కెన్యా

ఆఫ్రికా ఖండం లొని దేశం

కెన్యా (ఆంగ్లం Republic of Kenya), అధికారికగా కెన్యా గణతంత్రం, తూర్పు ఆఫ్రికా లోని ఒక దేశం. పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన 47 ఆఫ్రికా దేశాలలో ఇది ఒకటి. కెన్యా జనసంఖ్య 52.2 మిలియన్లు. అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రపంచ దేశాలలో కెన్యా 27 వ స్థానంలో ఉంది. కెన్యా పాలనాబాధ్యతలను ఎన్నిక చేయబడిన గవర్నర్లు నిర్వహిస్తారు. కెన్యా వైశాల్యపరంగా 580,367 square kilometres (224,081 sq mi), ప్రపంచదేశాలలో 48 వ స్థానంలో ఉంది. కెన్యా ఉత్తరసరిహద్దులో ఇథియోపియా, ఈశాన్యసరిహద్దులో సోమాలియా, దక్షిణసరిహద్దులో టాంజానియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నైరోబి.[4][5][6] పురాతన నగరం, మొట్టమొదటి రాజధాని సముద్రతీర నగరం మొబాంసా. విక్టోరియా సరోవరతీరంలో ఉన్న కిసుము సిటీ మూడవ పెద్ద నగరం. ఇతర ముఖ్యమైన పట్టణ కేంద్రాలలో నకురు, ఎల్డోరెటు నగరాలు ఉన్నాయి.

Jamhuri ya Kenya
జమ్‌హూరియా కెన్యా
కెన్యా గణతంత్రం
Flag of కెన్యా కెన్యా యొక్క చిహ్నం
నినాదం
"Harambee"  (Swahili)
"Let us all pull together"
జాతీయగీతం

కెన్యా యొక్క స్థానం
కెన్యా యొక్క స్థానం
రాజధానినైరోబి
1°16′S 36°48′E / 1.267°S 36.800°E / -1.267; 36.800
అతి పెద్ద నగరం Nairobi
అధికార భాషలు Swahili, English[1]
ప్రజానామము Kenyan
ప్రభుత్వం Semi-presidential Republic
 -  అధ్యక్షుడు Uhuru Kenyatta
 -  ప్రధాన మంత్రి Raila Odinga
Independence from the United Kingdom 
 -  Date December 12, 1963 
 -  Republic declared December 12, 1964 
 -  జలాలు (%) 2.3
జనాభా
 -  July 2008 అంచనా 37,953,8401 (36th)
 -  8 February 2007 జన గణన 31,138,735 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $61.172 billion[2] 
 -  తలసరి $1,734[2] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $31.418 billion[2] 
 -  తలసరి $890[2] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.521 (medium) (148th)
కరెన్సీ Kenyan shilling (KES)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ke
కాలింగ్ కోడ్ +254
1. According to cia.gov, estimates for this country explicitly take into account the effects of mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex, than would otherwise be expected.[3]

నిలోటో-భాషావాడుకరులైన పాస్టోలిస్టులు (కెన్యా నీలోటికు మాట్లాడే పూర్వీకులు) ప్రస్తుత దక్షిణ సూడాన్ నుండి క్రీ.పూ 500 లో కెన్యా ప్రాంతాలకు వలసవచ్చారు.[7] 19 వ శతాబ్దంలో ఐరోపా అన్వేషణతో కెన్యా ఐరోపా కాలనీకరణ ప్రారంభమైంది. ఆధునిక కెన్యా 1895 లో బ్రిటీషు సామ్రాజ్యంచే స్థాపించబడిన ఒక ప్రొటొరేటు నుండి ఉద్భవించింది. తరువాత 1920 లో కెన్యా కాలనీ ప్రారంభమైంది. 1952 లో గ్రేటు బ్రిటషు, కాలనీల మధ్య ప్రారంభమైన అనేక వివాదాలు మాయు మాయు విప్లవానికి దారితీశాయి. ఫలితంగా 1963 లో స్వాతంత్ర్య ప్రకటన చేయబడింది. స్వాతంత్ర్యం తరువాత కెన్యా కామన్వెల్తు ఆఫ్ నేషన్సు సభ్యదేశంగా ఉంది. ప్రస్తుత రాజ్యాంగం 1963 స్వాతంత్ర్య రాజ్యాంగం స్థానాన్ని 2010 లో పునర్నిర్మించబడిన రాజ్యాంగం భర్తీ చేసింది.

కెన్యా ప్రెసిడెంటు ప్రతినిధ్యం వహించే ప్రజాస్వామ్య రిపబ్లికు దీనిలో ఎన్నికైన అధికారులు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అధ్యక్షుడు దేశానికి, ప్రభుత్వానికి అధిపతిగా ఉంటారు.[8] కెన్యా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇతర అంతర్జాతీయ సంస్థలలో సభ్యదేశంగా ఉంది. సభ్యుడు. 1,460 GNI తో [9] కెన్యా ఒక తక్కువ-మధ్య-ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థగా వర్గీకరించబడింది తూర్పు, మధ్య ఆఫ్రికాలో కెన్యా ఆర్థిక వ్యవస్థ అతిపెద్దది, [10][11] నైరోబీ ప్రధాన ప్రాంతీయ వాణిజ్య కేంద్రంగా పనిచేస్తోంది.[11] వ్యవసాయం అతిపెద్ద రంగం; టీ, కాఫీ సాంప్రదాయ నగదు పంటలుగా ఉన్నాయి. తాజా పువ్వులు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎగుమతిగా ఉంది. సేవా పరిశ్రమ ప్రధాన ఆదాయవనరుగా (పర్యాటక రంగం) ఉంది. కెన్యా తూర్పు ఆఫ్రికన్ కమ్యూనిటీ వర్తక సంఘంలో సభ్యదేశంగా ఉంది. అయితే కొన్ని అంతర్జాతీయ వర్తక సంస్థలు గ్రేటరు హార్ను ఆఫ్ ఆఫ్రికాలో భాగంగా వర్గీకరించాయి.[12] కెన్యా అతి పెద్ద ఎగుమతి మార్కెట్టుగా ఆఫ్రికా ఉంది. తర్వాత స్థానంలో ఐరోపా సమాఖ్య ఉంది.[13]

పేరు వెనుక చరిత్ర

కెన్యా పర్వతం నుండి కెన్యా అనే పేరు దేశానికి స్వీకరించి " కెన్యా రిపబ్లిక్" అయింది. ఆధునిక పేరు మొట్టమొదటి నమోదిత ప్రస్తావనను 19 వ శతాబ్దంలో జర్మనీ అన్వేషకుడు జోహన్ లుడ్విగు క్రాప్ఫు రచించాడు. పురాతన దూర వర్తకనాయకుడు కివోయి నాయకత్వంలోని కంబా కెరవనులో ప్రయాణిస్తున్నప్పుడు క్రాపు పర్వతం శిఖరాన్ని చూసి దానిని ఏమని పిలుస్తారని అడిగాడు. కివోయి "కి-న్యా" లేదా "కిచ్మా- కియాయన్యా " అని చెప్పాడు. ఎందుకంటే బ్లాక్ రాక్, తెల్లటి మంచు దాని శిఖరాల నమూనా వాటిని కాక్ ఉష్ట్రపక్షి ఈకలను గుర్తు చేసింది.[14] అగుకుయు, కెన్యాపర్వత వాలులలో నివసించే అగికుయు ప్రజలు దీనిని కికుయు భాషలో కిరిమా కిరిన్యగా అని పిలుస్తారు. ఎమ్బు ప్రజలు దానిని "కిరేన్యా" అని పిలుస్తారు. ఈ మూడు పేర్లు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి.[15]

లుడ్విగు క్రాప్ఫు ఈ పేరును కెన్యా, కెగ్నియా రెండింటి పేరుతో నమోదు చేసారు.[16][17][18] ఇతరులు దీనినకి విరుద్దంగా చెప్పుకుంటున్నారు. సరైన ఆఫ్రికా ఉచ్చారణ కచ్చితమైన సంజ్ఞామానం కెన్యా, 1862.[19] ఒక స్కాటిషు భూగోళ శాస్త్రజ్ఞుడు, ప్రకృతివేత్త అయిన జోసెఫు థాంప్సన్సు 1882 నాటి మ్యాపు కెన్యా పర్వతం 1862, [14] పర్వతం పేరు ఆమోదించబడింది. ఇది దేశం పేరుగా భావించబడుతోంది. ఇది ప్రారంభ వలసరాజ్యాల కాలంలో విస్తృతమైన అధికారిక ఉపయోగానికి రాలేదు. బదులుగా తూర్పు ఆఫ్రికా ప్రొటెక్టరేటుగా సూచించబడింది. ఇది 1920 లో కెన్యా కాలనీగా మార్చబడింది.

చరిత్ర

చరిత్రకాలానికి పూర్వం

The Turkana boy, a 1.6-million-year-old hominid fossil belonging to Homo erectus.

కెన్యాలో దొరికిన 20 మిలియన్ల కన్నా ఎక్కువ సంవత్సరాల పూర్వంనాటి శిలాజాలు ఈ ప్రాంతాలలో ఆదిమమానవులకు పూర్వీకులైన ప్రైమేటులు తిరిగారని తెలియజేస్తున్నాయి. హోమో హొబిలిసు (1.8 - 2.5 మిలియన్ల సంవత్సరాల క్రితం), హోమో ఎరెక్టసు (1.9 మిలియన్ల నుండి 3,50,000 సంవత్సరాల క్రితం) వంటి హోమోనిడ్సు ఆధునిక హోమో సేపియన్సు ప్రత్యక్ష పూర్వీకులు (ప్లీస్టోసెనే యుగంలో) కెన్యాలో నివసించినట్లు టర్కనా సరస్సులో సమీపంలో ఇటీవలి అన్వేషణలు సూచిస్తున్నాయి.[20]

1984 లో సరస్సు టర్కానా వద్ద జరిపిన తవ్వకాల్లో కామోయో కిమేయు సహాయంతో పాలియోన్త్ర్రోపోలజిస్టు " రిచర్డు లీకీ " హోమో ఎరెక్టసుకు చెందిన 1.6 మిలియన్ల సంవత్సరాల " టర్కానా బాయ్ " శిలాజం కనుగొన్నాడు. మునుపటి పరిశోధన మేరీ లీకీ, లూయిస్ లీకీలు ప్రారంభ హొమినిడ్సులను గుర్తించారు. వీరు ఒల్లోర్గెసేలీ, హారెక్సు హిల్ ప్రాంతాలలో ప్రాథమిక పురావస్తు పరిశోధనలకు బాధ్యత వహించారు. ఆ తరువాత అదేప్రాంతంలో పరిశోధన బాధ్యతలను గ్లిన్ను ఐజాకు చేత చేపట్టాడు.[20]

నియోలిథికు

ప్రస్తుత కెన్యా ప్రాంతాలలో మొట్టమొదటిగా వేట-వస్తుసంగ్రహణ సమూహాలుగా, ఆధునిక ఖోయోసను భాషావాడుకరులైన అకిను ప్రజలు నివసించారని భావిస్తున్నారు.[21] ఈ ప్రజలు తరువాత హార్ను ఆఫ్ ఆఫ్రికా నుంచి కుషిటికు భాషావాడుకరులైన వ్యవసాయదారులు ఈ స్థానంలోకి వచ్చారు.[22] హోలోసీనె ప్రారంభంలో ప్రాంతీయ వాతావరణం పొడి నుండి తడి వాతావరణ పరిస్థితులకు మారిపోయింది. అనుకూలమైన వాతావరణం వ్యవసాయం, పశుపోషణ వంటి సాంస్కృతిక సంప్రదాయాల అభివృద్ధికి మరింత అవకాశాన్ని కల్పించింది.[21]

