ముగింపుకు వచ్చింది.[22]
ఎమాఖండ్జాంబిలి తమ అధికారశక్తితో స్వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించారు. విజయం సాధించటం ద్వారా లేదా ఆశ్రయం ఇవ్వటం ద్వారా అనేక మంది ప్రజలు ఆయన రాజ్యంలో భాగం అయ్యారు. ఈ తరువాత వచ్చిన వారు స్వాజీప్రజలను ఎమాఫికమువాలుగా గుర్తించారు. దలానిని రాజువంశాలతో కలిసి వచ్చిన వంశాలు బెండ్జుబోకో (అసలైన స్వాజీ) అని పిలవబడ్డాయి.[ఆధారం చూపాలి]
19 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం ప్రారంభంలో స్వయంప్రతిపత్తితో ఉన్న స్వాజీలాండు దేశాన్ని దక్షిణ ఆఫ్రికాలోని బ్రిటీషు, డచ్చి పాలన ప్రభావితం చేసింది. ఆ సమయంలో జరుగుతున్న ఆఫ్రికా పెనుగులాట ఉన్నప్పటికీ 1881 లో బ్రిటిషు ప్రభుత్వం స్వాజీ స్వాతంత్ర్యాన్ని గుర్తించే ఒక సమావేశంలో సంతకం చేసింది. ఈ స్వాతంత్ర్యం 1884 కన్వెన్షనులో కూడా గుర్తించబడింది.[ఆధారం చూపాలి]
1889 లో బంద్జెని రాజు మరణం తరువాత వివాదాస్పద ఖనిజ హక్కులు, ఇతర రాయితీలు కారణంగా స్వాజిలాండులో 1890 లో త్రిముఖ పరిపాలనను ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి బ్రిటీషు, డచ్చి రిపబ్లిక్కులు, స్వాజీ ప్రజలు ప్రాతినిథ్యం వహించారు. 1894 సమావేశంలో " దక్షిణ ఆఫ్రికా రిపబ్లిక్కు " పాలనలో స్వాజీలాండు ఒక ప్రొటొరేటుగా నిర్ణయించబడింది. ఒక సమావేశం ఏర్పాటు చేసింది. 1899 అక్టోబరులో " రెండవ బోయెరు యుద్ధం " ప్రారంభం వరకూ స్వాజీల్యాండులో ఐదవ గ్వాలె పాలన కొనసాగింది.[ఆధారం చూపాలి]
బోగరు యుధ్ధం జరిగిన తర్వాత 1899 డిసెంబరులో రాజు ఐదవ గ్వానె " క్వాలా " ఉత్సవ సమయంలో చనిపోయాడు. ఆయన తరువాత నాలుగు నెలల వయస్సు రెండవ సోబూజా వారసుడయ్యాడు. 1902 వరకు బ్రిటీషు, బోయర్సు దేశంలో సంభవించే వివిధ పోరాటాలలో స్వాజీలాండు పరోక్షంగా పాల్గొంది.[ఆధారం చూపాలి]
బ్రిటిషు పాలన (1906–1968)
1903 లో ఆంగ్లో-బోయరు యుద్ధంలో బ్రిటిషు విజయం సాధించిన తరువాత స్వాజిల్యాండ్ ఒక బ్రిటీషు సంరక్షక దేశంగా మారింది. 1906 లో ట్రాన్సావాలు కాలనీ స్వీయ-ప్రభుత్వాన్ని మంజూరు చేయటంతో దాని ప్రారంభ పరిపాలన (ఉదాహరణ తపాలా సేవలు)అవసరమైన సేవలు దక్షిణాఫ్రికా అందించింది. దీని తరువాత స్వాజిలాండ్ మొత్తం ఐరోపా, ఐరోపా కాని (స్థానిక రిజర్వు) ప్రాంతాలుగా విభజించబడింది. ఇది మొత్తం భూభాగంలో మూడింట రెండు వంతుల వరకు ఉంది. 1921 డిసెంబరులో సోబూజో అధికారిక పట్టాభిషేకం జరిగింది.[23]
1923 - 1963 మధ్య కాలంలో రెండవ సిబూజా స్థాపించిన కమర్షియల్సు అమడోడాను స్వాజీ రిజర్వులలో చిన్న వ్యాపారాలకు లైసెంసులను మంజూరు చేసింది. విద్యావ్యవస్థలో మిషనరీల ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు స్వాజీ జాతీయ పాఠశాలను స్థాపించింది. ఆయన పాలనలో స్వాజీ రాజ్య నాయకత్వం బలపడింది. స్వాజీలు బలహీన పడుతున్న బ్రిటిషు పరిపాలనను ఎదుర్కొనే శక్తిని సముపార్జించుకున్నారు. తరువాత స్వాజీలాండు దక్షిణ ఆఫ్రికా యూనియనులో చేర్చబడింది.[23]
