కొమొరోస్
కొమరోస్ అధికారికంగా " యూనియన్ ఆఫ్ కొమొరోస్ " పిలువబడుతుంది. ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న మొజాంబిక్ చానెల్ ఉత్తర దిశలో ఉన్న హిందూ మహాసముద్రంలో ఒక ద్వీప దేశం. ఈశాన్య మయోట్టె, ఈశాన్య మడగాస్కరు, ఫ్రెంచ్ ప్రాంతం మయొట్టే మద్య ఉంటుంది. కొమొరోసు రాజధాని, అతిపెద్ద నగరం మోరోని. జనాభాలో అధిక భాగం ప్రజలు సున్నీ ఇస్లాం మతానికి చెందిన వారుగా ఉన్నారు.
[Union des Comores] Error: {{Lang}}: text has italic markup (help) الإتّحاد القمريّ Al-Ittiḥād Al-Qumriyy Union of the Comoros | ||||||
---|---|---|---|---|---|---|
నినాదం ["Unité - Justice - Progrès"] Error: {{Lang}}: text has italic markup (help) (French) "Unity - Justice - Progress" | ||||||
జాతీయగీతం [Udzima wa ya Masiwa] Error: {{Lang}}: text has italic markup (help) (Comorian) "The Union of the Great Islands" | ||||||
రాజధాని అతి పెద్ద నగరం | Moroni 11°41′S 43°16′E / 11.683°S 43.267°E | |||||
అధికార భాషలు | Comorian, Arabic, French | |||||
ప్రభుత్వం | Federal republic | |||||
- | President | Ahmed Abdallah M. Sambi | ||||
Independence | from France | |||||
- | Date | July 6 1975 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 2,235 కి.మీ² (178th) 838 చ.మై | ||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | 2005 అంచనా | 798,000 (159th) | ||||
- | జన సాంద్రత | 275 /కి.మీ² (25th) /చ.మై | ||||
జీడీపీ (PPP) | 2004 అంచనా | |||||
- | మొత్తం | $1.049 billion (171st) | ||||
- | తలసరి | $1,660 (156th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.556 (medium) (132nd) | |||||
కరెన్సీ | Comorian franc (KMF ) | |||||
కాలాంశం | EAT (UTC+3) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .km | |||||
కాలింగ్ కోడ్ | +269 |
మయోట్టెలో చొచ్చుకుపోయిన భూభాగం మినహాగా కోమోరోస్ వైశాల్యం 1,660 చ.కీమీ 2 (640 చ.మై). వైశాల్యపరంగా ఇది ఆఫ్రికాదేశాలలో మూడవ అతి చిన్న ఆఫ్రికన్ దేశం. మయోట్టే మినహా జనాభా 7,95,601. వేర్వేరు నాగరికతల కూడలితో ఏర్పడిన దేశం. వైవిధ్య సంస్కృతికి, చరిత్రకు ఈ ద్వీపసమూహం గుర్తింపు పొందింది. ఈ ద్వీపసమూహాన్ని మొట్టమొదటిగా తూర్పు ఆఫ్రికా నుండి వచ్చిన బంటు మాట్లాడేప్రజలు, అరబ్బీ, ఆస్ట్రోనేసియన్ వలసప్రజలతో భర్తీ చేయబడింది.
సార్వభౌమ రాజ్యం అయిన ద్వీపసమూహ దేశం కొమొరోసులో మూడు ప్రధాన ద్వీపాలు, అనేక చిన్న ద్వీపాలు ఉన్నాయి. ప్రధాన ద్వీపాలను సాధారణంగా వారి ఫ్రెంచ్ పేర్లతో పిలుస్తారు: వాయువ్యంలో గ్రాండే కొమొర్ (ఎన్గజిడ్జా) ; మొహేలి (మవాలి) ; అంజువన్ (నజ్వాని). అదనంగా 1974 లో ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ స్వతంత్ర కొమోరోస్ ప్రభుత్వ నిర్వహణలో లేని ఫ్రాన్సు నిర్వహణలో కొనసాగుతున్న నాల్గవ ప్రధాన ద్వీపంగా ఆగ్నేయంలో-మయోట్ట్ (మారే) కూడా దేశానికి చెందినదన్న వాదన ఉంది. ప్రస్తుతం ఇది ఫ్రాంసు విదేశీ విభాగంగా ఉంది. ఫ్రాన్సు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈద్వీపం మీద హక్కు కొరకు చేసిన తీర్మానాలను ఐక్యరాజ్యసమితి రద్దు చేసి ద్వీపం మీద కొమొరియన్ సార్వభౌమత్వాన్ని నిర్ధారించింది.[1][2][3][4] అదనంగా 2011 లో ప్రజాభిప్రాయ సేకరణ తరువాత మాయోట్టే ఫ్రాంసు విదేశీ విభాగంగా కొనసాగింది.
19 వ శతాబ్దం చివరలో 1975 లో స్వతంత్రం కావడానికి ముందు కొమరోసు ఫ్రెంచి వలస సామ్రాజ్యంలో భాగంగా మారింది. స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన తరువాత దేశంలో 20 కిపైగా కూప్రాలు లేదా ప్రయత్నించిన తిరుగుబాట్లు లేక తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి. పలువురు నాయకుల హత్యలు జరిగాయి.[5] ఈ నిరంతర రాజకీయ అస్థిరత కారణంగా కొమొరోసు ప్రజలు దేశంలోని అతి ఘోరమైన ఆదాయ అసమానతతో జీవిస్తుంది. 60% పైగా గినీ కో ఎఫీషియంటుతో, మానవాభివృద్ధి జాబితాలో అతి తక్కువ స్థాయి కలిగిన దేశంగా ఉంది. 2008 నాటికి సగం మంది పౌరులు అంతర్జాతీయ దారిద్య్ర రేఖకు దిగువన (దినసరి ఆదాయం 1.25 డాలర్లు) ఉన్నారు.[6] ఫ్రెంచి ద్వీపం మయెట్టే ద్వీపం మొజాంబిక్ చానెల్లోని ఎంతో సుసంపన్నమైన భూభాగంగా ఉంది. దేశం విడిచి పారిపోయి కొమొరియనులో ప్రవేశించే అక్రమ వలసదారులకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. కొమొరోస్ ఆఫ్రికన్ యూనియన్, ఫ్రాంకోఫొనీ, ఇస్లామిక్ సహకార సంఘం, అరబ్ లీగ్ (ఇది ఉష్ణమండల శీతోష్ణస్థితి, పూర్తిగా దక్షిణ అర్థగోళంలోని అరబ్ లీగులో ఉన్న ఏకైక సభ్యదేశం), హిందూ మహాసముద్ర కమిషన్ సభ్యదేశంగా ఉంది. కొమొరోసుకు సమీపంలో వాయువ్య దిశలో టాంజానియా, ఈశాన్యంలో సీషెల్స్ ఉన్నాయి. దీని రాజధాని మోరోని, గ్రాండే కొమొరేలో ఉంది. కొమొరోసు యూనియనులో మూడు అధికారిక భాషలు (కొమొరియన్, అరబిక్, ఫ్రెంచి) ఉన్నాయి.
