నోమ్ చోమ్స్కీ
అవ్రామ్ నోమ్ చోమ్స్కీ (జననం డిసెంబర్ 7 , 1928) అమెరికన్ తత్వవేత్త , భాషా శాస్త్రవేత్త , తార్కికుడు, రాజకీయ వ్యాఖ్యాత, " ఆధునిక భాషా శాస్త్ర పితామహుడిగా " గా పేరు గడించాడు. విశ్లేషణాత్మక తత్వశాస్త్రం లో ప్రధాన వ్యక్తి. తన కెరీర్లో అత్యంత ఎక్కువగా మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( MIT ) లో గడిపాడు ప్రస్తుతం గౌరవ ప్రొఫెసర్ , 100 పైగా పుస్తకాలు రచించారు . అతను ఒక ప్రముఖ సాంస్కృతిక వ్యక్తిగా అభివర్ణించారు , 2005 లో జరిపిన ఒక సర్వే లో " ప్రపంచ అగ్రగణ్య మేధావి " గా ఎన్నుకోబడ్డాడు. అమెరికా వ్యతిరే మేధావులలో అగ్రస్థానం చోంస్కీదే.
ఇతర పేర్లు | Avram Noam Chomsky |
---|---|
జననం | Philadelphia, Pennsylvania, United States | 1928 డిసెంబరు 7
యుగం | 20th / 21st-century philosophy |
ప్రాంతం | Western philosophy |
తత్వ శాస్త్ర పాఠశాలలు | Generative linguistics, Analytic philosophy |
ప్రధాన అభిరుచులు | Linguistics · Metalinguistics Psychology Philosophy of language Philosophy of mind Politics · Ethics |
Alma mater | University of Pennsylvania (B.A.) 1949, (M.A.) 1951, (Ph.D.) 1955 |
సంస్థలు | MIT (1955–present) |
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలు |
|
ప్రభావితులు
| |
ప్రభావితమైనవారు
|
బాల్యం
ఫిలడెల్ఫియా లో ఒక మధ్య తరగతి ఆశ్కేనజి యూదు కుటుంబంలో జన్మించిన చోమ్స్కీ న్యూయార్క్ నగరంలో ఉండే బంధువుల ప్రభావం వల్ల అరాజకత్వం పై తీవ్రమయిన వ్యతిరేక భావాన్ని ఏర్పరుచుకున్నాడు.
చదువు
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి భాషా శాస్త్రంలో BA, MA , PhD పూర్తిచేశాడు . 1951 నుండి 1955 వరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క సొసైటీకి సభ్యునిగా నియమించబడ్డాడు. 1955 లో మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( MIT ) లో చేరి భాషా శాస్త్ర విషయం పై ప్రచురణలు, ఉపన్యాసాలను వెలువరించి భాషాశాస్త్రానికి ప్రముఖ వ్యక్తిగా నిలిచాడు. 1967 లో వియత్నాం యుద్ధం లో అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు.
రచనలు
వ్యక్తిగత జీవితం
చోమ్స్కీ తన వృత్తి జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని వ్యక్తిగత జీవితం నుంచి పూర్తి గా వేరుగా ఉంచాడు. అతనికి కళలన్నా సంగీతమన్నా చాల ఆసక్తి. ముఖ్యంగా నాన్ ఫిక్షన్ సాహిత్యాన్ని బాగా ఇష్టపడేవారు. రాజకీయ నాయకుల పై చేసే వ్యంగ్య వ్యాఖ్యానాలు సూటిగా సంక్షిప్తంగా ఉండేవి. మీరు నాస్తికులా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా "నేను దేన్ని నమ్మకుండా ఉండగలనో మీరు చెపితే నేను నాస్తికుడినా కాదా అన్నది నేను చెపుతాను." అని సమధానం ఇచ్చారు. కరొల్ డొరిస్ స్కాట్జ్ తో 1949 లో వివాహమైంది. ఆమె 2008 లో చనిపోయింది. వారికి ముగ్గురు సంతానం.