క్రీ.పూ. 500 నాటికి నీలో-భాషావాడుకరులైన పాస్టోలిస్టులు (కెన్యా నీలోటికు భాషావాడుకరులు) ప్రస్తుత దక్షిణ సూడాన్ నుండి కెన్యాలోకి వలస వచ్చారు.[7][23][24] కెన్యాలోని నిలోటికు గ్రూపులలో సంబూరు, లువో, తుర్కనా, మాసై ప్రజలు ఉన్నారు.[25]

క్రీ.పూ. మొదటి సహస్రాబ్ది నాటికి బంటు-మాట్లాడే రైతులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు.[26] బాంటసు ప్రస్తుత తూర్పు నైజీరియా, పశ్చిమ కామేరానులో ఉన్న బెనె నది వెంట పశ్చిమ ఆఫ్రికాలో ఉద్భవించింది.[27] బంటు వలసలు ఈ ప్రాంతానికి చెందిన వ్యవసాయం, ఇనుపవాడకంలో కొత్త అభివృద్ధిని తెచ్చాయి.[27] కెన్యాలోని బంటు సమూహాలలో కికుయు, లుయా, కంబ, కసీ, మేరు, కురియా, అమ్బూ, అంబెరే, వాడవిదా-వావూవత, వాపోకోమో, మిజికెండ సమూహాలు ఉన్నాయి.

మిగోరీ కౌంటీలోని తుర్కనా సరోవర పశ్చిమ దిశలో ఆర్కియోసోస్ట్రోనోమికలు సైట్ నమోర్టుంగ, థిమ్లైచు ఒహింగా నివాసిత గోడలు కెన్యా లోపలి భాగంలో గుర్తించదగిన చరిత్రపూర్వ ప్రదేశాలుగా ఉన్నాయి.

స్వాహిలి సంస్కృతి, వాణిజ్యం (1వ శతాబ్ధం–19 వ శతాబ్ధం)

A traditional Swahili carved wooden door in Lamu.

కెన్యా తీరం ఇనుముపనివారు, బంటు ప్రజలకు నివాసప్రాంతంగా మారింది. బంటు ప్రజలలో రైతులు, వేటగాళ్ళు, మత్స్యకారులు, లోహపు ఉత్పత్తి, విదేశీ దేశాల వ్యాపారులు ఉన్నారు. ఈ సమాజాలు ఈ ప్రాంతంలోని మొట్టమొదటి నగర రాజ్యలను స్థాపించారు. వీటిని అజానియా అని పిలిచేవారు.[28]

సా.శ. 1 వ శతాబ్దానికల్లా ముంబసా, మలిందీ, జంన్జిబారు లాంటి పట్టణ-రాజ్యాలలోని చాలా దేశాలు అరబ్బులతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పడం ప్రారంభించాయి. ఇది స్వాహిలీ రాజ్యాల పెరుగుతున్న ఆర్థిక వృద్ధికి దోహదపడింది. ఇస్లాం పరిచయం, అరబికు ప్రభావంతో స్వాహిలీ, బంటు భాష, సాంస్కృతిక వ్యాప్తి, అలాగే స్వాహిలీ నగరం-రాజ్యాలు పెద్ద వాణిజ్య సబంధాలు మరింత అభివృద్ధి చెందాయి.[29][30] Many historians had long believed that the city states were established by Arab or Persian traders, అరబ్బు (పర్షియా) వ్యాపారవేత్తలు నగరాల రాజ్యాలు స్థాపించబడ్డారని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అయితే పురావస్తుశాస్త్ర ఆధారాలు నగరం రాజ్యాలు స్థానిక ప్రజలు అభివృద్ధిచేసినట్లుగా గుర్తించటానికి దారితీసింది. ఇది వాణిజ్యం కారణంగా విదేశీ ప్రభావానికి గురైన బంటు సాంస్కృతిక కేంద్రంగా నిలిచింది.[31]

ఆధునిక టాంజానియాలో కిల్వా వద్ద కిల్వా సుల్తానేటు కేంద్రీకృతమై ఉండేది. దాని శిఖరాగ్ర స్థితిలో అధికారం కెన్యాతో సహా స్వాహియా తీరం అంతటా విస్తరించింది. ఇది 10 వ శతాబ్దంలో " అలీ ఇబ్ను అల్-హసను షిరాజి " [32] దక్షిణ ఇరానులోని షిరాజు నుండి వచ్చిన ఒక పర్షియన్ సుల్తాను చేత స్థాపించబడింది.[33] నగర-రాజ్యాల అరబు, పర్షియా మూలానికి చెందిన వివాదాలకు వ్యతిరేకంగా స్వతంత్రంగా, అంతర్జాతీయంగా తమను తాము చట్టబద్ధం చేసేందుకు స్వాహిలీ ప్రజలు ప్రయత్నాలు చేశారని పరిశోధకులు సూచించారు.[34][35] 10 వ శతాబ్దం నుండి కిల్వా పాలకులు విస్తారమైన పగడపు మసీదులను నిర్మించి, రాగి నాణేలను ప్రవేశపెట్టారు.[36]

పర్షియా సుల్తాను ఆలీ ఇబ్ను ఆల్-హసను షిరాజి 10 వ శతాబ్దంలో స్థాపించిన కిల్వా సుల్తానేటు నుండి మృణ్మయ ముక్కలు

.

స్వాహిలీ ప్రజలు మొంబసాను ఒక పెద్ద నౌకాశ్రయ నగరంగా నిర్మించి, ఇతర సమీప నగర-రాజ్యాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచారు. అదేవిధంగా పర్షియా, అరేబియా, భారతదేశంలో వాణిజ్య కేంద్రాలతో వాణిజ్యసంబంధాలు ఏర్పరచుకున్నారు.[37] 15 వ శతాబ్దం నాటికి పోర్చుగీసు వాహియరు డ్యుర్టే బార్బోసా "మొంబాసా గొప్ప రవాణా కేంద్రంగా అనేక రకాల చిన్న ఓడలు, గొప్ప నౌకలను నిలుపగలిగిన మంచి నౌకాశ్రయం కలిగి ఉంది. వీటిలో సోఫాలా ఇతర ప్రాంతాల నుండి కొన్ని వస్తాయి. మరి కొన్ని కాంబే, మెలిన్డే నుండి వస్తాయి. ఇతరాలు జాంజిబారు ద్వీపానికి ప్రయాణించేవి.[38]

17 వ శతాబ్దంలో స్వాహిలీ తీరం స్వాధీనం చేసుకుని ఓమానీ అరబ్బుల ప్రత్యక్ష పాలనలోకి వచ్చిన తరువాత ఒమను, జంజిబారులో ఉన్న తోటల అవసరాలను పూర్తిచేయడానికి నెరవేర్చడానికి ఒమాని అరబ్బులు బానిస వ్యాపారం విస్తరించారు.[39] ప్రారంభంలో ఈ వర్తకులు ప్రధానంగా ఒమను నుండి వచ్చారు. కాని తరువాత అనేక మంది జాంజిబారు నుండి వచ్చారు (టిప్పు టిపు వంటివారు).[40] అంతేకాక పోర్చుగీసు బ్రిటీషు బానిసల నిర్మూలనవాదులు అట్లాంటికు బానిస వాణిజ్యానికి అంతరాయం కల్పించినందుకు ప్రతిస్పందనగా ఒమాని, సాన్జిబారు వ్యాపారుల నుండి పోర్చుగీసులు బానిసలను కొనుగోలు చేయడం ప్రారంభించారు.

స్వాహిలి, అరబికు, పర్షియా, ఇతర మధ్యప్రాచ్య, దక్షిణ ఆసియా రుణదాతలతో బంటు భాష వివిధ ప్రజల మధ్య వాణిజ్యం కోసం లింగుయా ఫ్రాంకాగా అభివృద్ధి చేయబడింది.[28] స్వాహిలీ ఇప్పుడు ఇంగ్లీషు నుండి పదాలను ఋణం తీసుకుంది.

శతాబ్దాల కాలం కెన్యా తీరం చాలామంది వ్యాపారులు, అన్వేషకులకు ఆతిధ్యమిచ్చింది. కెన్యా తీరం ఉన్న నగరాలలో మలిన్డి నగరం ఉంది. ఇది 14 వ శతాబ్దం నుండి ఒక ముఖ్యమైన స్వాహిలీ స్థావరంగా మిగిలిపోయింది. ఒకసారి ఆఫ్రికా గ్రేటు లేక్సు ప్రాంతంలో ఆధిపత్యం కోసం మొంబాసాను ప్రత్యర్థిగా చేసింది. మలింది సాంప్రదాయకంగా విదేశీ శక్తులకు స్నేహపూర్వక పోర్టు నగరం. 1414 లో చైనీయ వ్యాపారి, అన్వేషకుడు జెంగు హే ది మింగు రాజవంశానికి ప్రాతినిధ్యం వహించాడు. తూర్పు ఆఫ్రికా తీరాన్ని ఆయన చివరి ' ట్రెషరి వాయేజి (నిధి సముద్రయానం) ' లో సందర్శించాడు.[41] 1498 లో పోర్చుగీసు అన్వేషకుడు వాస్కో డ గామాను మలింది అధికారులు స్వాగతించారు.

బ్రిటిషు కెన్యా (1888–1962)

British East Africa in 1909

1885 లో జాంజిబారు తీర ప్రాంతాలలోని సుల్తానుల మీద ఒక జర్మనీ సంరక్షక వ్యవస్థను స్థాపించిన నాటి నుండి కెన్యా కాలనీల చరిత్ర మొదలైంది. 1888 లో ఇంపీరియలు బ్రిటిషు ఈస్టు ఆఫ్రికా కంపెనీ రాకతో అది కొనసాగింది. 1890 లో జర్మనీ దాని తీరప్రాంతాలను బ్రిటనుకు అప్పగించినప్పుడు ఇంపీరియలు ప్రత్యర్థిత్వం నిరోధించబడింది. దీని తరువాత దేశం గుండా కెన్యా-ఉగాండా రైల్వే నిర్మాణం జరిగింది.[42]

రైల్వే నిర్మాణం కొన్ని జాతి సమూహాలచే నిరోధించబడింది - ముఖ్యంగా నార్సీ 1890 నుండి 1900 వరకు పది సంవత్సరాలపాటు ఓర్కోయియోటు కోయిటలెలు ఆరాపు సంయోయి నేతృత్వంలో నంది ప్రజల చేత నిరోధించబడింది. అయినప్పటికీ బ్రిటీషు చివరికి రైల్వేని నిర్మించింది. రైల్వే భవనాన్ని భంగపరచకుండా నివారించడానికి స్థానిక రిజర్వులో నంది ప్రజలను (తొలి జాతి సమూహం) నియమించారు. [42]