పేరు వెనుక చరిత్ర
కొమరోసు అనే పేరు అరబిక్ పదం " క్వమర్ " (క్వమర్ అంటే చంద్రుడు అని అర్ధం) మూలంగా ఉంది.[7]
చరిత్ర
వలసపాలనకు ముందు
కోమోరో దీవులలో మొదటిసారిగా " ఐలాండు సౌతీస్ట్ ఏషియా "కు చెందిన ప్రజలు పడవలలో ప్రయాణించి ఈ దీవులకు చేరుకుని స్థిరనివాసాలు ఏర్పరుచుకుని ఈ ప్రాంతాన్ని మానవనివాసితంగా మార్చారు. న్జ్వానిలో కనుగొనబడిన మొట్టమొదటి పురావస్తు ప్రదేశంలో లభించిన ఆధారాలు ఈ ప్రజలు ఆరవ శతాబ్దానికి ఆరంభంలో ఇక్కడ నివాసాలు ఏర్పరుచుకున్నారని తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ఈప్రాంతంలో మొదటి శతాబ్దం ప్రారంభంలో స్థిరనివాసం ప్రారంభించబడ్డాయని భావిస్తున్నారు.[8]
కొమారోసు ద్వీపాలలో ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పం, పెర్షియను గల్ఫు, మాలే ద్వీపసమూహం, మడగాస్కర్ల నుండి వచ్చిన ప్రజల సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. మొట్టమొదటి సహస్రాబ్ది అంతటా ఆఫ్రికాలో జరిగిన బంటు ప్రజల విస్తరణలో భాగంగా బంటు-మాట్లాడే వలసదారులు ఈ ద్వీపానికి చేరుకున్నారు.
పూర్వ-ఇస్లామిక్ పురాణాల ప్రకారం ఒక జిన్ని (ఆత్మ) విడిచిన ఆభరణం గొప్ప వృత్తాకార నరకాన్ని సృష్టించింది. ఇది కార్తాలా అగ్నిపర్వతం అయ్యింది. ఇది గ్రాండే కొరోరో ద్వీపమును సృష్టించింది.
కొమొరోస్ అభివృద్ధి కొన్ని దశలుగా విభజించబడింది. నమోదు చేయబడిన విశ్వసనీయంగా ప్రారంభదశ డెంబెని దశ (తొమ్మిదవ నుండి పదవ శతాబ్దాల వరకు), ఈ సమయంలో ప్రతి ద్వీపం ఒకే కేంద్ర గ్రామంగా ఉంది.[9] పదకొండవ నుండి పదిహేను శతాబ్దాల వరకు, మడగాస్కర్ ద్వీపం, మధ్యప్రాచ్య వ్యాపారుల ద్వారా సుసంపన్నమైన చిన్న గ్రామాలు ఉద్భవించాయి. ఇప్పటికే ఉనికిలో ఉన్న పట్టణాలు విస్తరించాయి. కొమొరియన్లు యెమెన్, ప్రధానంగా హద్రమౌత్, ఒమన్ వమ్శావళికి చెందినవారుగా గుర్తించబడుతున్నారు.
మద్య యుగం
ఇస్లాం మతపురాణాల ఆధారంగా 632 లో ద్వీపవాసులు మత్వా-మింద్జాను మక్కాకు పంపారని ఆయన అక్కడకు చేరుకున్న సమయంలో ముహమ్మదు ప్రవక్త మరణించాడు అని చెపుంటారు. అయినప్పటికీ ఆయన మక్కాలో కొంతకాలం నివసించిన తరువాత అతను న్గజిడ్జా తిరిగి వచ్చి కేమంగా తన ద్వీపవాసులను ఇస్లాం మతంలోకి క్రమంగా మార్చాడు.[10]
తూర్పు ఆఫ్రికా కథనాల ఆధారంగా అల్-మసూడీ రచనలు ప్రారంభ ఇస్లామికు వాణిజ్య మార్గాల్ని వర్ణించాయి. పర్షియను అరబు వర్తకులు, నావికులు, పగడపు అన్వేషకులు, అంబర్గిర్స్, దంతాలు, తాబేలు చిప్పలు, బంగారం, బానిసల కోసం అన్వేషిస్తూ ఈ ద్వీవులకు చేరుకున్నారు. వారు కొమొరోసుతో సహా జాంజ్ కూడా ఇస్లాం మతానికి మార్చారు. కొమొరోసు ప్రాముఖ్యత కారణంగా తూర్పు ఆఫ్రికా తీరం వెంట అభివృద్ధి చెందింది. చిన్న, పెద్ద మసీదులు రెండూ నిర్మించబడ్డాయి. తీరం నుండి దూరంలో ఉన్నప్పటికీ, కొమొరోసు తూర్పు ఆఫ్రికాలోని స్వాహిలి కోస్టులో ఉంది. ఇది వాణిజ్య ప్రధాన కూడలిగా ఉంది. ప్రస్తుత టాంజానియాలో ఉన్న కిల్వా, మొజాంబికులోని సోఫాలా (జింబాబ్వే బంగారం కోసం ఒక దుకాణం), కెన్యాలో మొంబాసా వంటి వాణిజ్య పట్టణాల నెట్వర్కులో భాగంగా ఈ దీవులు వాణిజ్య కూడలిగా ఉన్నాయి.[9]
15 వ శతాబ్దం ప్రారంభంలో పోర్చుగీసుల రాక ఫలితంగా తూర్పు ఆఫ్రికన్ సుల్తానుల పతనం తరువాత శక్తివంతమైన ఓమాని సుల్తాన్ సైఫ్ బిన్ సుల్తాన్ డచ్, పోర్చుగీసులను ఓడించడం ప్రారంభించాడు. అతని వారసుడు సయ్యద్ బిన్ సుల్తాన్ ఈ ప్రాంతంలో ఒమాని అరబ్ ప్రభావాన్ని పెంచాడు. తన పరిపాలనను ఒమాని పాలనలో ఉన్న జాంజిబారుకు తరలించాడు. అయినప్పటికీ కొమొరోస్ స్వతంత్రంగా మిగిలిపోయింది. మూడు చిన్న ద్వీపాలు సాధారణంగా రాజకీయంగా ఏకీకృతమై ఉన్నప్పటికీ అతిపెద్ద ద్వీపం ఎన్జిజిడ్జ్ పలు స్వతంత్ర రాజ్యాలు (ఎన్.సి.ఐ) గా విభజించబడింది.[11]
కొమొరోసు మీద ఐరోపావాసులు ఆసక్తి చూపించిన సమయానికి, ద్వీపవాసులు తమ అవసరాలను తీర్చుకునే స్వయం సమృద్ధి సాధించారు. ప్రారంభంలో భారతదేశానికి చేరే మార్గానికి నౌకలు సరఫరా చేశారు. తర్వాత బానిసలను మస్కరేనెసు తోటల ద్వీపాలకు అప్పగించారు.[11]
యురేపియన్ సంబంధాలు , ఫ్రెంచి వసపాలన
పోర్చుగీసు అన్వేషకులు మొదటి 1503 లో ద్వీపసమూహాన్ని సందర్శించారు. 16 వ శతాబ్దం అంతటా మొజాంబిక్ వద్ద పోర్చుగీస్ కోట నిర్వహణకు అవసరైన సామానులు ఈ ద్వీపాలు అందించారు.