1963 నవంబరులో బ్రిటిషు వారు శాసన, ఎగ్జిక్యూటివు కౌన్సిళ్ళను స్థాపించి నిబంధనల ప్రకారం స్వతంత్ర స్వాజీలాండు రాజ్యాంగాన్ని రూపొందించి ప్రకటించింది. ఈ అభివృద్ధిని స్వాజీ నేషనల్ కౌన్సిలు (లికిఖో) వ్యతిరేకించింది. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎన్నికలు జరిగాయి. 1964 సెప్టెంబరు 9 న మొదటి శాసన మండలిని ఏర్పరచారు. శాసన మండలి ప్రతిపాదించిన అసలైన రాజ్యాంగం మార్పులు బ్రిటను ఆమోదించింది. ఒక అసెంబ్లీ హౌసు, సెనేటు కొరకు అందించిన కొత్త రాజ్యాంగం రూపొందించబడింది. ఈ రాజ్యాంగంలో 1967 లో ఎన్నికలు జరిగాయి.[ఆధారం చూపాలి]
స్వాతంత్రం (1968–ప్రస్తుత కాలం)
1967 ఎన్నికలను అనుసరించి స్వేజీలాండ్ 1968 లో తిరిగి స్వతంత్రం పొందే వరకు రక్షిత దేశంగ ఉంది.[24]
1973 ఎన్నికల తరువాత 1982 లో తన మరణం వరకు దేశాన్ని పాలించిన రాజు రెండవ సొబుజా మరణం తరువాత స్వాజీల్యాండు రాజ్యాంగం రద్దు చేయబడింది. రెండవ సొబూజా దాదాపు 83 సంవత్సరాలుగా స్వాజీల్యాండును పాలించాడు. దీనితో అతను సుదీర్ఘకాలం పాలించిన రాజుగా చరిత్ర సృష్టించాడు.[25] ఆయన మరణం తరువాత 1984 వరకు రాజప్రతినిధిగా రాణి డీలివే షాంగ్వేను స్వాజీల్యాండును పాలించింది. 1984 లో లిఖోవో ఆమెను తొలగించి ఆమె స్థానంలో రాణి మాత నఫ్ఫోంబి తఫ్వాలా రాజప్రతినిధిగా నియమించబడింది.[25] మూడవ మట్వాటి (త్ఫోబీ కుమారుడు) 1986 ఏప్రెలు 25 న రాజుగా కిరీటధారణ చేసాడు. స్వాజిలాండు ఇంగెనియమాగా (రాజుగా) గౌరవింపబడ్డాడు.[26]
1990 లలో విద్యార్ధులు, శ్రామిక నిరసనలు సంస్కరణలను ప్రవేశపెట్టేలా రాజును ఒత్తిడి చేశాయి.[27] ఫలితంగా రాజ్యాంగ సంస్కరణల వైపు పురోగతి మొదలైంది. 2005 లో ప్రస్తుత స్వాజీ రాజ్యాంగం రూపొందించడంతో ఇది ముగిసింది. రాజకీయ కార్యకర్తల అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఇది జరిగింది. ప్రస్తుత రాజ్యాంగం రాజకీయ పార్టీల హోదాను స్పష్టంగా గుర్తించదు.[28]
కొత్త రాజ్యాంగం కింద 2008 లో మొదటి ఎన్నిక జరిగింది. 55 నియోజకవర్గాల నుండి పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు (టిన్కుండ్ల అని పిలుస్తారు). ఈ ఎంపీలు 2013 లో ముగిసిన ఐదు సంవత్సరాల కాలం సేవలు అందించారు.[28]
2011 లో ఎస్.ఎ.సి.యు. రసీదులను తగ్గించడంతో స్వాజీలాండ్ ఆర్థిక సంక్షోభంతో బాధపడింది. దీని కారణంగా పొరుగున ఉన్న దక్షిణాఫ్రికా నుంచి రుణాన్ని కోరడానికి స్వాజిలాండ్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయినప్పటికీ షరతులలో రాజకీయ సంస్కరణలు ఉన్నందున ఋణం ఇవ్వడానికి దక్షిణాఫ్రికా అంగీకరించలేదు.[29]