రైల్వే నిర్మాణం సమయంలో భారతీయుల గణనీయమైన ప్రవాహం ఏర్పడింది. వీరు నిర్మాణ పనులకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించారు.[43] వారు, వారి సంతతివారిలో ఎక్కువమంది తరువాత కెన్యాలో స్థిరపడ్డారు. ఇస్మాయిలీ ముస్లిం, సిక్కు సమాజాలు వంటి అనేక విభిన్న భారతీయ వర్గాలుగా ఉన్నారు.[44]

త్సావో గుండా రైల్వే నిర్మాణ సమయంలో, అనేక భారతీయ రైల్వే కార్మికులు, స్థానిక ఆఫ్రికా కార్మికులమీద త్సావో మానీటర్లు అని పిలిచే రెండు సింహాలు దాడి చేశాయి.[45]

1914 ఆగస్టులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో బ్రిటీషు ఈస్టు ఆఫ్రికా గవర్నర్లు, జర్మనీ తూర్పు ఆఫ్రికా యువ కాలనీలను ప్రత్యక్ష పోరాటాల నుండి తొలగించటానికి చేసిన ప్రయత్నంలో ఒక ఒప్పందం చేసుకున్నాయి. లెఫ్టినెంటు కల్నలు " పాలు వాను లెటోవు-వోర్బెకు " జర్మనీ సైనిక దళాల ఆధిపత్యాన్ని సాధించాడు. సాధ్యమైనంతవరకు అనేక బ్రిటిషు వనరులను కట్టడి చేయాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిగా జర్మనీ నుండి కత్తిరించిన వాన్ లెటోవు ఒక సమర్థవంతమైన గెరిల్లా యుద్ధతంత్ర పోరాటం నిర్వహించి బ్రిటీషు సరఫరాలను స్వాధీనం చేసుకుని అజేయమైన నిలిచాడు. 1918 లో ఆర్మిస్ట్రీసు సంతకం చేసిన పద్నాలుగు రోజుల తరువాత ఆయన ఉత్తర రోడేషియా (ప్రస్తుత జాంబియా) లో లొంగిపోయాడు.[43]

The Kenya–Uganda Railway near Mombasa, about 1899.

వాను లెటోను వెంటాడటానికి బ్రిటీషు భారతదేశంలో బ్రిటీషు ఇండియను ఆర్మీ దళాలను మోహరించింది. లోపలికి ప్రవేశించడానికి దూరాన్ని రవాణా చేయగల లాజిస్టిక్సును అధిగమించడానికి పెద్ద సంఖ్యలో పోర్టర్లు అవసరమయ్యారు. ఫలితంగా క్యారియరు కార్ప్సు ఏర్పడింది. అంతిమంగా దీని కొరకు 4,00,000 మంది ఆఫ్రికన్లను సమీకరించారు. ఇది వారి దీర్ఘకాల రాజకీయీకరణకు తోడ్పడింది.[43]

1920 లో తూర్పు ఆఫ్రికా ప్రొటెక్టరేటు ఒక కాలనీగా మారింది. కెన్యాపర్వతం దాని ఎత్తైన పర్వతంగా మార్చింది.[42]

20 వ శతాబ్దం ప్రారంభంలో అంతర్గత కేంద్ర పర్వత ప్రాంతాలు బ్రిటీషు, ఇతర ఐరోపా రైతులు స్థిరపడ్డారు. వీరు సంపన్న వ్యవసాయ కాఫీ, టీ తోటల యజమానులు అయ్యారు.[46] (1937 లో ప్రచురించబడిన డానిషు రచయిత బారోనెసు కారెను వాను బ్లిక్సెను-ఫైనేకే రచించిన ఒక వలసరాజ్యపు దృక్పథం నుండి ఈ కాలం మార్పు ఒక వర్ణన కనుగొనబడింది.) 1930 నాటికి సుమారుగా 30,000 మంది వైటు సెటిలర్లు ఈ ప్రాంతంలో నివసించి, రాజకీయ పలుకుబడి కారణంగా మార్కెటు ఆర్థిక వ్యవస్థకు వారి సహకారం అందించారు.[43]

కేంద్ర పర్వత ప్రాంతప్రాంతాలలో ఇప్పటికే కికుయువు ప్రజలు ఒక మిలియను మందికి పైగా నివసించేవారు. వీరిలో చాలామంది ఐరోపియన్లు ఉన్నారు. పర్వతపాద ప్రాంతాలలో భూమి ఆధీనత వాదనలు లేవు. రైతులుగా నివసించారు. వారి ఆసక్తులను కాపాడటానికి స్థిరపడిన వారు కాఫీతోటల పెంపకం నిషేధించారు. ఒక గుడిసెను పన్నును ప్రవేశపెట్టారు, భూమిలేని వారు వారి కార్మికులకు వారి సేవకు బదులుగా అతి తక్కువ భూమిని మంజూరు చేశారు. నగరాలకు భారీ ఎత్తున వలసల కారణంగా క్షీణించించింది. భూమి నుండి లభిస్తున్న ఆదాయం క్షీణించింది.[43] 1950 లలో కెన్యాలో నివసిస్తున్న 80,000 మంది సెటిలర్లు ఉన్నారు.[47]

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడు కింగ్డం కెన్యా మానవ వనరులకు ఒక ముఖ్యమైన వనరుగా ఉంది. 1940-41లో ఇటలీ దళాలు ఆక్రమించినప్పుడు మిత్రరాజ్యాల దళాలు, ఇటాలియను దళాల మధ్య జరిగిన పోరాటంలో కెన్యా కూడా ఉంది. వాజిరు, మలింది మీద కూడా బాంబు దాడి చేశారు.

1952 లో ప్రిన్సెసు ఎలిజబెతు, ఆమె భర్త ప్రిన్సు ఫిలిపు కెన్యాలోని ట్రెయాప్ప్సు హోటల్ వద్ద సెలవుదినం విడిది చేసారు. ఆసమయంలో ఆమె తండ్రి ఐదవ జార్జి తన నిద్రలో మరణించాడు. యువ యువరాణి తన పర్యటనను తగ్గించుకుని తన సింహాసనాన్ని స్వీకరించడానికి వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె 1953 లో వెస్ట్మినిస్టరు అబ్బేలో క్వీన్ రెండవ ఎలిజబెతు కిరీటాన్ని ధరించింది. రాజదంపతులతో వెళ్ళిన బ్రిటీష్ వేటగాడు, కంసర్వేషనిస్టు జిం కార్బెటు (రాజ జంటతో కలిసి) దీనిని ధరింపజేసాడు.[48]

మౌ మౌ తిరుగుబాటు

A statue of Dedan Kimathi, a Kenyan rebel leader with the Mau Mau who fought against the British colonial system in the 1950s.

1952 అక్టోబరు నుండి 1959 డిసెంబరు వరకు బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా మాయు మౌ తిరుగుబాటుతో కెన్యా అత్యవసర పరిస్థితిలో ఉంది. " కెన్యా ల్యాండు అండు ఫ్రీడం ఆర్మీ" పిలువబడే మాయు మాయు తిరుగుబాటుదారులు కికుయు సమూహానికి చెందిన ప్రజలు.

గవర్నర్ బ్రిటీషు, కింగ్సు ఆఫ్రికా రైఫిల్సుతో సహా ఆఫ్రికా దళాలసహాయం కోరాడు. బ్రిటీషు ప్రతిఘటన కార్యకలాపాలను ప్రారంభించారు. 1953 మేలో విన్స్టను చర్చిలు వ్యక్తిగత మద్దతుతో, జనరలు సర్ జార్జి ఎర్స్కిను కాలనీ సైనిక దళానికి కమాండర్-ఇన్-చీఫుగా బాధ్యతలు స్వీకరించాడు.[49]

1954 జనవరి 15 న వరుహియూ ఇటోటె (జనరలు చైనా ) పట్టుబడిన తరువాత బ్రిటిషు విచారణ మాయు మాయు కమాండు నిర్మాణం గురించి బ్రిటిషు బాగా అర్థం చేసుకోవడానికి దారితీసింది. 1954 ఏప్రెలు 24 న " వార్ కౌంసిలు " ఆమోదంతో ఆపరేషను అన్విలు ప్రారంభించబడింది. ఆపరేషను సమర్ధవంతంగా నైరోబీని సైనిక ముట్టడిలో ఉంచింది. నైరోబి నివాసితుల సాయంతో మాయు మాయు మద్దతుదారులు నిర్బంధ శిబిరాలకు తరలివెళ్లారు. బ్రిటీషు సైన్యం విశ్వసనీయ ఆఫ్రికన్లతో హోం గార్డు (కింగ్సు ఆఫ్రికన్ రైఫిల్స్ వంటి విదేశీ శక్తులు కాకుండా) వ్యూహాన్ని కేంద్రంగా చేసింది. అత్యవసర ముగియడంతో హోం గార్డులు 4,686 మాయు మౌయు సభ్యులను (మొత్తం తిరుగుబాటుదారులలో 42%) హతమార్చాడు.

1956 అక్టోబరు 20 న నేరీలో డెడాను కిమాతిని నిర్బంధించి మాయు మాయు అంతిమంగా ఓడించడంతో సైనిక దాడి ముగిసింది.[49] ఈ కాలంలో గణనీయమైన ప్రభుత్వ మార్పులు సంభవించాయి. వీటిలో అతి ముఖ్యమైనవి స్విన్నర్టను ప్లాను, ఇది విధేయులకు రివార్డులు అందించడానికి, మాయు మాయుని శిక్షించటానికి ఉపయోగించబడింది.

స్వతంత్రం

The first President and founding father of Kenya, Jomo Kenyatta.

1957 లో స్థానిక కెన్యా శాసన మండలికి మొదటి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. బ్రిటీషు అధికారాన్ని స్థానిక ప్రత్యర్థులకు అప్పగించింది. " కెన్యా ఆఫ్రికన్ నేషనల్ యూనియను " స్థాపకుడు జోమో కెన్యాటా ప్రభుత్వం ఏర్పాటు చేసాడు. కెన్యా కాలనీ, కెన్యా ప్రొటెక్టరేటు 1963 డిసెంబరు 12 న స్వాతంత్ర్యం పొందడంతో ముగిసింది. కెన్యా కాలనీమీద యునైటెడు కింగ్డం సార్వభౌమాధికారం ఇచ్చింది. కెన్యా కాలనీ స్వాతంత్ర్యం లభించగానే ఏకకాలంలో సుల్తాను కెన్యా ప్రొటెక్టరేటు మీద సార్వభౌమత్వాన్ని కోల్పోయాడు. తద్వారా కెన్యా మొత్తం ఒక సార్వభౌమ, స్వతంత్ర దేశం అయింది.[50][51] ఈ విధంగా కెన్యా యునైటెడు కింగ్డంలో కెన్యా ఇండిపెండెంసు యాక్టు 1963 క్రింద ఒక స్వతంత్ర దేశం అయ్యింది. కచ్చితంగా 12 నెలల తరువాత 1964 డిసెంబరు 12 న "కెన్యా రిపబ్లికు" పేరుతో కెన్యా రిపబ్లికుగా మారింది.[50]