1793 లో మడగాస్కర్ చెందిన మొగామాకు చెందిన యోధులు ముందు బానిసల కోసం ద్వీపాల మీద దాడి చేశారు. 1865 లో కొమొరోసులో జనాభాలో 40% మంది బానిసలను ఉన్నట్లు అంచనా వేయబడింది.[12] 1841 లో ఫ్రాన్సు కొమొరోసులో మొదటి స్థావరం పాలనను స్థాపించింది. మొట్టమొదటి ఫ్రెంచి వలసవాదులు మయోట్టే మకాంవేసి అండ్రియన్ట్సోలీ (అండ్రియన్ సువోలి, సకలావ డియా-నట్సోలి, బోయెనా రాజ్యంలోని సకలవావా, మాయోట్టే మగాటి రాజు మలగసే) ఒప్పందం మీద 1841 లో సంతకం చేసారు.[13] ఒప్పందం ఆధారంగా ఈ ద్వీపం ఫ్రెంచి అధికారులకు అప్పగించబడింది.[14]
కొమొరోస్ దూర ప్రాచ్యం, భారతదేశానికి చెందిన ప్రయాణీకులకు కోసం ఒక మార్గాంతర నౌకాశ్రయంగా పనిచేసింది. సూజజ్ కెనాల్ ప్రారంభము తరువాత మోజాంబిక్యూ కాలువ గుండా నౌకాప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. కోమోరోసు ఎగుమతి చేసిన స్థానిక వస్తువులలో కొబ్బరి, పశువులు, తాబేలు చిప్పలు ప్రాధాన్యత వహించాయి. ఫ్రెంచి వలసప్రజలు, ఫ్రెంచి యాజమాన్య సంస్థలు, ధనవంతులైన అరబ్బు వ్యాపారులు వాణిజ్య పంటల సాగు కొరకు మూడింట ఒక వంతు భూభాగాన్ని ఉపయోగించి తోటల ఆధారిత ఆర్థిక వ్యవస్థను స్థాపించారు. దాని విలీనం తరువాత ఫ్రాన్సు మయోట్టేను చక్కెర తోటల కాలనీగా మార్చింది. ఇతర ద్వీపాలు త్వరలోనే రూపాంతరం చెందాయి. మనోరంజితం, వెనిల్లా, కాఫీ, కోకో బీన్సు, సిసల్ ప్రధాన పంటలు ప్రవేశపెట్టబడ్డాయి.[15]
1886 లో మొహేలీని సుల్తాన్ మార్ద్జానీ అబ్దుష్ చేక్ ఫ్రెంచి రక్షణలో ఉంచారు. అదే సంవత్సరం అలా చేయటానికి ఎటువంటి అధికారం లేనప్పటికీ నాంజిజియాలోని సుల్తానేట్లలో ఒకరైన బాంబోవా సుల్తాను సయదు అలీ మొత్తం ద్వీపానికి ఫ్రెంచి మద్దతు ఇచ్చినందుకు బదులుగా ఈ ద్వీపాన్ని ఫ్రెంచ్ రక్షణలో ఉంచాడు. సుల్తాను పదవిలో ఉన్నంతకాలం (1909 లో పదవి నుండి తొలిగాడు) మొత్తంద్వీపం అధికారాన్ని కొనసాగించాడు. 1908 లో ఈ ద్వీపాలు ఏక పరిపాలన (కొలోని డి మాయోట్టే, డెపెండెన్స్) క్రింద సమైక్యం అయ్యాయి. మడగాస్కరు ఫ్రెంచి కాలనీల గవర్నర్ జనరల్ అధికారం కింద ఉంచబడ్డాయి. 1909 లో సుల్తాన్ సాయిద్ ముజాద్ద్ అఫ్జౌన్ ఫ్రెంచి పాలనకు అనుకూలంగా పదవి నుండి వైతొలిగాడు. 1912 లో కాలనీ సంరక్షిత దేశాలు రద్దు చేయబడ్డాయి. ఈ ద్వీపాలు మడగాస్కరు కాలనీలో ఒక ప్రాంతంగా మారింది.[16]
1973 లో కొమోరోసు స్వతంత్రంగా మారడానికి 1973 లో ఫ్రాంసుతో ఒప్పందం కుదుర్చుకుంది. మయోట్టే సహాయకులు తప్పుకున్నారు. నాలుగు ద్వీపాలలో రిఫరెండమ్స్ నిర్వహించబడ్డాయి. మూడు ద్వీపాలు స్వాతంత్ర్యం కోసం ఓటు వేసినప్పటికీ మయోట్టే వ్యతిరేకంగా ఓటు వేసి ఫ్రెంచి పరిపాలన కింద ఉంది. 1975 జూలై 6 న కొమొరియన్ పార్లమెంటు స్వాతంత్ర్యం ప్రకటించి ఏకపక్ష తీర్మానంగా ఆమోదించింది. అహ్మదు అబ్దుల్లా కొమోరియన్ రాజ్యానికి (État comorien; دولة القمر) మొదటి అధ్యక్షుడిగా ప్రకటించారు.