ఈ కాలంలో మరింత సంస్కరణలు చేపట్టాలని స్వాజీ ప్రభుత్వానికి ఒత్తిడి అధికరించింది. పౌర సంస్థలు, కార్మిక సంఘాల నిరసనలు సాధారణం అయ్యాయి. 2012 లో ప్రారంభించి ఎస్.ఎ.సి.యు. రసీదులలో మెరుగుదలలు స్వాజీ ప్రభుత్వంలో ద్రవ్య ఒత్తిడిని తగ్గించాయి. 2013 సెప్టెంబరు 20 న రెండవ రాజ్యాంగం ప్రకటన తరువాత ఒక కొత్త పార్లమెంటు ఎన్నికయింది. తరువాత రాజు సిబుసిసో డ్లామిని మూడవసారి ప్రధానమంత్రిగా నియమించాడు.[30]
2018 ఏప్రెలు 19 న రాజు మూడవ స్వాటి " కింగ్డం ఆఫ్ స్వాజీల్యాండు " పేరు " కింగ్డం ఆఫ్ ఈస్వాటిని " గా మార్చాలని ప్రకటించాడు.స్వాజీల్యాండు స్వాతంత్రం 50 వ వార్షికోత్సవానికి ఇది గుర్తుగా మారింది. కొత్త పేరు ఈస్వాటిని అంటే స్వాజీ భాషలో "స్వాజీల భూమి" అని అర్థం.పాక్షికంగా స్విట్జర్లాండు పేరుతో గందరగోళాన్ని నివారించడానికి ఇది ఉద్దేశించబడింది.[31][10]
2018 సెప్టెంబరు 19 న ఈస్వాటిని కార్మికులు తాము అందుకుంటున్న వేతనాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వవ్యతిరేక నిరసనలు కొనసాగించారు. వారు " ట్రేడు యూనియను కాంగ్రెసు ఆఫ్ స్వాజీల్యాండు " నిర్వహించిన మూడు రోజుల సమ్మెలో పాల్గొన్నారు.[32]
భౌగోళికం
ఈశాటిని లెసోతో లోని డ్రేకెంసుబర్గు పర్వతచీలిక సమీపంలో ఉంటుంది.[ఆధారం చూపాలి]
ఇది ఒక చిన్న భూపరివేష్టిత దేశం. ఈశాటిని ఉత్తర, పశ్చిమ, దక్షిణ సరిహద్దులలో దక్షిణాఫ్రికా, తూర్పు సరిహద్దులో మొజాంబిక్ ఉన్నాయి. ఈస్వాటిని వైశాల్యం 17,364 కిలోమీటర్లు. ఈస్వాటినిలో నాలుగు వేర్వేరు భౌగోళిక ప్రాంతాలున్నాయి. ఇవి నార్తు నుండి దక్షిణంవైపున ఎత్తును అనుసరించి నిర్ణయించబడతాయి. ఈవాటిని సుమారుగా 26 ° 30 'దక్షిణ అక్షాంశం, 31 ° 30'తూర్పు రేఖాంశంలో ఉంటుంది.[33] ఈశాటినిలో అనేక రకాల ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. మొజాంబికు సరిహద్దు వెంట పర్వతాలు తూర్పున ఉన్న సవన్నాలు, వాయువ్య ప్రాంతంలో వర్షారణ్యాలు ఉన్నాయి. గ్రేటు ఉసుతు నది వంటి అనేక నదులు దేశంలో ప్రవహిస్తున్నాయి.[ఆధారం చూపాలి]
మొజాంబిక్ తో తూర్పు సరిహద్దులో 600 మీటర్ల ఎత్తులో లబొంబొ, ఒక పర్వత శిఖరం ఉన్నాయి. నగ్వావుమా, ఉసుటు, ముల్బూజు అనే మూడు నదీ లోయలచే పర్వతాలు విభజించబడ్డాయి. ఇది పశువుల పెంపకానికి ప్రాధాన్యత కలిగిన దేశం. ఈశాటిని పశ్చిమ సరిహద్దు సరాసరి ఎత్తు 1200 మీటర్ల ఉంది. ఇది ఎస్కార్పుమెంటు అంచున ఉంది. పర్వతాల మధ్య నదులు లోతైన గోర్జెసు గుండా ప్రవహిస్తున్నాయి. రాజధాని అయిన మబాబనే హైవేల్డులో ఉంది.[ఆధారం చూపాలి]