ఏకకాలంలో కెన్యా సైన్యం నార్తర్ను ఫ్రాంటియరు జిల్లాలో నివసిస్తున్న సోమాలి తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా షిఫ్తా యుద్ధంతో పోరాడింది. వీరికి ఉత్తరాన సోమాలియా రిపబ్లికులో చేరాలనుకున్నారు.[52] 1967 అక్టోబరులో అరుష మెమోరాండం సంతకంతో ఒక కాల్పుల విరమణ సాధించబడింది. 1969 వరకు సంబంధిత అభద్రత కొనసాగింది.[53][54] మరింత దాడులను నిరుత్సాహపరచడానికి 1969 లో ఇథియోపియాతో కెన్యా ఒక రక్షణ ఒప్పందంలో సంతకం చేసింది,. ఇది ఇప్పటికీ అమలులో ఉంది.[55]

కెన్యా మొదటి అధ్యక్షుడు

1964 డిసెంబరు 12 న కెన్యా రిపబ్లికు ప్రకటించబడింది. జోమో కెన్యాటా కెన్యా మొదటి అధ్యక్షుడయ్యారు.[56] కెన్యాట్టా పాలనలో ప్రభుత్వం పౌర సేవా, వ్యాపార సంఘం అంతటా అవినీతి విస్తరించింది. కెన్యాట్ట, అతని కుటుంబ సభ్యులు ఈ అవినీతితో ముడిపెట్టబడ్డారు. 1963 తరువాత భారీ ఆస్తుల కొనుగోలు ద్వారా వారు తమను తాము సమృద్ధిగా చేసుకున్నారు. సెంట్రలు రిఫ్టు వ్యాలీ, కోస్టు ప్రోవిన్సులలో వారి ఆస్తి స్వాధీనాలు భూమిలేని కెన్యన్ల మధ్య గొప్ప కోపాన్ని రేకెత్తించింది. అతని కుటుంబం ఆస్తి కొనుగోలు చట్టపరమైన, పరిపాలనా అడ్డంకులను తప్పించుకునేందుకు తన అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంది. కెన్యాట్టా కుటుంబం కూడా తీరప్రాంత హోటలు వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టింది. కెన్యాట్ట వ్యక్తిగతంగా లియోనార్డు బీచు హోటలును సొంతం చేసుకుంది.[57]

ఆయన 1978 ఆగస్టు 22 తన మరణం వరకు పాలించాడు.[58]

మోయి శకం

మోయి 1978 నుండి 2002 వరకు కెన్యా అధ్యక్షుడిగా ఉన్నారు. 1978 లో కెన్యాట్టా మరణించినప్పుడు డేనియలు అప్రోపు మోయి అధ్యక్షుడయ్యారు. 1979, 1983 (స్నాపు ఎన్నికలు) 1988 లో నిర్వహించిన ఎన్నికల్లో ప్రతిపక్షరహిత ఎన్నికల ద్వారా డానియెలు అప్రూపు మోయి అధ్యక్ష పదవిని నిలబెట్టుకున్నాడు. ఇవన్నీ ఒకే పార్టీ రాజ్యాంగం క్రింద నిర్వహించబడ్డాయి. 1982 ఆగస్టు 2 న ఒక సైనిక తిరుగుబాటు ప్రయత్నం అణిచివేసిన తరువాత 1983 ఎన్నికలు సంవత్సరం ప్రారంభంలో జరిగాయి.

కెన్యా రెండవ అధ్యక్షుడు డానియెలు అరాపు మోయి, జార్జి డబల్యూ. బుషు, 2001

తక్కువ స్థాయిలో ఉన్న వైమానిక దళ సిబ్బంది సేవకుడు, సీనియరు ప్రైవేటు హిజ్కియా ఓచుకా ఈ పథకం రూపొందించబడింది. ప్రధానంగా ఎయిర్ ఫోర్సులో చేరిన సిబ్బంధి చేత నిర్వహించబడింది. చీఫ్ ఆఫ్ జనరలు స్టాఫ్ మహమూదు మొహమేదు (అనుభవజ్ఞుడైన సోమాలి సైనిక అధికారి) ఆధ్వర్యంలోని దళాలు త్వరగా తిరుగుబాటు అణిచివేయబడింది.[59] వారిలో జనరలు సర్వీసు యూనిటు - పోలీసుల పారామిలిటరీ వింగు, సాధారణ పోలీసులు కూడా ఉన్నారు.

1980 గరిస్సా ఊచకోత కారణంగా కెన్యా దళాలు వాజిరు కౌంటీలో వేలాది పౌరులమీద 1984 లో వాజిరు కౌటీలోని వేలాది మంది పౌరుల మారణకాండకు పాల్పడ్డాయి. తరువాత 2011 లో ఈ దురాగతాలపై అధికారిక విచారణ ఆదేశించబడింది.[60]

1988 లో నిర్వహించిన ఎన్నిక మలోలొంగొ (క్యూయింగు) వ్యవస్థ రాకను చూసింది. అక్కడ ఓటర్లు తమ రహస్య బ్యాలెటుకు బదులుగా తమ అభిమాన అభ్యర్థుల వెనుక ఉండాలని భావించారు.[61] ఇది ప్రజాస్వామ్య పరిపాలన క్లైమాక్సుగా భావించబడింది. ఇది రాజ్యాంగ సంస్కరణకు విస్తృతంగా ఆందోళన కలిగించింది. తరువాతి సంవత్సరాలలో మాత్రమే ఒక రాజకీయ పార్టీకి అనుమతించిన అనేక వివాదాస్పద నిబంధనలు మార్చబడ్డాయి.[62]

బహుళ పార్టీల ఆవిర్భావం, మోయి శకం పతనం

1991 లో ఒకే పార్టీ దేశంగా 26 సంవత్సరాల పాలనసాగించిన తరువాత కెన్యా ఒక బహుళ పార్టీగా అవతరించింది. 1992 అక్టోబరు 28 న అధ్యక్షుడు మోయి తన పదవీకాలానికి ఐదు నెలల ముందు పార్లమెను రద్దు చేశారు. దీని ఫలితంగా పార్లమెంటులోనూ అధ్యక్షుడిగానూ ఎన్నికల సీట్ల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 1992 డిసెంబరున 7 న ఎన్నికలకు సన్నాహాలు డిసెంబరు 29 వరకు వాయిదా పడింది. అధికార పార్టీ కె.ఎ.ఎన్.యు. మాత్రమే కాకుండా, ఎన్నికలలో ప్రాతినిధ్యం ఉన్న ఇతర పార్టీలు ఎఫ్.ఒ.ఆర్.డి. కెన్యా, ఎఫ్.ఒ.ఆర్.డి. అసిలి ఎన్నికలలో పాల్గొన్నాయి. ఈ ఎన్నికలు ప్రత్యర్థుల భారీ-స్థాయి బెదిరింపులతో పాటు, ఎన్నికల అధికారుల వేధింపులు చోటుచేసుకున్నాయి. అధికారాన్ని నిలుపుటకు ఎన్నికల ఫలితాల రిగ్గింగు జరిగిందని అధ్యక్షుడి మీద ఆరోపణలు వచ్చినందున ఇది జాతి హింసగా మారి ఒక ఆర్థిక సంక్షోభం సంభవించింది.[63][64][65] ఈ ఎన్నికలు కెన్యా రాజకీయ మలుపుగా, మోయీ అధికార పతనానికి ఆరంభంగా, కె.ఎ.ఎన్.యు అధికారస్వీకరణగా వర్ణించబడింది. మోయి అధికారాన్ని నిలుపుకున్నాడు. జార్జి సైటోటి ఉపాధ్యక్షుడు అయ్యాడు. కె.ఎ.ఎన్.యు అధికారపార్టీగా 100 స్థానాలలో విజయం సాధించగా 88 స్థానాలను 6 ప్రత్యక్షపార్టీలు దక్కించుకున్నాయి.[63][65]

Round no 1 (29 December 1992) : Elections resultsTally
Number of registered electors7,900,366
Voters5,486,768 (69.4%)
Blank or invalid ballot papers61,173
Valid votes5,425,595
Round no 1: Distribution of seats
Political GroupTotal
Kenya African National Union (KANU)100
Forum for the Restoration of Democracy (FORD-Kenya)31
Forum for the Restoration of Democracy (FORD-Asili)31
Democratic Party (DP)23
Kenya Social Congress (KSC)1
Kenya National Congress (KNC)1
Party of independent Candidates of Kenya (PICK)1

25 సంవత్సరాల కంటే అధికమైన కె.ఎ.ఎన్.యు పాలన తరువాత 1992 ఎన్నికలు బహుళ రాజకీయాలకు ఆరంభం అయ్యాయి. [63] 1992 బహుళ ఎన్నికలలో జరిగిన పోరాటాలలో 5,000 మంది ప్రజలు చనిపోయారు. మరో 75,000 మంది ఇతరులు తమ నివాసాలను వదిలారు.[66] తదుపరి ఐదు సంవత్సరాలలో తదుపరి ఎన్నికల సన్నాహాలలో అనేక రాజకీయ పొత్తులు ఏర్పడ్డాయి. 1994 లో జరమొగి ఒగింగా ఒడింగా మరణించాడు. అనేక సంకీర్ణాలు తన ఎఫ్.ఒ.ఆర్.డి కెన్యా పార్టీ, యునైటెడు నేషనలు డెమొక్రటికు అలయన్సు అని పిలువబడే నూతన పార్టీని ఏర్పరచారు. అయితే ఈ పార్టీ అసమ్మతితో బాధపడింది. 1995 లో రిచర్డు లీకే సఫీనా పార్టీని స్థాపించారు అయితే ఇది 1997 నవంబరు వరకు నమోదు చేయబడలేదు.[67]

1996 లో మోయి మరొకసారి పదవికి అధ్యక్షుడిగా ఉండటానికి కె.ఎ.ఎన్.యు. రాజ్యాంగాన్ని సవరించింది. తరువాత మోయి తిరిగి ఎన్నిక కోసం నిలబడి 1997 లో 5 వ పదవిని గెలుచుకున్నాడు.[68] అతని ప్రధాన ప్రత్యర్థులు కిబాకి, ఒడింగా అతని విజయాన్ని గట్టిగా విమర్శించబడింది.[67][69] ఈ విజయం తర్వాత మోయి రాజ్యాంగపరంగా తన పదవీకాలం ముగిసిన మరొక అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిషేధించారు. 1998 లో ప్రారంభమైన మోయి రాబోయే 2002 ఎన్నికలలో ఉహురు కెన్యాటా ఎన్నికయ్యేందుకు ప్రయత్నించి దేశంలో వారసత్వ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు.[70]

అధ్యక్షుడు కిబాకి, కొత్త రాజ్యాంగం

View of Kibera, the largest urban slum in Africa

ఉహురు కెన్యాటాను అధ్యక్షిపీఠం ఎక్కించడానికి మోయి చేసిన ప్రణాళిక విఫలమైంది. ప్రతిపక్ష సంకీర్ణ "నేషనలు రెయిన్బో కూలిషను" (ఎన్.ఎ.ఆర్.సి) కోసం పనిచేస్తున్న మవై కిబాకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అండర్సను (2003) ఎన్నికలు స్థానిక, అంతర్జాతీయ పరిశీలకులచే స్వేచ్ఛాయుతమైనవిగానూ న్యాయమైనవిగానూ నిర్ణయించబడ్డాయి. కెన్యా ప్రజాస్వామ్య పరిణామంలో ఒక మలుపుగా కనిపించాయి.[69]

2005 లో 1963 నాటి స్వాతంత్ర్య రాజ్యాంగాన్ని మార్చడానికి చేసిన ఒక ప్రణాళికను కెన్యన్లు తిరస్కరించారు.[71] తత్ఫలితంగా పాత రాజ్యాంగం అనుసరించి 2007 ఎన్నికలు జరిగాయి. రాజకీయ, జాతి హింసాకాండ జరిగినట్లు గుర్తించబడిన అత్యధిక రాజకీయ పోటీలలో కిబాకి తిరిగి ఎన్నికయ్యారు. దీని ఫలితంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రైల్లా ఒడింగా ఎన్నికల ఫలితాలలో రిగ్గింగు జరిగిందని ఆరోపించాడు. ఆయన ఎన్నుకోబడిన అధ్యక్షుడిగా ఉన్నాడని ఆరోపించారు. దీని ఫలితంగా 1,500 మంది మృతిచెందారు. మరొక 6,00,000 మంది అంతర్గత స్థానచలనం పొందారు. కెన్యాలో ఎన్నికల తరువాత జరిగిన దారుణమైన ఘోరంగా ఇది నిలిచింది. ప్రజల మరణం, స్థానభ్రంశాన్ని ఆపడానికి కిబాకి, రైల్లా ఒక ప్రధాన మంత్రి పదవిని చేపట్టడంతో కలిసి పని చేయడానికి అంగీకరించారు.[72] ఇది రైల్టాని కెన్యా రెండవ ప్రధానమంత్రిని చేసింది.