స్వాతంత్ర్యం (1975)
తర్వాతి 30 సంవత్సరాల కాలం రాజకీయ సంక్షోభానికి చిహ్నంగా మారాయి. 1975 ఆగస్టు 3 న స్వాతంత్ర్యం తరువాత అధ్యక్షుడు అహ్మదు అబ్దాల్లాను ఒక సాయుధ తిరుగుబాటుతో తొలగించి బదులుగా యునైటెడ్ నేషనల్ ఫ్రంటు ఆఫ్ ది కొమొరోసు సభ్యుడు రాకుమారుడు సయ్యదు మొహమ్మదు జాఫర్ యునైటెడ్ నేషనల్ ఫ్రంటుతో ప్రభుత్వం ఏర్పాటు చేసాడు. కొన్ని నెలల తరువాత 1976 జనవరిలో జాఫరునుఆయన రక్షణ మంత్రి అలీ సోలిషుకు చేత తొలగించబడ్డాడు.[17]
ఈ సమయంలో మయోట్టే ప్రజలు ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా రెండు ప్రజాభిప్రాయాలలో ఓటు వేసారు. మొట్టమొదటి ప్రజాభిప్రాయ సేకరణలో 1974 డిసెంబరు 22 న ఫ్రాంసుతో సంబంధాలు కొనసాగించడానికి 63.8% మద్దతు లభించింది. 1976 ఫిబ్రవరిలో జరిగిన రెండవ ప్రజాభిప్రాయసేకరణలో 99.4%తో ఓటు వేసింది. అధ్యక్షుడు సోలిహేలు పాలించిన మిగిలిన మూడు ద్వీపాలు, ఫ్రాంసుతో సంబంధాలు దెబ్బతినడంతో అనేక సోషలిస్టు పార్టీలు ఐసోలేషనిస్టు విధానాలను ఏర్పాటు చేశారు. 1978 మే 13 న బాబ్ డెనార్డు ప్రెసిడెంటు సోలిహ్ను పడగొట్టి ఫ్రెంచి, రోడేషియను, దక్షిణాఫ్రికా ప్రభుత్వాల మద్దతుతో అబ్దుల్లాను తిరిగి పదవిలో నిలబెట్టాడు. సోలిష్ సంక్షిప్త పాలనలో ఆయన చివరికి పదవి నుండి తొలగించి చంపబడ్డాడు.[17][18]
సోలిహ్కు విరుద్ధంగా అబ్దుల్లా అధికారిక పాలన సాంప్రదాయిక ఇస్లాంకు చిహ్నంగా గుర్తించబడింది.[19] దేశానికి ఫెడరల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ కొమొరోస్ (రిపబ్లిక్ ఫెడరల్ ఇస్లామిక్ డెమా కొమోర్స్; جمهورية القمر الإتحادية الإسلامية) గా మార్చబడింది. అబ్దుల్లా 1989 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. ఒక తిరుగుబాటు జరగవచ్చన్న భయపడి ఆయన సైనిక దళాలను తొలగించి బాబ్ డెన్వార్డ్ నేతృత్వంలో అధ్యక్ష గార్డును నియమించడానికి ఆర్డరు ఇచ్చాడు. డిక్రీ సంతకం చేసిన కొద్దికాలానికే అబ్దుల్లా అతని కార్యాలయంలో అసంతృప్త సైనిక అధికారి చేత కాల్చి చంపబడ్డాడు. అయినప్పటికీ తరువాతి వర్గాలు యాంటీ టాంకు క్షిపణి ఆయన పడకగదిలో ప్రవేశించి అతనిని హత్య చేశారని పేర్కొన్నారు.[20] డెనార్డ్ కూడా గాయపడినప్పటికీ అబ్దుల్లా కిల్లర్ అతని ఆధ్వర్యంలో సైనికుడిగా ఉన్నాడని అనుమానించబడింది.[21]
కొన్ని రోజుల తరువాత ఫ్రెంచి పరాట్రూపర్లు బాబ్ డానార్డ్ సౌత్ ఆఫ్రికాకు తరలించారు. మొహమ్మద్ జొహరు సాలిలీ పాత సవతి సోదరుడు తరువాత అధ్యక్షుడై 1995 సెప్టెంబరు వరకు బాబ్ డెన్మార్డ్ తిరిగి మరొక తిరుగుబాటు ప్రయత్నం చేసే వరకు పనిచేశాడు. ఈసారి ఫ్రాన్సు పారాట్రూపర్లతో జోక్యం చేసుకుని డెనార్డును లొంగిపోవలాని వత్తిడి చేసింది.[22][23] ఫ్రెంచి డ్జొహార్ను రీయూనియన్కు తొలగించి, పారిస్-మద్దతు ఉన్న మొహమేడ్ టాకి అబ్దుల్కారీమ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1998 నవంబరులో తన మరణం వరకు ఆయన శ్రామిక సంక్షోభాలు, ప్రభుత్వ అణచివేత, వేర్పాటువాద ఘర్షణల సమయంలో 1996 నుండి దేశానికి నాయకత్వం వహించాడు. తరువాత తాత్కాలిక అధ్యక్షుడు తద్జిదీన్ బెన్ సైడ్ మస్సౌడే పదవీ బాధ్యత వహించాడు.[24]
ఫ్రెంచి పాలనను పునరుద్ధరించే ప్రయత్నంలో 1997 లో అంజువాన్, మొహేలి ద్వీపాలు కొమోరోస్ నుండి తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించాయి. కానీ ఫ్రాన్స్ వారి అభ్యర్థనను తిరస్కరించడంతో ఫెడరల్ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర ఘర్షణలు సంభవించాయి.[25] 1999 ఏప్రెలులో బలహీనమైన నాయకత్వం తాత్కాలిక అధ్యక్షుడు మస్సౌడేను పడగొట్టి సైనికాధికారి కల్నల్ అజాలి అస్యుమానీ రక్తరహిత తిరుగుబాటుతో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇది కొమొరోస్ 18 వ తిరుగుబాటు లేదా 1975 లో స్వాతంత్ర్యం తరువాత ప్రయత్నించిన తిరుగుబాటు ప్రయత్నం.[26]
ద్వీపాలపై అధికారాన్ని సమైక్యం చేయడం, నియంత్రణను పునరుద్ధరించడంలో అజరాలి విఫలమవడం అంతర్జాతీయ విమర్శకు గురైంది. ఆఫ్రికన్ యూనియన్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు థాబో బెకీ ఆధ్వర్యంలో బ్రోకర్ చర్చలు జరిపి శాంతిని స్థాపించడం కోసం అంజౌనాపై ఆంక్షలు విధించింది.[27][28] దేశం అధికారిక నామము కొమొరోస్ యూనియనుగా మార్చబడింది. ప్రతి ద్వీపానికి ఒక రాజకీయ స్వయంప్రతిపత్తి వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదనంగా మూడు ద్వీపాల కోసం ఒక యూనియన్ ప్రభుత్వం జోడించబడింది.