సముద్ర మట్టానికి 700 మీటర్ల దూరంలో ఉన్న మధ్యవెల్డు ఈస్వటినీ అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా ఉంటుంది. పర్వతాల కంటే ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉంటుంది. మధ్యవెల్డులో ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక నగరం మాంజినీ ఉంది.[ఆధారం చూపాలి]
ఈశాటిని లోవెల్డు 250 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇతర ప్రాంతాల కంటే ఎత్తు తక్కువగా ఉంటుంది. ఇక్కడ జనసాంధ్రత తక్కువగా ఉంటుంది. ఒక విలక్షణ ఆఫ్రికా బుషు ముండ్ల చెట్లు, గడ్డి భూములు ఇక్కడ అధికంగా ఉంటాయి. ప్రారంభ రోజులలో మలేరియా కారణంగా ఈ ప్రాంతంలో జసాంధ్రత అభివృద్ధిని నిరోధించింది.[ఆధారం చూపాలి]
వాతావరణం
ఈస్వాటినీ హైవెల్డు, మధ్యవెల్డు, లోవెల్డు, లుబొంబో పీఠభూమి వాతావరణ భూభాగాలుగా విభజించబడింది. సీజన్లు ఉత్తర అర్ధగోళానికి వ్యతిరేకంగా డిసెంబరు మధ్య వేసవి, జూన్ మధ్యలో శీతాకాలం ఉంటాయి. సాధారణముగా వేసవి నెలలలో ఎక్కువగా వర్షం పడుతోంది. తరచూ అది తుఫాను రూపంలో ఉంటుంది.[ఆధారం చూపాలి]
చలికాలం పొడి వాతావరణం ఉంటుంది. పశ్చిమ ప్రాంతంలోని హైవేల్డులో వార్షిక వర్షపాతం అత్యధికంగా ఉంటుంది. ఏడాదికి సగటున 1,000 - 2,000 మి.మీ. (39.4 - 78.7అం) మధ్య ఉంటుంది. మరింత తూర్పుప్రాంతంలో తక్కువ వర్షం పాతం (సంవత్సరానికి 500 నుండి 900 మి.మీ (19.7 to 35.4 అం)) ఉంటుంది.[ఆధారం చూపాలి]
వివిధ ప్రాంతాల ఎత్తును అనుసరించి ఉష్ణోగ్రతలోని వ్యత్యాసాలు ఉంటాయి. హైవెల్డు ఉష్ణోగ్రతలు, అరుదుగా అసౌకరమైన వేడిగా ఉంటుంది. అయితే లోవ్వెల్డు వేసవిలో 40 ° సెం (104 ° ఫా) ఉష్ణోగ్రత నమోదవుతుంది.[ఆధారం చూపాలి]
The average temperatures at Mbabane, according to seasons:
వసంతం | సెప్టెంబరు - అక్టోబరు | 18 °C (64.4 °F) |
వేసవి | నవంబరు - మార్చి | 20 °C (68 °F) |
హేమంతం | ఏప్రెలు - మే | 17 °C (62.6 °F) |
శీతాకాలం | జూన్ - ఆగస్టు | 13 °C (55.4 °F) |
వన్యజీవితం
ఈశ్వాటినీలో 507 పక్షిజాతులు జాతులు ఉన్నాయి. వీటిలో అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాతులుగా గుర్తించబడుతున్న 11 పక్షిజాతులు ఉన్నాయి. 4 కొత్తగా కనిపెట్టబడిన జాతులు ఉన్నాఅయి. 107 జంతుజాతులు ఉన్నాయి. " సౌత్-సెంట్రల్ నల్లని ఖడ్గమృగం " తో కలిసి 7 ఇతర అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి.[ఆధారం చూపాలి]