2010 జూలైలో తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీలో కొత్త తూర్పు ఆఫ్రికా కామను మార్కెట్జూణూ ఏర్పాటు చేయడానికి తూర్పు ఆఫ్రికా దేశాలతో కెన్యా పాలుపంచుకుంది.[73] 2010 ఆగస్టులో కెన్యన్లు ఒక ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించి కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఇది రాష్ట్రపతి శక్తులు, కేంద్ర ప్రభుత్వాధికారాలను పరిమితం చేసింది.[67]

ప్రభుత్వ పతనం, విభజన శక్తులు

కొత్త రాజ్యాంగం ఆమోదించిన తరువాత కెన్యా ఒక ప్రెసిడెంటు ప్రతినిధి ప్రజాస్వామ్య రిపబ్లిక్గా అవతరించింది. దానిలో కెన్యా ప్రెసిడెంటు రాజ్యాధిపతి, ప్రభుత్వాధిపతిగా పనిచేసే బహుళ-పార్టీ వ్యవస్థ రూపొందించబడింది. నూతన రాజ్యాంగం కార్యనిర్వాహక అధికారాలను ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగం ద్వారా నిర్వహిస్తుంది. దీనికి అధ్యక్షుడ్జూ నాయకత్వం వహిస్తాడు. ఇది బయట పార్లమెంటు నుంచి ఎంపిక చేయబడిన కేబినెట్ను నియమిస్తుంది. పార్లమెంటులో చట్టబద్దమైన అధికారం ప్రత్యేకించబడింది. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక, శాసనసభ నుండి స్వతంత్రంగా ఉంటుంది. ఈ కొత్త రాజ్యాంగం ప్రకారం మొయివై కిబాకి మొదటి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఉహురు కెన్యాటా ఈ రాజ్యాంగంలోని మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

2011 లో కెన్యా ఇస్లామికు టెర్రరు గ్రూపు, అల్-షాబాబుతో పోరాడటానికి సోమాలియాకు దళాలను పంపించడం ప్రారంభించింది.[74]

2011 మధ్యలో వరుసగా రెండుసార్లు మినహాయించిన వర్షపు రుతువులు తూర్పు ఆఫ్రికాలో 60 ఏళ్లలో కనిపించని ఘోరమైన కరువుకు దారితీసింది. వాయవ్య టర్కానా ప్రాంతం ముఖ్యంగా ప్రభావితమైంది.[75] ఫలితంగా స్థానిక పాఠశాలలు మూసివేయబడ్డాయి.[76] ఈ సంక్షోభం నివారించడానికి 2012 ప్రారంభంలో ఉపశమనం కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఎయిడు ఏజెన్సీలు తదనంతరం నీటిపారుదల కాలువలను త్రవ్వడం, మొక్కల విత్తనాలను పంపిణీ చేయడంతో సహా పునరుద్ధరణ కార్యక్రమాలలో తమ దృష్టిని మార్చారు.[77]

2013 లో కొత్త రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాత కెన్యా దాని మొదటి సాధారణ ఎన్నికలను నిర్వహించింది. ఉహురు కెన్యాటా వివాదాస్పద ఎన్నికల ఫలితాలలో గెలిచారు. ప్రతిపక్ష నేత రైల ఒడింగాచే పిటిషను వేయడానికి దారితీసింది. సుప్రీం కోర్టు ఎన్నికల ఫలితాలను సమర్థించింది. అధ్యక్షుడు కెన్యాటా డిప్యూటీ అధ్యక్షుడిగా విలియం రూటోను నియమించి తన పదవిని ప్రారంభించాడు. ఈ తీర్పు ఫలితమే అయినప్పటికీ అధ్యక్షుడి అధికారాలను పరిశీలించే అధికారం కలిగిన శక్తివంతమైన సంస్థగా సుప్రీం కోర్టు ఉండడం చూడవచ్చు. [78]

2017 లో ఉహురు కెన్యాటా మరో వివాదాస్పద ఎన్నికలో రెండవసారి పదవిని గెలుచుకున్నారు. ఓటమి తరువాత రాయ్లా ఒడింగా సుప్రీం కోర్టులో ఎన్నికలను తప్పుగా నిర్వహించిన ఎన్నికల కమిషను, ఉహురు కెన్యత, ఆయన రిగ్గింగు పార్టీ మీద ఆరోపించారు.ఎన్నికలు అసంతృప్తిగా ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కొన్నది.[79] ఈ తీర్పు సుప్రీం కోర్టు స్థానం స్వతంత్ర సంస్థగా పటిష్ఠం చేసింది.[80] పర్యవసానంగా కెన్యా అధ్యక్షపదవికి రెండో రౌండ్ ఎన్నికలు జరిగాయి దీనిలో ఉహురు విజేతగా ఉద్భవించాడు. రైల్యా అసమానతల కారణంగా పాల్గొనడానికి నిరాకరించారు.[81][82]

భౌగోళికం, వాతావరణం

A map of Kenya.
A Köppen climate classification map of Kenya.

5,80,367 చ.కి.మీ (2,24,081 చ.మై) వైశాల్యంతో [83] కెన్యా ప్రపంచంలోని 47 వ అతిపెద్ద దేశం (మడగాస్కరు తరువాత). ఇది 5 ° N నుండి 5 ° డిగ్రీల దక్షిణ అక్షాంశం, 34 ° నుండి 42 ° రేఖాంశంలో ఉంది. హిందూ మహాసముద్రం తీరప్రాంతం నుండి తక్కువ మైదానాలు క్రమంగా కేంద్ర పర్వత ప్రాంతాలకు పెరుగుతాయి. తూర్పున ఉన్న ఒక సారవంతమైన పీఠభూమి గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ విభజిస్తూ ఉంటాయి.[ఆధారం చూపాలి]

ఆఫ్రికాలో అత్యంత విజయవంతమైన వ్యవసాయ ఉత్పత్తి ప్రాంతాలలో కెన్యా హైలాండ్సు ఒకటి.[84] కెన్యాలో ఎత్తైన ప్రదేశం, ఖండంలోని రెండవ ఎత్తైన శిఖరంగా ఈ పర్వత ప్రాంతాలకు ప్రత్యేకత ఉంది. కెన్యా పర్వతం 5,199 మీ (17,057 అడుగులు) ఎత్తులో ఉంది. హిమానీనదాల ప్రదేశం. కిలిమంజారో పర్వతం (5,895 మీ. లేదా 19,341 అడుగులు) కెన్యా నుండి టాంజానియా సరిహద్దుకు దక్షిణంగా ఉంటుంది.

వాతావరణం

కెన్యా తీరప్రాంతాల వెంట ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. దేశంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో శుష్క వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ ప్రాంతం ప్రతి నెలలో సూర్యరశ్మిని గొప్పగా పొందుతుంది. వేసవి దుస్తులను ఏడాది పొడవునా ధరిస్తారు. సాధారణంగా రాత్రివేళలో, ఉదయకాలాలలో ఉన్నత ఎత్తైన ప్రదేశాలలో చల్లగా ఉంటుంది.

"దీర్ఘ వర్షాలు" సీజను మార్చి - జూన్ వరకు సంభవిస్తుంది. అక్టోబరు- డిసెంబరు వరకు "స్వల్పంగా వర్షాలు" సంభవిస్తాయి. వర్షపాతం కొన్నిసార్లు భారీగా ఉంటుంది. మధ్యాహ్నాలు - సాయంత్రాలలో తరచుగా వస్తుంది. ఉష్ణమండల వర్షాల నెలలలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యంత వేడిగా ఉండే కాలం ఫిబ్రవరి - మార్చి. ఇది దీర్ఘ వర్షాలకు దారితీస్తుంది. జూలై - ఆగస్టు మధ్య వరకు చలి అధికంగా ఉంటుంది.

A giraffe at Nairobi National Park, with Nairobi's skyline in background
Average annual temperatures
CityElevation (m)Max (°C)Min (°C)
Mombasa  Coastal town1732.323.8
NairobiCapital city1,66125.213.6
KisumuLakeside city1,13131.816.9
EldoretRift Valley town2,08523.69.5
LodwarDry north plainlands50634.823.7
ManderaDry north plainlands50634.825.7

వన్యజీవితం

కెన్యాలో వన్యప్రాణుల ఆవాసాలకు అంకితమైన భూభాగం గణనీయంగా కలిగి ఉంది. మాసాయి మారా ప్రాంతాలలో బ్లూ విల్డు బీస్టు, ఇతర బోవిడ్లు పెద్ద ఎత్తున వార్షిక వలసలో పాల్గొంటాయి. మారా నది మీద వలసలలో 1 మిలియను కంటే ఎక్కువ మృగాలు, 2,00,000 జీబ్రాలు వలసలలో పాల్గొంటాయి.[85]

కెన్యాలో (ప్రత్యేకంగా మాసైలో) "బిగ్ ఫైవ్" అనే వేటమృగాలు సింహం, చిరుత, గేదె, ఖడ్గమృగం, ఆఫ్రికా ఏనుగు అధికంగా కనిపిస్తాయి. ఆట జంతువులు కెన్యా, ప్రత్యేకంగా మాసాయి మారాలో చూడవచ్చు. దేశంలో జాతీయ ఉద్యానవనాలు, గేమ్ రిజర్వులలో ఇతర అడవి జంతువులలో సరీసృపాలు, పక్షులు గణనీయమైన సంఖ్యలో ఉంటాయి. జూన్ - సెప్టెంబరు మధ్య వార్షిక జంతువుల వలసలు మిలియన్ల సంఖ్యలో జంతువులతో పాల్గొనడం విలువైన విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ వలసలు పొరుగున ఉన్న టాంజానియాలోని సెరెంగెటి నుండి కెన్యాలోని మాసాయ్ మారా వరకు 2 మిలియన్ల జంతువులతో దాదాపు 2,900 కి.మీ దూరం సాగుతుంది.[86] 2,900 కి.మీ (1,802 మై) దూరం రెండు మిలియన్ల జంతువులు ప్రయాణిస్తూ ఆహారం, నీటి సరఫరా కోసం వెతుకుతూ నిరంతరం సవ్యదిశలో ప్రయాణిస్తాయి. ఈ సెరెంగెటి వలసలు ఆఫ్రికా ఏడు ప్రకృతి అద్భుతాల జాబితాలో ఒకటిగా ఉంది.