2002 లో కోమారోస్ అధ్యక్షుడి ప్రజాస్వామ్య ఎన్నికలో విజయం సాధించిన అజాలి 2002 లో అడుగు పెట్టారు. అంతర్జాతీయ ఒత్తిడిలో బలవంతంగా అధికారంలోకి వచ్చిన సైనిక పాలకుడుగా ప్రజాస్వామ్యంగా అజాలి నాయకత్వంలో కొమరోసుకు కొత్త ఎన్నికలను ప్రారంభించే రాజ్యాంగ సవరణల చేయబడ్డాయి.[29] 2005 లో ప్రారంభంలో లోయి డెస్ కంపేటెన్సెస్ చట్టం ఆమోదించబడింది. ఇది ప్రభుత్వ సంస్థ బాధ్యతలను నిర్వచించి అమలు చేసేలాచేస్తుంది. 2006 లో ఎన్నికలు అహ్మద్ అబ్దుల్లా మహ్మద్ సమ్బి (ఇరానులో ఇస్లాంను అభ్యసించి "అయటోల్లాహ్" అని పిలువబడే సున్ని ముస్లిం) మతాధికారి గెలుపొందాడు. అజాలి ఎన్నికల ఫలితాలను స్వాగతించాడు. తద్వారా ద్వీపసమూహంలో మొదటి శాంతియుత ప్రజాస్వామ్య మార్పిడి అనుమతించబడింది.[30]
ఫ్రెంచ్ శిక్షణ పొందిన మాజీ జెండార్మే కల్నల్ మొహమ్మద్ బాకర్ 2001 లో అంజువాన్లో అధ్యక్షుడిగా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోమోరోస్ ఫెడరల్ ప్రభుత్వం, ఆఫ్రికన్ యూనియన్ చేత చట్టవిరుద్ధమని తిరస్కరించబడిన తన నాయకత్వాన్ని నిర్ధారించడానికి 2007 జూన్లో ఆయన ఎన్నికలకు ఏర్పాటు చేసాడు. 2008 మార్చి 25 న ఆఫ్రికన్ యూనియన్, కొమొరోస్ నుండి వందలకొద్దీ సైనికులతో తిరుగుబాటు చేసి అంజౌవానును స్వాధీనం చేసుకున్నారు. దీనిని ప్రజలు స్వాగతించారు: బచారు పదవీకాలం సందర్భంగా వేలాదిమంది ప్రజలు వేధింపులకు గురైనట్లు నివేదికలు ఉన్నాయి.[31] కొందరు తిరుగుబాటుదారులు చంపబడడం, గాయపడడం జరిగినప్పటికీ అధికారిక గణాంకాలు లేవు. కనీసం 11 మంది పౌరులు గాయపడ్డారు. కొంతమంది అధికారులు ఖైదు చేయబడ్డారు. బచారు ఒక బోటులో పారిపోయారు. స్వతంత్రం తరువాత 20 కన్నా ఎక్కువ తిరుగుబాటులు లేదా తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి.[5]
2010 చివరిలో ఎన్నికల తరువాత మాజీ ఉపాధ్యక్షుడు ఇకిలిలో ధోనిన్ 2011 మే 26 న అధ్యక్షుడిగా పదవిబాధ్యత ప్రారంభించారు. ఎన్నికలలో అధికార పార్టీ సభ్యుడు, ధోనినుకు అధ్యక్షుడు అహ్మద్ అబ్దుల్లా మహ్మద్ సమ్బి మద్దతు ఇచ్చారు. మోహేలి ద్వీపం నుండి ఎన్నుకొనబడిన కొమోరోసు మొదటి అధ్యక్షుడు ధోనిను గుర్తించబడ్డాడు. ధోనిను శిక్షణ పొందిన ఒక ఔషధ నిపుణుడు. 2016 ఎన్నికల తరువాత అజాలి అస్యుమానీ మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
భౌగోళికం
కొమొరోస్ (గ్రాండే కొమొరే), మోవాలి (మోహెలీ), నజ్వాని (అంజౌయన్), కోమోరోస్ అనే ద్వీపసమూహంలోని మూడు ప్రధాన దీవులతో పాటు అనేక చిన్న ద్వీపాలు ఉన్నాయి. ద్వీపాలను వారి కొమొరియన్ భాష పేర్లతో అధికారికంగా పిలుస్తారు. అయితే అంతర్జాతీయ వనరులు ఇప్పటికీ వారి ఫ్రెంచ్ పేర్లను (పైన ఉన్న కుండలీకరణంలో) ఉపయోగిస్తున్నాయి. రాజధాని, పెద్ద నగరం మొరోని, న్గజిడ్జా దీవిలో ఉంది. ద్వీపసమూహం హిందూ మహాసముద్రంలోని మొజాంబిక్ కాలువ, ఆఫ్రికన్ తీరం (మొజాంబిక్, టాంజానియాకు సమీపంలో), మడగాస్కర్ మధ్య ఉంది. భూభాగ సరిహద్దులతో లేదు.
2,034 చ.కిమీ (785 చ.మై.) వైశాల్యతతో ఇది ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటిగా గుతించబడుతుంది. కొమొరోసులో 320 కిమీ మీ 2 (120 చదరపు మైళ్ల) సముద్రభాగం కూడా ఉంది. దీవులలో అంతర్భాగంగా నిటారుగా ఉన్న పర్వతాల నుండి తక్కువ ఎత్తు కలిగిన కొండల వరకు ఉంటాయి.
కామారోసు ద్వీపసమూహంలో న్గజిడ్జ విశాలమైనదిగా ఉంది. ఇది ఇతర ద్వీపాలన్నింటి వైశాల్యానికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇది సమీపకాలంలో ఏర్పడిన ద్వీపం కనుక రాతి నేల ఉంది. ద్వీపంలో రెండు అగ్నిపర్వతాలు, కార్తాలా (క్రియాశీల), లా గ్రిల్లే (నిద్రాణ) ఉన్నాయి. మంచి నౌకాశ్రయాలు లేకపోవడం దాని భూభాగం విలక్షణమైన లక్షణాలు. మవాలి (రాజధాని ఫొబోలి) నాలుగు ప్రధాన ద్వీపాలలో అతిచిన్నది. సీమా, నియోమాకేలే, జిమిలిమే మూడు పర్వత గొలుసులతో ఉన్న న్జ్వాని (రాజధాని ముత్సముడు) ద్వీపం త్రికోణాకారంగా ఉంటుంది. ఈ ద్వీపకేంద్రంలో మౌంట్ ఎన్'టింగ్యుయి (1,575 మీ. లేదా 5,167 అడుగులు) శిఖరం ఉంది.
