పీటర్ జీమన్
పీటర్ జీమన్ (1865 మే 25-1943 అక్టోబరు 9) అనే వ్యక్తి డచ్ భౌతిక శాస్త్రవేత్త. 1902లో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని హెండ్రిక్ లారెంజ్ తో పాటుగా జీమన్ ఎఫెక్టును కనుగొన్నందుకు పొందారు.[1][2][3][4][5][6]
బాల్యము , యవ్వనము
పీటర్ జీమన్, నెధర్ లాండ్స్ లో, స్కొవెన్-డ్యులాంద్ అనే ద్వీపం లోని జొన్మెర్ పట్టన మంధు జన్మించారు. ఈయన తల్లిదంద్రులు, డచ్ రిఫోమెడ్ చర్చ్ కు పెద్ద అయిన ఖ్యాతరినస్ ఫొరండినస్ జీమన్, విలెమినా వొర్స్త్ .
ఈయనకు చిన్నవయసు నుండె భౌతిక శాస్త్రంలో ఆసక్తి ఎక్కువ .1883 లో అరొరా బొరెలిస్, నెధర్ లాండ్స్ లో కనిపించింధి .జైరిక్జీ నందు, హై స్కూల్ విద్యార్థి అయిన జీమన్, ఆ ద్రిగ్విషయం యొక్క బొమ్మను దాని వివరనను చుపించారు .ఈ ద్రిగ్విషయాన్ని ప్రచురించిన సంపాదకుడు, జీమన్ యొక్క పరిశీలనలను అంతగానొ ప్రసంసించరు .
1883 లో తన ఉన్నత పాఠశాలను పూర్తి చేసిన తరువాత, ఆయన డేల్ఫ్త్ కు తన సంప్రదాయిక భాషలలో అనుబంధ విద్య, ఆ తరువాత, విశ్వవిద్యాలయంలో ప్రవేశం . ఆయన కొర్నెలిస్ లిలి సొదరుడైన, వ్యాయామశాల సహ ఉపప్రధానోపాధ్యాయుడగు, డా.జె.డబల్యు.లిలి గారి ఇంట్లో బస చేసారు .లిలి గారు జ్యుడర్జీ పనులకు బాధ్యత వహించారు .
విద్య, ప్రారంభ జీవితం
1885 లో జీమన్ తన క్వాలిఫికేషన్ పరీక్షలు పాస్ అయిన తరువత, లీడెన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రాన్ని అద్యయనం చేశారు . 1890 లో ఆయన తన థీసిస్ పూర్తి చేయక ముందె లోరెంట్జ్ కు అసిస్టెంట్ అయ్యరు . దీని వల్ల ఆయనకు కెర్ ఏఫెక్ట్ పరిశోధనా కార్యక్రమంలో పాల్గొనగలిగారు. 1893 లో తన కెర్ ఎఫెక్ట్, ధ్రువిత కాంతి, అయస్కాంతము ఉపరితలం యొక్క ప్రతిబింబం లో డొక్ట్రరల్ థీసిస్ ను సమర్పించారు . ఆయన తన డాక్టరేట్ ను పొందిన తరువత, స్ట్రాస్బొర్గ్ లోని ఫ్రెడ్రిక్ కోల్రష్ సంస్దకు ఒక అర్ద సంవత్సరం వెళ్లారు.1895 లో స్ట్రాస్బొర్గ్ నుండి వచ్చాకా జీమన్, లైడెన్ లో గణితం, భౌతిక శాస్త్రంలో ప్రివిడొజెంట్ అయ్యరు . ఆ సంవత్సరం లోనే ఆయన జొహన్న ఏలిజబెత్ లెబ్రెట్ (1873-1962) ను పెళ్ళి చేసుకున్నడు . ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. [7][8][9][10]
1896 లో, కెర్ ఎఫ్ఫెక్ట్ లో తన ధీసెస్ ను సమర్పించిన మూడు సంవత్సరాల తర్వత, తన సుపర్వైసర్ ప్రత్యక్ష ఆదేశాలు అతిక్రమించి, బలమైన అయస్కాంత క్షేత్రం ద్వారా వర్ణపటరేఖలను విభజన కొలిచే ప్రయోగశాల పరికరాలను ఉపయోగించాడు . అతన్ని తన ప్రయత్నాలకు తొలగించబడ్దాడు, కాని తర్వాత క్లీన్చిట్ ఇచ్చింది. 1902 లోతన ఆవిష్కరణకు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఇప్పుడు జీమన్ ఎఫెక్ట్ లా గుర్తించబడింది .తన ధీసిస్ పరిశోధన పొడిగింపు కోసం కాంతి మూలం అయస్కాంత ప్రభావం మీద దర్యాప్తు ప్రారంభించారు . ఆయన ఒక వర్ణపట లైన్ అయస్కాంత క్షేత్ర సమక్షంలో అనేక భాగాలుగా విభజించబడింది అని కనుగొన్నారు.రొయల్ నెదర్లాండ్స్ అకాడమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, ఆంస్టెర్డమ్ లో మొదటి సారి లోరెంట్జ్, జీమన్ పరిశీలనలను,1896అక్టోబరు 31, శనివారం నాడు విన్నారు .
జీమన్ యొక్క ఆవిష్కరణ ప్రాముఖ్యత స్పష్టంగా తెలిసింది . జీమన్ ప్రభావాన్ని అణువు యొక్క నిర్మాణం స్పష్టపరిచే కోసం ఒక ముఖ్యమైన సాధనంగా మారింది