ఆర్ధికరంగం

A proportional representation of Kenya's exports.

కెన్యా మైక్రో ఎకనమికు దృక్పథం గత కొన్ని దశాబ్దాలలో స్థిరంగా వృద్ధి చెందింది. అయినప్పటికీ ఈ వృద్ధిలో ఎక్కువ భాగం నగదు సామాన్య కెన్యన్లకు సూక్ష్మ ఆర్థిక స్థాయి ఋణాలుగా మళ్ళించబడింది. నిధులు సూక్ష్మఋణాల పేరుతో సాధారణ తక్కువ, మధ్య-ఆదాయ గృహాలు, చిన్న వ్యాపారాలు, దేశవ్యాప్తంగా విస్తారమైన కష్టాలను ఎదుర్కొంటున్న, అసంతృప్తి స్ట్రైకులు, పికెటింగులకు ముఖ్యంగా దాడులకు పాల్పడుతున్న ప్రజలకు మళ్ళించబడడంతో స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యం చేయబడింది. 2014 లో దేశం జి.డి.పి.ఎగువ స్థాయికి సర్దుబాటు చేయబడింది. ఇది తక్కువ-మధ్య-ఆదాయం గల దేశంగా వర్గీకరించబడింది.

కెన్యాలో 0.555 (మాధ్యమం) మానవ అభివృద్ధి సూచిక (హెచ్.డి.ఐ) ఉంది. ప్రపంచంలోని 186 లో 145 వ స్థానంలో ఉంది. 2005 నాటికి కెన్యన్లలో 17.7% మంది రోజుకు 1.25 డాలర్ల ఆదాయంతో మాత్రమే జీవిస్తున్నారు.[87] 2017 లో కెన్యా (2016 లో (190 దేశాలలో) 113 వ స్థానం) ప్రపంచ బ్యాంకులో 92 వ స్థానంలో నిలిచింది.

ముఖ్యమైన వ్యవసాయ రంగం చాలా తక్కువగా అభివృద్ధి చెందిన రంగంగా చాలా అసమర్థంగా ఉంది. ఆహార భద్రత కలిగిన దేశాలలో వ్యవసాయరంగంలో 3% కంటే శ్రామికశక్తిని ఉపయోగిస్తుండగా కెన్యా వ్యవసాయరంగం 75% మంది ఉద్యోగులను ఉపయోగిస్తుంది. కెన్యా సాధారణంగా ఒక సరిహద్దు మార్కెట్ట్గా వర్గీకరించబడుతుంది. అప్పుడప్పుడు ఒక అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా వర్గీకరించబడుతుంది, అయితే ఇది తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి కాదు.

ఆర్ధికరంగం పర్యాటక రంగం, ఉన్నత విద్య, టెలికమ్యూనికేషంసు, ఆమోదయోగ్యమైన కరువు అనంతర వ్యవసాయం (ప్రత్యేకించి ముఖ్యమైన తేయాకు రంగాలలో) బలమైన ఫలితాలు సాధిస్తూ విస్తరించింది.[88] కెన్యా ఆర్థిక వ్యవస్థ 2007 లో 7% కంటే అధికంగా అభివృద్ధి సాధించి విదేశీ రుణాన్ని బాగా తగ్గించింది.[88] కానీ ఈ దేశం 2007 డిసెంబరులో వివాదాస్పదమైన అధ్యక్ష ఎన్నికల తరువాత ఆర్థికాభివృద్ధిలో వెంటనే మార్పులు సంభవించాయి.

గత దశాబ్దంలో టెలికమ్యూనికేషను ఆర్థిక కార్యకలాపాలు ప్రస్తుతం జి.డి.పి.లో 62% ఉన్నాయి. జిడిపిలో 22% ఇంకా వ్యవసాయ రంగం నుండి వచ్చింది. ఇది 75% కార్మిక శక్తిని కలిగి ఉంది. ఆహార భద్రత సాధించని తక్కువ అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థగా వర్గీకరించబడింది. జనాభాలో ఒక చిన్న భాగం ఆహార సహాయం మీద ఆధారపడుతుంది.[89]

పరిశ్రమలు, ఉత్పాదక రంగం చాలా చిన్నది. ఇది జి.డి.పిలో 16% ఉంది. సేవ, పరిశ్రమ ఉత్పాదక రంగాలు 25% కార్మికులను మాత్రమే వినియోగిస్తాయి. అయితే జి.డి.పి.లో 75% వాటాను కలిగి ఉంటాయి.[88] కెన్యా అగోయా కింద $ 400 మిలియన్ల డాలర్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తుంది.

సంర్ధవంతంగా పనిచేయని కెన్యా పోస్టు, టెలికమ్యూనికేషన్సు కంపెనీ వంటి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కారణంగా తూర్పు ఆఫ్రికాలో అత్యంత లాభదాయక సంస్థ-సఫర్కోం ఏర్పడింది. భారీ ప్రైవేటు పెట్టుబడుల కారణంగా వారి పునరుద్ధరణకు దారితీసింది.

2011 మే నాటికి ఆర్థిక అవకాశాలు 4-5% జి.డి.పి. పెరుగుదలతో సానుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా పర్యాటక రంగం, టెలీకమ్యూనికేషన్సు, రవాణా, నిర్మాణం, వ్యవసాయంలో ఒక పునరుద్ధరణ సాధించింది. 2012 లో ప్రపంచ బ్యాంకు అంచనా 4.3% అభివృద్ధి జరిగినట్లుగా అంచనా వేసింది.[90]

కెన్యా, ట్రెండ్సు ఇన్ ది హ్యూమను డెవలప్మెంటు ఇండెక్సు 1970-2010

1996 మార్చిలో కెన్యా, టాంజానియా, ఉగాండా అధ్యక్షులు తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ (ఇ.ఎ.సి) ను మళ్లీ స్థాపించారు. సుంకాలు, కస్టమ్సు, ప్రజల స్వేచ్ఛా ఉద్యమం, ప్రాంతీయ అంతర్గత నిర్మాణాలను మెరుగుపరచడం వంటివి ఇ.ఎ.సి. లక్ష్యాలు. 2004 మార్చిలో తూర్పు ఆఫ్రికా దేశాలు కస్టమ్సు యూనియను ఒప్పందం మీద సంతకాలు చేసాయి.

కెన్యా ఆర్థిక సేవలకు ఈస్టు, సెంట్రలు ఆఫ్రికా కేంద్రంగా ఉంది. మార్కెట్టు క్యాపిటలైజేషను నివేదిక ఆధారంగా నైరోబీ సెక్యూరిటీసు ఎక్స్ఛేంజు (ఎన్ఎస్ఈ) ఆఫ్రికాలో 4 వ స్థానంలో ఉంది. కెన్యా బ్యాంకింగు వ్యవస్థ సెంట్రలు బ్యాంకు ఆఫ్ కెన్యా (సి.బి.కె) పర్యవేక్షిస్తుంది. 2004 జూలై చివరి నాటికి ఈ వ్యవస్థలో 43 వాణిజ్య బ్యాంకులు (2001 లో 48 నుండి తగ్గాయి), తనఖా కంపెనీలు, నాలుగు పొదుపు - రుణ సంఘాలు, పలు ప్రధాన విదేశీ మారక బ్యూరోలతో సహా పలు బ్యాంకు-వ్యస్థకు చెందని ఆర్థిక సంస్థలు ఉన్నాయి.[88]

పర్యాటకం

Amboseli National Park
Tsavo East National Park

వ్యవసాయం తరువాత కెన్యాలో పర్యాటక రంగం విదేశీ మారకం ఆదాయంలో రెండవ అతిపెద్ద వనరుగా ఉంది.[91] కెన్యాలో పర్యాటక రంగం గురించి సమాచారం అందించడానికి కెన్యా పర్యాటక బోర్డు బాధ్యత వహిస్తుంది.[92][93] ప్రధాన పర్యాటక ఆకర్షణలలో 60 జాతీయపార్కులు, గేమ్ రిజర్వుల ద్వారా ఫోటో సఫారీలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ప్రపంచంలోని 7 వ అద్భుతంగా భావించబడుతున్న మాసైమారా జంతువుల వలసలు, చారిత్రాత్మక మసీదులు, కాలనీల యుగ కోటలుగా పరిగణించబడుతున్న మొంబాసా, మలింది, లమ్యులలోని కోటలు ఉన్నాయి. తెల్లటి మంచుతో కప్పబడిన కెన్యాపర్వత శిఖరాలు, గ్రేటు రిఫ్టు లోయ వంటి ప్రఖ్యాత ప్రకృతి దృశ్యాలు, కేరికోలో టీ తోటల పెంపకం, థికా వద్ద కాఫీ తోటలు అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి. టాంజానియా సరిహద్దులోని కిళిమంజారో పర్వత అద్భుతదృశ్యాలు పర్యాటక ఆకర్షణలో మరింత ప్రాధాన్యత కలిగి ఉంది.[94] హిందూ మహాసముద్రంలో స్వాహిలీ కోస్టు వెంట ఉన్న బీచులు జర్మనీ, యునైటెడ్ కింగ్డంల నుండి అతిపెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులకు ఆకర్షణలుగా ఉన్నాయి. తీరప్రాంత బీచ్లు, గేం రిజర్వేషన్లు ప్రధానంగా ఆకర్షిస్తున్నాయి. ఆగ్నేయప్రాంతంలో ఉన్న విస్తారమైన తూర్పు త్సావో వెస్టు నేషనలు పార్కు 20,808 చ.కి.మీ పెద్ద సమిహ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

వ్యవసాయ రంగం

A Tea farm near Kericho, Kericho County.