ఈస్వాటిని రక్షిత ప్రాంతాలలో 7 ప్రకృతి రిజర్వులు ఉన్నాయి. 4 సరిహద్దు పరిరక్షణ ప్రాంతాలు, మూడు వన్యప్రాణులు ( గేం రిజర్వులు) ఉన్నాయి. ఈశ్వటినిలోని అతిపెద్ద పార్కు " హ్లానె రాయలు నేషనలు పార్కు " ఈస్వాటినీలో అతిపెద్ద పార్కుగా గుర్తించబడుతుంది. ఇది పక్షి జాతులతో పుష్కలంగా ఉంది. వాటిలో తెలుపు-దన్ను రాబందులు, తెల్లని తలల రాబందులు, లప్పెటు ముఖ రాబందులు, కేప్ రాబందులు, మార్షలు గ్రద్దలు, బాటెలర్లు, పొడవైన పింఛం ఉన్న గ్రద్ధలు, దక్షిణాంత ప్రాంతంలో నివసించే మరాబౌ కొంగలు ఉన్నాయి.[34]
ఆర్ధికం
ఈస్వంటిని ఆర్ధికరంగం వైవిధ్యంగా ఉంటుంది. వ్యవసాయం, మైనింగు జి.డి.పిలో 13% ఉన్నాయి. తయారీ (వస్త్రాలు, చక్కెర-సంబంధ ప్రాసెసింగు)జి.డి.పి.లో 37% ఉంటుంది. ప్రభుత్వ సేవలు జి.డి.పి.లో 50% ఉంటుంది. అధిక విలువైన పంటల పెరుగుదల (చక్కెర, అటవీ, సిట్రసు) కొరకు అధిక స్థాయి పెట్టుబడి, నీటిపారుదల, అత్యధిక ఉత్పాదకతను కలిగి ఉన్నాయి. [ఆధారం చూపాలి]
స్వాజీ నేషను ల్యాండు (ఎస్ఎన్ఎల్)లో సుమారు 75% మంది వ్యవసాయకార్మికులు పనిచేస్తున్నారు. వాణిజ్య క్షేత్రాలకు భిన్నంగా, స్వాజీ నేషను ల్యాండు తక్కువ ఉత్పాదకతను, పెట్టుబడి కొరతను ఎదుర్కొంటుంది. వస్త్ర తయారీలో, ఉత్పాదక వ్యవసాయ టి.డి.ఎల్. లలో అధిక ఉత్పాదకత సాధించింది. జీవనాధార పంటల వ్యవసాయంలో క్షీణత వంటి ద్వంద్వ స్వభావం కనిపిస్తుంది. దేశం మొత్తంలో తక్కువ అభివృద్ధి, అధిక అసమానత, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నాయి.[ఆధారం చూపాలి]
ఈశాటిని ఆర్థిక వృద్ధి దాని పొరుగువారి కంటే వెనుకబడి ఉంది. 2001 నుండి రియల్ జి.డి.పి. పెరుగుదల సగటున 2.8%. ఇతర దక్షిణాఫ్రికా కస్టమ్స్ యూనియన్ (SACU) సభ్య దేశాల్లో పెరుగుదల కంటే దాదాపు 2% తక్కువ. ఎస్.ఎన్.ఎల్.లో తక్కువ వ్యవసాయ ఉత్పాదకత, పునరావృతమయ్యే కరువులు, ఎయిడ్సు వినాశకరమైన ప్రభావం, మితిమీరిన పెద్దదైన, అసమర్థమైన ప్రభుత్వ రంగం కారణాలుగా ఉన్నాయని భావించబడుతుంది. ఈశాటిని ప్రజల ఆర్ధికవ్యవస్థ ఒక దశాబ్ధ కాలం గణనీయమైంస్ మిగులును చూసిన తరువాత 1990 చివరిలో క్షీణించింది. తగ్గుతున్న ఆదాయాలు, పెరిగిన వ్యయం కలయిక గణనీయమైన బడ్జెటు లోటుకు దారి తీసింది[ఆధారం చూపాలి]
గణనీయమైన వ్యయం మరింత వృద్ధికి దారితీయలేదు, పేదలకు ప్రయోజనం కలిగించలేదు. ప్రస్తుత ఖర్చులకంటే అధికంగా వేతనాలు, బదిలీలు, సబ్సిడీలకు వ్యయం అధికరించింది. ప్రస్తుతం వేతన బిల్లు జి.డి.పి.లో 15%, మొత్తం ప్రభుత్వ వ్యయంలో 55% పైగా ఉంటుంది. ఇవి ఆఫ్రికా ఖండంలో అత్యధిక స్థాయిలో ఉన్నాయి. అయితే ఎస్.ఎ.సి.యు. ఆదాయంలో ఇటీవలి వేగవంతమైన వృద్ధి ఆర్థిక పరిస్థితిని మార్చివేసి 2006 నుండి గణనీయమైన మిగులును నమోదు చేసింది. ఎస్.ఎ.సి.యు. ఆదాయాలు మొత్తం ప్రభుత్వ ఆదాయంలో 60% పైగా ఉన్నాయి. సానుకూలతలలో గత 20 సంవత్సరాలలో బాహ్య రుణ భారం గణనీయంగా క్షీణించడం, దేశీయ రుణ దాదాపుగా తక్కువగా ఉండడం, 2006 లో జి.డి.పి.లో ఒక శాతం బాహ్య రుణం 20% కంటే తక్కువగా ఉండడం ప్రాధాన్యత వహిస్తున్నాయి.[ఆధారం చూపాలి]
