ఉమరు ముసా యార్ అదువా
ఉమరు ముసా యార్'అడువా ( 1951 ఆగస్టు 16 [1] - 2010 మే 5 ) నైజీరియా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు .2007 నుంచి 2010 వరకు నైజీరియా అధ్యక్షుడుగా పనిచేశాడు . అతను 21 ఏప్రిల్ 2007న జరిగిన నైజీరియా అధ్యక్ష ఎన్నికలలో విజేతగా ప్రకటించబడ్డాడు. 2007 మే 29 న ప్రమాణ స్వీకారం చేశాడు.
అతను గతంలో 1999 నుండి 2007 వరకు కట్సినా రాష్ట్ర గవర్నర్గా పనిచేశాడు; [2] [3] పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) సభ్యుడు. 2009లో, పెరికార్డిటిస్కు చికిత్స పొందేందుకు యార్ అడువా సౌదీ అరేబియాకు వెళ్లాడు. 2010 మే 5న మరణించాడు. [4] [5]
మరణం
యార్'అడువా మే 5న అసో రాక్ ప్రెసిడెన్షియల్ విల్లాలో మరణించారు. ఇతన్నిఅంతిమ సంస్కారాలు మే 6న నైజీరియాలో జరిగాయి.
నైజీరియా ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. [6] ప్రెసిడెంట్ గుడ్లక్ జోనాథన్ మాట్లాడుతూ, నైజీరియా ప్రజలు గొప్ప వ్యక్తిని కోల్పోయారు. ఆయన మరణంతో నైజీరియా మొత్తం శోకసందమైంది. ఆయన మరణానికి నివాళులర్పిస్తున్నాను ".
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపాన్ని తెలియజేసారు [7]