కెన్యా స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) కు సేవా రంగం తరువాత వ్యవసాయం రెండవ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 2005 లో అటవీ చేపలు పట్టడంతో సహా వ్యవసాయం జి.డి.పి.లో 24%, అలాగే 18% వేతన ఉపాధి కల్పన, ఎగుమతుల నుండి 50% రెవెన్యూను కలిగి ఉంది. ప్రధాన నగదు పంటలు టీ, తోటపని ఉత్పత్తి, కాఫీ. హార్టికల్చరలు ఉత్పత్తి, టీ ప్రధాన అభివృద్ధి చెందుతున్న రంగాలుగా ఉన్నాయి. కెన్యా ఎగుమతులలో ఈ రెండు అత్యంత విలువైనవి. వాతావరణ సంబంధిత హెచ్చుతగ్గులకు అనుగుణంగా మొక్కజొన్న వంటి ప్రధాన ఆహార ఉత్పత్తి ఉంటుంది. ఉత్పత్తి తిరోగమనాలు క్రమానుగతంగా ఆహారం కొరతకు కారణం ఔతుంటాయి-ఉదాహరణకు 2004 లో కెన్యా అడపాదడపా కరువులలో ఒకటి 1.8 మిలియన్ల ప్రజలకు కొరత ఏర్పడింది.[95]

సెమి-అరిడు ట్రాపిక్సు కొరకు అంతర్జాతీయ పంటల రీసెర్చి ఇన్స్టిట్యూటు నేతృత్వంలోని ఒక కన్సార్టియం, ముఖ్యంగా పొడి ప్రాంతాలలో మొక్కజొన్నకి బదులుగా రైతులు కొత్త పీజియను బఠాణి రకాలను ఉత్పత్తి చేయడంలో కొన్ని విజయాలను సాధించారు. పావురం బఠానీలు అధిక కరువు నిరోధకత కలిగివుంటాయి. 650 మి.మీ.ల వర్షపాతం కంటే తక్కువ వర్షపాతంలో కూడా వీటిని పండించడానికి వీలౌతుంది. స్థానిక విత్తన ఉత్పత్తి, పంపిణీ, మార్కెటింగు కొరకు వ్యవసాయ డీలరు నెట్వర్కర్ల అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా, తరువాతి ప్రాజెక్టు వ్యాపారీకరణను ప్రోత్సహించాయి. ఈ పని, టోకు తయారీదారులను కలిపడం ద్వారా నైరోబి, మొంబాసాలలో స్థానిక ఉత్పత్తి ధరలను 20-25% అధికరింపజేసింది. పీజియను వ్యాపారీకరణను ప్రారంభించడంతో ప్రస్తుతం కొంతమంది రైతులు మొబైలు ఫోన్ల నుండి ఉత్పాదక భూమి, పశువుల వరకు ఆస్తులను కొనుగోలు చేయడానికి, పేదరికం నుండి బయటికి వెళ్లేందుకు మార్గం ప్రారంభం అయింది.[96]

సారవంతమైన పర్వత ప్రాంతాలలో తేయా, కాఫీ, సిసల్ (ఆకుకూర), పైరేత్రం (పూలు), మొక్కజొన్న, గోధుమలు పెరుగుతాయి. ఇది ఆఫ్రికాలో అత్యంత విజయవంతమైన వ్యవసాయ ఉత్పత్తి ప్రాంతాలలో ఒకటి.[84] ఉత్తర, తూర్పు ప్రాంతాలకు పాక్షిక-శుష్క సవన్నాలో అధికంగా పశువుల పెంపకం చేపట్టబడుతుంది. కొబ్బరికాయలు, అనాస, జీడిపప్పు, పత్తి, చెరకు, సిసలు, మొక్కజొన్న దిగువ ప్రాంతాలలో పెరుగుతాయి. కెన్యా ఆహార భద్రతకు హామీ ఇవ్వగల వ్యవసాయ రంగ సమర్థతను సాధించలేదు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు అధికరించవలసిన ఉంది. దారిద్యం (జనాభాలో 53% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నది) తగ్గించడానికి అవసరమైన ఉత్పత్తిని సాధించలేదు. జనాభాలోని గణనీయమైన భాగం క్రమంగా ఆకలితో బాధపడుతూ, ఆహార సహాయంపై అధికంగా ఆధారపడి ఉంటుంది.[89] తక్కువ రహదరి సౌకర్యాలు, సరిపోని రైల్వే నెట్వర్కు, తక్కువగా ఉపయోగంలో ఉన్న నీటి రవాణా, ఖరీదైన వాయు రవాణా, చాలా అధికంగా శుష్క, సెమీ-శుష్క ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లోని రైతులు ఆహార కొరతతో బాధపడుతున్నారు. తరచూ పులాలలో ఆహారధాన్యాలు దోపిడీకి గురౌతుంటాయి. 2011 ఆగస్టు, సెప్టెంబరు కెన్యాలను రెడ్ క్రాసు చొరవ కొరకు ప్రేరేపించేలా చేసింది.[97]

కెన్యాలో వ్యవసాయ గ్రామీణ ప్రాంతాలు

కెన్యా నీటిపారుదల రంగాన్ని మూడు సంస్థాగత రంగాలుగా వర్గీకరించారు: చిన్న హోల్డరు పథకాలు, కేంద్రీయ నిర్వహణ పబ్లికు పథకాలు, ప్రైవేటు వాణిజ్య నీటిపారుదల పథకాలు.

చిన్నస్థాయి పథకాల సొంతదారులు స్వయం సహాయక సమూహాలుగా పనిచేసే వ్యక్తులు - సమూహాల రైతులకు యాజమాన్యం నీటిపారుదల అభివృద్ధిచేసి నిర్వహించబడుతున్నాయి. నీటిపారుదల 0.1-0.4 హెక్టార్ల సగటు లేదా సమూహ పొలాలలో జరుగుతుంది. చిన్న నీటిపారుదల పథకాలు మొత్తం 47,000 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 3,000 మంది రైతులకు నీటిపారుదల సౌకర్యాలను కలిగిస్తున్నాయి. దేశంలోని ఏడు అతిపెద్ద, కేంద్రీయ నిర్వహణ పారుదల పద్ధతులైన మ్యువా, బుర, హొలా, పెర్కేరా, వెస్టు కానో, బునియల, అహెరో మొత్తం 18,200 హెక్టార్ల విస్తీర్ణంలో (పథకానికి సగటున 2,600 హెక్టార్లు) నీటిని అందిస్తున్నాయి. ఈ పథకాలు నేషనలు ఇరిగేషను బోర్డు చేత నిర్వహించబడుతున్నాయి. ఇవి కెన్యాలోని సాగునీటి భూభాగంలో 18% వాటాను కలిగి ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రైవేటు వాణిజ్య పంటలు 45,000 హెక్టార్ల భూమిని 40% సాగునీటి భూమిని కలిగి ఉన్నాయి. వారు అధిక సాంకేతికతను ఉపయోగించుకొని ఎగుమతి మార్కెట్టు, ముఖ్యంగా పువ్వులు, కూరగాయలు కోసం అధిక-విలువ పంటలను ఉత్పత్తి చేస్తారు.[98]

కెన్యా ప్రపంచంలోని కట్ పువ్వుల యొక్క 3 వ అతిపెద్ద ఎగుమతిదారు.[99] కెన్యా 127 పూల ఉత్పత్తి రైతులలో సగంమంది నైరోబీకి నైరుతీ ప్రాంతంలో 90 కిలోమీటర్ల దూరంలో నైవాషా సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి.[99] వారి ఎగుమతిని వేగవంతం చేయడానికి, నైరోబీ విమానాశ్రయం పూల, కూరగాయల రవాణాకు అంకితమైన టెర్మినలును కలిగి ఉంది.[99]

పరిశ్రమలు

The Kenya Commercial Bank headquarters at KENCOM House (right) in Nairobi.

ఆఫ్రికా గ్రేటు లేక్సు ప్రాంతంలో కెన్యా అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ ఉత్పత్తి ఇప్పటికీ జి.డి.పీలో 14% మాత్రమే ఉంది. పరిశ్రమలు నైరోబీ, మొంబాసా, కిసుము మూడు అతిపెద్ద పట్టణాలలో కేంద్రీకృతమై ఉంది. పారిశ్రామిక రంగంలోధాన్యం మిల్లింగు, బీరు ఉత్పత్తి, బెల్లం తయారీ, వినియోగ వస్తువుల కల్పన, ఉదా. కిట్లు, వాహనాలు, ఆహార-ప్రాసెసింగు పరిశ్రమలు ఆధిపత్యం వహిస్తున్నాయి.

దేశంలో సిమెంటు ఉత్పత్తి పరిశ్రమ ఉంది.[100] కెన్యాలో ఒక చమురు శుద్ధి కర్మాగారం ఉంది. అది క్రూడు పెట్రోలియం దిగుమతి చేసుకుని పెట్రోలియం ఉత్పత్తులను (ప్రధానంగా దేశీయ మార్కెట్టు కోసం) తయారు చేసుకుంటుంది. జౌ కాలీ అని పిలవబడే కుటీరపరిశ్రమలలో (అనధికారిక పారిశ్రామిక రంగం) గృహ వస్తువులు, ఆటో భాగాలు, వ్యవసాయ ఉపకరణాలు తయారుచేయబడుతుంటాయి.[101][102]

అమెరికా ప్రభుత్వం ఆఫ్రికా గ్రోతు అండు ఆపర్చ్యునిటీ యాక్టు (ఎ.జి.ఒ.ఎ) లబ్ధిదారులలో కెన్యా చేరిక ఇటీవలి సంవత్సరాల్లో ఉత్పాదకతను పెంచింది. 2000 లో ఎ.జి.ఒ.ఎ. అమలులోకి వచ్చిన తరువాత కెన్యా సంయుక్త విక్రయాల అమ్మకాలు $ 44 మిలియన్ల అమెరికా డాలర్ల నుండి 2006 నాటికి $ 270 మిలియన్ల అమెరికా డాలర్లకు (2006) కు అధికరించింది.[103] తయారీని బలోపేతం చేసేందుకు ఇతర కార్యక్రమాలు కొత్త ప్రభుత్వ అనుకూలమైన పన్నులు విధించడం ఒకటి. ఇందులో మూలధన పరికరాలు, ఇతర ముడి పదార్థాలపై పన్నులు తొలగించడం వంటి సౌకర్యాలు ఉన్నాయి.[104]

రవాణా

రహదారులు కెన్యా రైల్వే వ్యవస్థ, ఓడరేవులను, పెద్ద నగరాలను అనుసంధానం చేస్తున్నాయి. రహదారులు దేశాన్ని పొరుగు ఉగాండాతో అనుసంధానం చేస్తుతున్నాయి. కెన్యాలో పేవ్డు రంవేలు కలిగిన 15 విమానాశ్రయాలు ఉన్నాయి.

విద్యుత్తు

కెన్యా విద్యుత్తు సరఫరాలో అతిపెద్ద వాటా భూఉష్ణ శక్తికి ఉంది.[105] తర్వాత ఎగువ తనా నది ఆనకట్టలలో జలవిద్యుత్తు స్టేషన్లు, పశ్చిమప్రాంతంలో తుర్క్వేలు జార్జి ఆనకట్ట డ్యాం ఉన్నాయి. తీరంలో ఒక పెట్రోలియం ఆధారిత ప్లాంటు, ఒల్కారియా (నైరోబీ సమీపంలో) లో భూఉష్ణ సౌకర్యాలు, ఉగాండా నుండి దిగుమతి చేసుకున్న విద్యుత్తు సరఫరా మిగిలిన మొత్తాన్ని అందిస్తుంది. 2001 - 2003 మధ్యకాలంలో కెన్యా 1,142 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. కెన్యా ఎలక్ట్రిసిటీ జనరేటింగు కంపెనీ (కెన్జెను), 1997 లో కెన్యా పవరు కంపెనీ పేరుతో స్థాపించబడింది. విద్యుత్తు ఉత్పాదనను నిర్వహిస్తుంది. కెన్యా పవరు కంపెనీ విద్యుత్తు ప్రసారం, పంపిణీని నిర్వహిస్తుంది. దేశంలో వ్యవస్థ. కరువు నీటి ప్రవాహాన్ని తగ్గితే క్రమానుగతంగా విద్యుత్తు కొరతకు దారితీస్తుంది. విద్యుత్తు శక్తిలో అవసరానికి తగినంత స్వయంసమృద్ధి సాధించడానికి 2017 నాటికి కెన్యా అణు విద్యుత్తు ప్లాంటును నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.[106]