కొమొరోసు ద్వీపసమూహ ద్వీపాలు అగ్నిపర్వత చర్యలచే ఏర్పడినవి. న్గజిడ్జాలో చైతన్యంగా ఉన్న మౌంట్ కార్తాలా " షీల్డ్ అగ్నిపర్వతం " ఉంది. దేశంలో ఎత్తైన ప్రదేశం 2,361 మీటర్లు (7,746 అడుగులు) ఎత్తున ఉంది. ఇక్కడ కామోరోసులో కనుమరుగవుతున్న అతి పెద్ద వర్షారణ్యం ఉంది. కార్టాలా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత చైతన్యంగా ఉన్న అగ్నిపర్వతాలలో ఒకటి. ఇందులో 2006 మేలో చిన్న విస్ఫోటనంతో, 2005 ఏప్రెలులో, 1991 లకు ముందుగా విస్ఫోటనం జరిగింది. 2005 ఏప్రిల్లో విస్పోటనం కారణంగా 17 ఏప్రిల్ 19 ఏప్రిలు వరకు 40,000 మంది పౌరులు ఖాళీ చేయబడ్డారు. ఇందులో 4 కిలోమీటర్ల (1.9 - 2.5 మైళ్ళు) జ్వాలాముఖీ సరోవరం ఉంది.
కొమోరోసు (హిందూ మహాసముద్రంలో చెల్లాచెదరు ఐలాండ్స్) - గ్లోరీ గ్లోరియుస్ (ఐలే డూ లిస్, రైక్ రాక్, సౌత్ రాక్, వెర్ట్ రాక్స్ (మూడు ద్వీపాలు), మూడు పేరులేని ద్వీపాలు - (ఫ్రాన్సు విదేశీ జిల్లాలలో ఒకటి) హక్కు కావాలని వాదిస్తుంది. 1975 కు ముందు గ్లోరియసోస్ దీవులు కొలంబియా కోమోరోసు ఆధీనంలో నిర్వహించబడ్డాయి. అందువలన కొన్నిసార్లు కొమోరోసు ఇవి ద్వీపసమూహంలో భాగంగా ఉన్నాయి. కొమొరోసు ద్వీపసమూహంలోని మాజీ ద్వీపమైన బాంక్ డు గీసెర్ ఇప్పుడు మునిగి ఉంది. భౌగోళికంగా ఐలెస్ ఎపార్సెసును 1976 లో మడగాస్కరు అనిశ్చిత భూభాగంగా అనుసంధానించబడింది. కొమోరోసు, ఫ్రాన్సు రెండూ ఇప్పటికీ బాంక్ డు గీజరును గ్లోరిసోస్ దీవులలో భాగంగా చూస్తున్నాయి. దీనికి ప్రత్యేకమైన ఆర్థిక మండలం ఉంది.
వాతావరణం
సాధారణంగా ఉష్ణమండల, తేలికపాటి వాతావరణం ఉంటుంది. వర్షాల వలన రెండు ప్రధాన రుతువులు వాటి గుర్తించబడుతున్నాయి. మార్చిలో సగటు ఉష్ణోగ్రత 29-30 ° సెంటీగ్రేడు (84-86 ° ఫారెన్ హీటు), వర్షాకాలంలో అత్యంత వేడిగా ఉండే నెల కషాజీ (కస్కాజి) [ఉత్తర ఉత్తర రుతుపవనాలు]) డిసెంబరు నుండి ఏప్రిలు వరకు ఉంటుంది. సగటు చల్లని, పొడి సీజను కుసి (దక్షిణ శనివారం అనగా అర్ధం), ఇది మే నుండి నవంబరు వరకు ఉంటుంది.[32] ఈ ద్వీపాలలో తుఫానులు చాలా అరుదుగా ఉంటాయి.
పర్యావరణం
కాంగో అరణ్యాలు రాజ్యాంగ బద్ధంగా పర్యావరణ ప్రాంతంగా చేయబడింది.[ఆధారం చూపాలి]
ఆర్ధికం
ప్రపంచ పేద దేశాలలో కొమొరోసు ఒకటి. ఆర్థిక పురోగతి పేదరికం తగ్గడం ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యత. 14.3%తో నిరుద్యోగం చాలా అధికంగా ఉంది. చేపల వేట, వేటాడటం, అటవీప్రాంతం, వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో ప్రధానభాగంగా ఉంది. వ్యవసాయ రంగాలలో 38.4% మంది పనిచేస్తున్నారు.[33]
అధిక జనసాంద్రతలు సాంద్ర వ్యవసాయ ప్రాంతాల్లో చదరపు కిలోమీటరుకు 1000 మంది ఉన్నారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ గ్రామీణప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా జనాభా పెరుగుదల కారణంగా సమీప భవిష్యత్తులో పర్యావరణ సంక్షోభానికి దారితీస్తుందని భావించబడుతుంది. 2004 లో కొమొరోసు నిజమైన జి.డి.పి. పెరుగుదల 1.9% మాత్రమే ఉంది. వాస్తవంగా తలసరి జి.డి.పి. తగ్గింది. తగ్గుతున్న పెట్టుబడి, వినియోగం పతనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వాణిజ్య పంట ధరల పతనం (ముఖ్యంగా వనిల్లా) కారణంగా వాణిజ్య అసమతుల్యత పెరుగుదల వంటి అంశాలు ఈ క్షీణతలకు కారణంగా ఉన్నాయి.[33]
ద్రవ్య విధానాన్ని అనియత ఆర్థిక ఆదాయం, అధికరించిన సివిల్ సర్వీస్ వేతన బిల్లు, హెచ్.ఐ.పి.సి. పరిమితిని దాటి ఉన్న బాహ్య రుణాలు నియత్రిస్తున్నాయి. ఫ్రాంకు జోన్లో సభ్యత్వం స్థిరత్వం ప్రధానంగా ఉండడం దేశీయ ధరలపై ఒత్తిడిని కలిగించడానికి సహకరిస్తుంది.[34]
కొమొరోసు వేగంగా పెరుగుతున్న జనాభా, యువతకు ఒక చాలిచాలని రవాణా వ్యవస్థను కలిగి ఉంది. శ్రామికుల తక్కువ విద్యా స్థాయితో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి. అధిక నిరుద్యోగం, విదేశీ నిధిసహాయం, సాంకేతిక సహాయంపై భారీ ఆధారపడటం వంటివి ఆర్థికరంగాన్ని బలహీనపరుస్తున్నాయి. వ్యవసాయ రంగం నుండి గి.డి.పి.లో 40% లభిస్తుంది. 80% కార్మికులకు ఉపాధి కల్పిస్తూ చాలావరకు ఎగుమతులను అందిస్తుంది. కొమొరోసు ప్రపంచంలోనే మనోరంజితం, వెనిల్లా అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది.[35]
వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ప్రైవేటీకరించేందుకు, ఆరోగ్య సేవలు మెరుగుపర్చడానికి, ఎగుమతులను విస్తరించడానికి, పర్యాటక ప్రగతిని ప్రోత్సహించడానికి, అధిక జనాభా వృద్ధి రేటును తగ్గించడానికి ప్రభుత్వం విద్య, సాంకేతిక శిక్షణను మెరుగుపర్చడానికి పోరాడుతోంది.[36]