ఈశాటిని ఆర్ధిక వ్యవస్థ దక్షిణ ఆఫ్రికా ఆర్ధికవ్యవస్థకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది. దాని నుండి 90% పైగా దిగుమతులను స్వీకరిస్తూ ఎగుమతులలో 70% పంపిణీ చేస్తుంది. ఈశాటిని ఇతర కీలక వాణిజ్య భాగస్వాములు సంయుక్త రాష్ట్రాలు,ఐరోపా సమాఖ్య ప్రధాన్యత వహిస్తున్నాయి. ఈశాటిని దుస్తులు, (ఆఫ్రికన్ గ్రోత్ అండ్ ఆపర్నిటీ యాక్ట్ - AGOA - యు.ఎస్)చక్కెర (EU) ఎగుమతి చేస్తుంది. వాణిజ్య ప్రాధాన్యతలను అందుకుంది. ఈ ఒప్పందాలతో దుస్తులు, చక్కెర ఎగుమతులు రెండూ వేగంగా వృద్ధి చెందాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బలమైన ప్రవాహం కలిగి ఉన్నాయి. వస్త్ర ఎగుమతులు 2000 - 2005 మధ్యకాలంలో 200% పైగా పెరిగాయి. అదే సమయంలో చక్కెర ఎగుమతులు 50% కంటే ఎక్కువ పెరిగాయి.[ఆధారం చూపాలి]
వస్త్రాలకు వాణిజ్య ప్రాధాన్యతలను తొలగించడం, తూర్పు ఆసియా దేశాలకు ఇటువంటి ప్రాధాన్యతలను పొందడం, ఐరోపా సమాఖ్య మార్కెట్కు చక్కెర ధరలను తగ్గించడం కారణంగా ఎగుమతి రంగం నిరంతర బెదిరింపుకు గురవుతున్నాయి. ఈశాటిని మారుతున్న ప్రపంచంలో పోటీని కొనసాగించటానికి సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సవాలును పరిష్కరించడానికి పెట్టుబడి వాతావరణం కీలకమైన అంశంగా మారింది.[ఆధారం చూపాలి]
ఇటీవలే ముగిసిన ఇన్వెస్ట్మెంటు క్లైమేటు అసెస్మెంటు ఈ విషయంలో కొన్ని సానుకూల ఫలితాలను అందిస్తుంది. అనగా ఈస్వాటినీ సంస్థలు సబ్-సహారా ఆఫ్రికాలో అత్యంత సమర్ధవంతమైనవి అయినప్పటికీ ఇతర ప్రాంతాలలోని అత్యధిక ఉత్పాదక, మధ్య-ఆదాయ దేశాలలోని సంస్థల కంటే వారు తక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నారు. వారు తక్కువ మధ్యతరగతి ఆదాయ దేశాల సంస్థలతో మరింత అనుకూలంగా ఉంటారు. ప్రభుత్వ నిర్వహణా లోపం, మౌలిక సదుపాయాల కారణంగా ఆదాయం దెబ్బతింటుంది.[ఆధారం చూపాలి]
ఈస్వాటిని కరెన్సీ లిలన్గేని, దక్షిణాఫ్రికాకు ఈస్వాటిని ద్రవ్య విధానాన్ని ఉపసంహరించుకుంటూ దక్షిణాఫ్రికా ద్రవ్యంతో ముడిపెట్టుకుంది. దక్షిణాఫ్రికా కస్టమ్సు యూనియను కస్టమ్సు విధులు, ప్రభుత్వ వార్షిక ఆదాయంలో 70% దక్షిణాఫ్రికాకు చెందిన కార్మికుల చెల్లింపులు గణనీయంగా దేశీయ ఆదాయాన్ని భర్తీ చేస్తాయి. ఐఎస్ఎఫ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈస్వాటినీ తగినంత పేదదేశం కాదు. ప్రభుత్వ సేవల పరిమాణాన్ని, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి దేశం పోరాడుతోంది. ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవసరమైన వాతావరణాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తోంది.[ఆధారం చూపాలి]