కొమోరోసు లోని బాంక్ డ్ గీసర్, గ్లోరియోస్ ద్వీపాలు ఆర్థిక జోన్లో భాగంగా ఉన్నాయి.[ఆధారం చూపాలి]
కోమోరోసు ఆఫ్రికా ఆర్గనైజేషన్ ఫర్ ది హార్మోనైజేషన్ ఆఫ్ బిజినెస్ లా ఇన్ ఆఫ్రికా " సభ్యదేశంగా ఉంది.(OHADA).[37]
గణాంకాలు
ఒక మిలియన్ కంటే తక్కువ మంది ప్రజలతో కొమొరోస్ ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి ఉంది. కానీ చదరపు కిలోమీటరుకు సగటున 275 నివాసితులతో (710 / చ.మై) ఇది అత్యధిక జనసాంద్రత కలిగినవారిలో దేశాలలో ఒకటిగా ఉంది. 2001 లో పట్టణ జనాభాలో 34% మంది పట్టణంగా పరిగణించబడ్డారు. కానీ అది అధికరిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ జనాభా పెరుగుదల ప్రతికూలంగా ఉంది. అయినప్పటికీ మొత్తం జనాభా పెరుగుదల ఇంకా చాలా ఎక్కువగా ఉంది.[38]
కొమొరోసు దాదాపు దాదాపు సగం మంది 15 సంవత్సరాల లోపువారు ఉన్నారు.[39] మొరోని, ముత్సముడు, దోమోని, ఫోబోని, సెంబౌ ప్రధాన పట్టణ కేంద్రాలుగా ఉన్నాయి. ఫ్రాంసులో 2,00,000 - 3,50,000 మంది కొమొరియన్లు ఉన్నారు.[40]
స్థానిక సమూహాలు
కొమొరోసు ద్వీపాలలో అధికంగా ఆఫ్రికన్-అరబ్ మూలాలకు చెందిన ప్రజలు ఉన్నారు. కొమొరోసు పలు దీవులలో షిరాజి ప్రజలు అతిపెద్ద జాతి సమూహాలలో ఒకటి మిగిలిపోయింది.[41] మైనారిటీలలో మలగాసి (క్రైస్తవులు), భారతీయులు (ఎక్కువగా ఇస్లామీయులు) ఉన్నారు. అలాగే ఇతర మైనారిటీలు మొదట్లో ఫ్రెంచి వలసవాదుల నుండి వచ్చారు. గ్రాండే కొమోరేలో (ముఖ్యంగా మొరోని) భాగాలలో చైనా ప్రజలు ఉంటారు. ఇతర ఐరోపా (అంటే డచ్చి, బ్రిటీషు, పోర్చుగీసు) పూర్వీకులు కొమోరసులో నివసిస్తున్నారు. చాలా మంది ఫ్రెంచ్లు 1975 లో స్వాతంత్ర్యం తరువాత దేశాన్ని వదిలివేసారు.[ఆధారం చూపాలి]
భాషలు
అత్యంత సాధారణంగా కొమరియను భాష (షికొమొరి) వాడుకలో ఉంది. నాలుగు వేర్వేరు వైవిధ్యాలతో (షింగజిడ్జ, షిమ్వాలి, షింజ్వానీ, షిమోరే) స్వాహిలి భాష నాలుగు ద్వీపాలలో వైవిధ్యంగా వాడుకలో ఉంది. అరబిక్, లాటిన్ లిపులు రెండూ ఉపయోగించబడుతున్నాయి. అరబిక్ మరింత విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఇటీవల లాటిన్ లిపికి అధికారిక లేఖనశాస్త్రం అభివృద్ధి చేయబడింది.[42]
కొమొరియను భాషతో పాటు, అరబిక్, ఫ్రెంచ్ కూడా అధికారిక భాషలుగా ఉన్నాయి. అరబిక్ ద్వితీయ బోధన భాషగా ఉంది. ఫ్రెంచి పరిపాలనా భాషగా, ఖురాన్-యేతర భాషా విద్యాభాషగా ఉంది.
మతం
కొమోరోసు జనాభాలో సున్నీ ముస్లిములు 99% ఉన్నారు.[43] కొమోరోస్ జనాభాలో మైనారిటీలు (ప్రధానంగా ఫ్రాన్సు మెట్రోపాలిటన్ నుంచి వచ్చిన వలసదారులు) రోమన్ కాథలిక్లుగా ఉన్నారు.[44]
ఆహారం
కొమరోసులో 1,00,000 మందికి 50 మంది నిష్పత్తిలో వైద్యులు ఉన్నారు. 2004 లో సంతోనోత్పత్తి 4.7% ఉంది. ప్రజల ఆయుఃప్రమాణం స్త్రీలకు 67 సంవత్సరాలు, పురుషులకు 62 సంవత్సరాలు ఉంటుంది.[45]
విద్య
కొమొరోసు విద్యావంతులైన జనాభా దాదాపుగా వారి జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఖుర్ఆన్ పాఠశాలలకు హాజరయ్యారు. తరచూ చదువుకునేందుకు ముందు. ఇక్కడ అబ్బాయిలకు, అమ్మాయిలకు ఖుర్ఆన్ గురించి బోధించబడుతుంది. విద్యార్థులు దానిని గుర్తుంచుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఈ ప్రారంభ విద్యను ఫ్రెంచి పాఠశాలలకి పంపడాన్ని సాధారణంగా ఎంచుకుంటారు. స్వాతంత్ర్యం, ఫ్రెంచి ఉపాధ్యాయుల ఉపసంహరణ తరువాత విద్య వ్యవస్థ పేలవమైన ఉపాధ్యాయుల శిక్షణ, పేలవమైన ఫలితాల ద్వారా బాధించబడింది. అయినప్పటికీ ఇటీవలి స్థిరత్వం గణనీయమైన మెరుగుదలలు కోసం అనుమతించవచ్చని భావిస్తున్నారు.[19][better source needed]
కోమోరోస్లో పూర్వ వలసీకరణ విద్యా వ్యవస్థలు వ్యవసాయం, పశువుల సంరక్షణ, గృహ కార్యాలను పూర్తి చేయడం వంటి అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టాయి. మత విద్య కూడా ఇస్లాం మతం మంచి లక్షణాలను పిల్లలకు బోధించింది. 1900 ల ప్రారంభంలో వలస వ్యవస్థలో విద్యావ్యవస్థ ఒక పరివర్తన చెందింది. ఇది ఫ్రెంచి వ్యవస్థపై ఆధారపడిన లౌకిక విద్యను తీసుకువచ్చింది. ఇది ప్రధానంగా ఉన్నత కులాల పిల్లలకు అందుబాటులో ఉండేది. కొమొరోసు 1975 లో స్వాతంత్ర్యం పొందిన తరువాత విద్యా వ్యవస్థ మళ్లీ మార్చబడింది. ఉపాధ్యాయుల వేతనాల కోసం నిధులు కోల్పోయారు. అనేకమంది సమ్మె చేశారు. అందువలన ప్రజా విద్యా వ్యవస్థను 1997 - 2001 మధ్య నిర్వహించలేదు. స్వాతంత్ర్యం పొందిన తరువాత విద్యావ్యవస్థ కూడా ప్రజాస్వామ్యీకరణకు గురైంది. ఉన్నత వర్గాలకే కాక ఇతర విద్యార్థులకు అవకాశాలు లభించాయి. నమోదు కూడా పెరిగింది.
2000 లో 5 నుండి 14 ఏళ్ల వయస్సులో ఉన్న 44.2% మంది పిల్లలు పాఠశాలకు హాజరయ్యారు. సాధారణంగా సౌకర్యాలు, సామగ్రి, అర్హతగల ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాలు, ఇతర వనరుల కొరత ఉంది. ఉపాధ్యాయుల వేతనాల బకాయిలు అధికంగా ఉన్నదున అనేక ప్రాంతాలలో ఉపాద్యాయులు చాలా వరకు పనిచేయడం లేదు.[46]
2000 కి ముందు విశ్వవిద్యాలయ విద్యను అభ్యర్థించే విద్యార్థులు దేశం వెలుపల పాఠశాలకు హాజరు కావలసిన అవసరం ఉండేది. అయితే 2000 ల ప్రారంభంలో దేశంలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఇది ఆర్థిక వృద్ధికి సహాయపడటానికి, దీవులకు తిరిగి వచ్చి పని చేయని అనేక మంది విద్యావంతులైన వారిని తిరిగి రప్పించడానికి ఇది ఉపయోగపడింది.[47]
జనాభాలో దాదాపు 57% మంది లాటిన్ లిపిలో అక్షరాస్యులుగా ఉన్నారు. అయితే అరబిక్ లిపిలో 90% కంటే ఎక్కువ మంది అక్షరాస్యులు ఉన్నారు. మొత్తం అక్షరాస్యత 77.8%గా అంచనా వేయబడింది.[విడమరచి రాయాలి][48] కొమోరియను భాషకు స్థానిక లిపి లేదు. కానీ అరబిక్, లాటిన్ లిపి రెండింటినీ వ్రాయడానికి ఉపయోగిస్తున్నారు..
సంస్కృతి
సంప్రదాయ కొమరియను స్త్రీలు వర్ణరంజితమైన షిరొమని అనే దుస్తులు ధరిస్తారు. అలాగే వారి ముఖాలకు మ్సింజానొ అని పిలిచే గంధం,, పగడాల పూతను ఉపయోగిస్తారు.[49] Traditional male clothing is a colourful long skirt and a long white shirt.[50]
వివాహం
కొమోరోసు మన్నా డేబో (చిన్న వివాహం), అడా (గ్రాండ్ వివాహం) లో రెండు రకాల వివాహాలు ఉన్నాయి. చిన్న వివాహం అనేది సాధారణ న్యాయ వివాహం. ఇది చిన్నది, సన్నిహితమైనది, చవకైనది. వధువు కట్నం నామమాత్రంగా ఉంటుంది. అయితే జంటగా అడా, వైభవంగా పెళ్ళి చేసుకునే వరకు చిన్న వివాహం కేవలం ఒక ప్లేస్హోల్డరుగా ఉంటుంది. వైభవ వివాహం బంగారు ఆభరణాలు, రెండు వారాల వేడుక, భారీ పెళ్ళి వరకట్నం ఉన్నాయి. వరుడు ఈ కార్యక్రమంలో చాలా ఖర్చులను చెల్లించాలి. వధువు కుటుంబం సాధారణంగా వరుని కుటుంబం వ్యయం చేసే ఖర్చులో మూడవ వంతు మాత్రమే చెల్లిస్తుంది. వైభవ వివాహానికి £ 55,000 యూరోలు వరకు ఖర్చు అవుతుంది.[dubious ] అనేకమంది పురుషులు తమ చివరి 40 ఏళ్ల వరకు (కొంత మంది ఎప్పటికీ) ఈ వివాహాన్ని చేసుకోలేరు.
వైభవ వివాహం కొమొరోసు దీవులలో సాంఘిక స్థితికి చిహ్నంగా ఉంది. అడా వివాహం పూర్తి అయిన తరువాత కొమారాన్ సోపానక్రమంలో వ్యక్తి స్థానాన్ని నిలబెట్టుకుంటారు. సాధారణ వివాహం చేసుకున్న ఒక కొమోరోసు మనిషి జాతీయ దుస్తులు కొన్ని అంశాలను మాత్రమే ధరించవచ్చు. అతను ఒక గొప్ప వివాహం చేసుకుంటే మసీదులో మొదటి వరుసలో నిలబడగలడు. అలాగే ఒక అడా వివాహం చేసుకునే వరకు ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా పరిగణించబడడం లేదు.
వైభవ వివాహసంప్రదాయం కొనసాగింపు దాని గొప్ప వ్యయం, కొమోరోసు తీవ్ర పేదరికం కారణంగా విమర్శించబడింది.[51]
సాంఘిక నిర్మాణం
ద్వైపాక్షిక సంతతికి చెందినది. స్థిరాస్థులు (భూమి, గృహము) యాజమాన్యం, వారసత్వాలకు మాతృస్వామ్యం ఆమోదించబడి ఉంటుంది. అనేక బంటు ప్రజల మాదిరిగానే, ఇతర వస్తువులు, ప్రాప్రోనిమిక్సులకు పితృస్వామ్యం అంగీకరించబడుతుంది. ఏదేమైనా ద్వీపాల మధ్య తేడాలు ఉన్నాయి. మాతృస్వామ్యం అంశం న్గజిడ్జాలో బలంగా ఉంది.[ఆధారం చూపాలి]
సంగీతం
జంజిబార్, తార్బు సంగీతం ద్వీపాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన సంగీత బాణిగా ఉంది.[ఆధారం చూపాలి]
మాధ్యమం
కొమరోసులో ప్రభుత్వానికి స్వంతమైన వార్తాపత్రిక " అల్- వత్వన్ " [52] మొరొనిలో ప్రచురించబడుతుంది.రేడియో కొమరోసు జాతీయ రేడియో సేవలను అందిస్తుంది. కొమరోసు టి.వి. టెలివిషను సేవలు అందిస్తుంది.