ఓల్కారియా జియోథర్మలు పవరు ప్లాంటులో కార్మికులు

టర్కీనాలో కెన్యా చమురు నిక్షేపాలు ఉన్నట్లు రుజువైంది. దానికి వాణిజ్య సాధ్యత కనుగొనబడింది. టన్నో ఆయిలు కెన్యా చమురు నిక్షేపాలను 10 బిలియను బ్యారల్సు ఉన్నట్లు అంచనా వేసింది.[107] ఎక్కువ నిల్వలు ఉన్నాయని నిర్ధారించడానికి అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతోంది. కెన్యా ప్రస్తుతం అన్ని ముడి పెట్రోలియం అవసరాలను దిగుమతి చేస్తుంది. తూర్పు ఆఫ్రికా అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కెన్యాకు ఎటువంటి వ్యూహాత్మక నిల్వలు లేవు. పరిశ్రమల నిబంధనల ప్రకారం చమురు విక్రయదారుల 21-రోజుల చమురు నిల్వలపై ఆధారపడి ఉంటుంది. జాతీయ దిగుమతి బిల్లులో 20% నుంచి 25% వరకు పెట్రోలియం ఖాతాల కోసం కేటాయించబడుతుంది.[108]

చైనీయుల వాణిజ్యం, పెట్టుబడులు

2013 లో కెన్యాటా పాలనా సమయంలో కెన్యాటా బీజింగు పర్యటన సందర్భంగా చైనా చైనా రాయబారి లియు గుయాంగ్యువను " కెన్యా క్యాపిటలు ఎఫ్.ఎం. వెబ్సైటులో " ప్రచురించిన వ్యాఖ్యల ఆధారంగా కెన్యాలో చైనా పెట్టుబడులు 474 మిలియన్ల డాలర్లకు చేరుకున్నాయని కెన్యాలోని విదేశీపెట్టుబడులలో ఇది అతిపెద్ద మొత్తమని పేర్కొన్నాడు. కెన్యా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సూచిస్తూ 2012 లో ద్వైపాక్షిక వాణిజ్యం 2.84 బిలియన్ల డాలర్లకు చేరుకుందని పేర్కొన్నాడు. కెన్యాటాతో 60 కెన్యా వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరు దక్షిణ కెన్యా మొంబాసా నౌకాశ్రయం నుండి పొరుగున ఉన్న ఉగాండాకు రైలు మార్గం నిర్మించడానికి మొట్టమొదటిగా $ 2.5 బిలియన్ల ప్రణాళికకు చైనా నుండి 1.8 బిలియన్ల నిధి సహాయం అందుతుందని విశ్వసించారు. "అని అధ్యక్షుడు కార్యాలయం నుండి వచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు.[109]

ఆస్ట్రేలియా బేస్ వనరుల అనుబంధ సంస్థ అయిన బేస్ టైటానియం మొదటి అతిపెద్ద ఖనిజాలని చైనాకు రవాణా చేసింది. కెన్యా తీర పట్టణమైన కిలిఫిలో దాదాపు 25,000 టన్నుల ఇల్మేనైటును ఎగుమతి చేశారు. మొట్టమొదటి రవాణాను కెన్యాకు Kshs 15-20 బిలియన్ల ఆదాయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.[110] భూ సేకరణ కొరకు అధిక పరిహారం చెల్లించిన కారణంగా ఇటీవలే నైరోబీ నుండి మొంబాసా వరకు చైనీయుల కాంట్రాక్టు రైల్వే ప్రాజెక్టు సస్పెండ్ చేయబడింది.[111]

భవిష్యద్దర్శనం 2030

The official logo of Vision 2030.

2007 లో కెన్యా ప్రభుత్వం విజను 2030 ను ఆవిష్కరించింది. 2030 నాటికి ఆసియా లీగలు టైగర్సు వలె అదే లీగులో దేశాన్ని ఉంచే ఒక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని భావిస్తుంది. విజను 2030 లో కీలక అభివృద్ధి సమస్యగా భావించబడుతున్న వాతావరణ సమస్యను పరిష్కరించడానికి 2013 లో ఇది ఒక జాతీయ వాతావరణ మార్పు చర్య ప్రణాళికను ప్రారంభించింది. క్లైమేటు అండు డెవలప్మెంటు నాలెడ్జు నెటు వర్కు మద్దతుతో అభివృద్ధి చేసిన 200-పేజీ యాక్షను ప్లాను 'తక్కువ కార్బను వాతావరణం స్థితిస్థాపక అభివృద్ధి మార్గానికి' కెన్యా ప్రభుత్వం దృష్టిని రూపొందించింది. 2013 మార్చిలో ప్రణాలికాభివృద్ధి శాఖ నేషనలు డెవలప్మెంటు అండు విజను 2030 ప్రకారం వాతావరణం రాబోయే నెలలలో మీడీయం టర్ము ప్లానులో కేంద్ర సమస్యగా ఉంటుందని నొక్కి చెప్పారు. ఇది యాక్షను ప్లాను కొరకు ప్రత్యక్ష, బలమైన డెలివరీ ఫ్రేమ్వర్కును సృష్టిస్తుంది.[112]

Economic summary
GDP$41.84 billion (2012) at Market Price. $76.07 billion (Purchasing Power Parity, 2012)

There exists an informal economy that is never counted as part of the official GDP figures.

Annual growth rate5.1% (2012)
Per capita incomePer Capita Income (PPP) = $1,800
Agricultural produce  tea, coffee, corn, wheat, sugarcane, fruit, vegetables, dairy products, beef, pork, poultry, eggs
Industrysmall-scale consumer goods (plastic, furniture, batteries, textiles, clothing, soap, cigarettes, flour), agricultural products, horticulture, oil refining; aluminium, steel, lead; cement, commercial ship repair, tourism
Trade in 2012
Exports$5.942 billiontea, coffee, horticultural products, petroleum products, cement, fish
Major marketsUganda 9.9%, Tanzania 9.6%, Netherlands 8.4%, UK, 8.1%, US 6.2%, Egypt 4.9%, Democratic Republic of the Congo 4.2% (2012) [83]
Imports$14.39 billionmachinery and transportation equipment, petroleum products, motor vehicles, iron and steel, resins and plastics
Major suppliersChina 15.3%, India 13.8%, UAE 10.5%, Saudi Arabia 7.3%, South Africa 5.5%, Japan 4.0% (2012) [83]

చమురు అన్వేషణ

Lake Turkana borders Turkana County

టర్ననా కౌంటీలో కెన్యా చమురు నిక్షేపాలు ఉన్నట్లు నిరూపించబడింది. 2012 మార్చి 26 న అధ్యక్షుడు మ్యువై కిబాకి ఒక ఆంగ్లో-ఐరిషు చమురు పరిశోధనా సంస్థ అయిన " టుల్లో ఆయిలు " చమురును కనుగొన్నప్పటికీ వాణిజ్యపరంగా ఉత్పత్తి నిర్ధారించడానికి మూడు సంవత్సరాలు పట్టవచ్చునని ప్రకటించింది.[113]

ఆర్థిక వ్యవస్థకు ఆఫ్రికా సహజ వనరులు వేగవంతంగా విస్తరిస్తున్న చైనా ఆర్థికరంగంలో ప్రవేశపెట్టడానికి రూపొందించిన ఒప్పందాల శ్రేణిలో భాగంగా 2006 లో చైనా అధ్యక్షుడు " హు జింటావు " కెన్యాతో చమురు అన్వేషణ ఒప్పందం మీద సంతకం చేశాడు. చైనా వేగంగా విస్తరిస్తున్న ఉంది.

ఈ ఒప్పందం చైనా ప్రభుత్వ నియంత్రిత ఆఫ్షోరు చమురు, గ్యాసు కంపెనీ అయిన " చైనా నేషనలు ఆఫ్షోరు ఆయిలు కార్పొరేషను " కొరకు, కెన్యాలో చమురు అన్వేషణకు అవకాశాన్ని కల్పించింది. ఇది సూడాను సరిహద్దులలో, వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలోని మొదటి అన్వేషక బావుల త్రవ్వకం సోమాలియా సరిహద్దులో ఉన్న ఈశాన్య ప్రొవింసులో ప్రారంభమైంది.[114]

బాలకార్మిక వ్యవస్థ

Maasai people. The Maasai live in both Kenya and Tanzania.

కెన్యాలో బాల కార్మికులు సాధారణం. చాలా మంది బాలకార్మికులు వ్యవసాయంలో చురుకుగా ఉన్నారు.[115] 2006 లో మలింది, మొంబాసా, కిలిఫి, డయని తీరప్రాంతాలలో 30% వరకు బాలికలు వ్యభిచారానికి లోబడి ఉన్నారని యూనిసెఫు అంచనా వేసింది. కెన్యాలో వేశ్యలలో చాలామంది 9-18 వయస్సు ఉన్నారు.[115] లింగవ్యవస్థ, బాలల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2009 లో 400 బాలల రక్షణ అధికారులను నియమించింది.[115] బాల కార్మికులకు పేదరికం, విద్య అందుబాటులో లేకపోవడం, బలహీన ప్రభుత్వ సంస్థలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.[115] కెన్యా పరిశ్రమలో బాలకార్మిక వ్యవస్థను 81 వ కార్మిక తనిఖీ, 129 వ వ్యవసాయంలో లేబరు తనిఖీ ధ్రువీకరించింది.[116]

Child labour in Kenya

కెన్యాలో సూక్ష్మఋణాలు

24 సంస్థలు పెద్ద ఎత్తున, నిర్దిష్ట వ్యవసాయ రుణాలు, విద్య రుణాలు, ఏ ఇతర ప్రయోజన కొరకు వ్యాపార రుణాలను అందిస్తాయి. అదనంగా ఉన్నాయి:

  • అత్యవసర రుణాలు, వడ్డీ రేట్లు అధికంగా ఉంటూ మరింత ఖరీదైనవిగా ఉంటాయి. కానీ త్వరగా అందుబాటులో ఉన్నాయి
  • చిన్న గ్రూపులు (4-5 సభ్యులు), పెద్ద గ్రూపులు (30 సభ్యుల వరకు)
  • మహిళల రుణాలు, మహిళల సమూహానికి కూడా అందుబాటులో ఉన్నాయి.

దాదాపు 40 మిలియన్ల మంది కెన్యన్లలో సుమారు 14 మిలియన్ల కెన్యన్లు అధికారిక దరఖాస్తు ద్వారా ఆర్థిక ౠణాలు పొందలేకపోతున్నారు. మరో 12 మిలియన్ల కెన్యన్లకు ఆర్థిక సేవాసంస్థల సేవలు అందుబాటులో ఉండవు. అంతేకాకుండా 1 మిలియను కెన్యన్లు ఆర్థిక సహాయాన్ని స్వీకరించటానికి అనధికారిక సమూహాల మీద ఆధారపడి ఉన్నారు.[117]

" సూక్ష్మఋణ ఉత్పత్తుల కోసం నిబంధనలు "

  • అర్హత ప్రమాణాలు: ప్రత్యేకమైన మహిళా రుణాలకు కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. చెల్లుబాటు అయ్యే కెన్యా గుర్తింపు కార్డు ఉండాలి. స్వంత వ్యాపారాన్ని కలిగి ఉండాలి, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం తెలియజేయాలి, సంస్థ సభ్యురాలిగా ఉండాలి.
  • క్రెడిట్ స్కోరింగ్: అధునాతన క్రెడిటు స్కోరింగు వ్యవస్థ లేదు. మెజారిటీ ఏ అధికారిక రుణ పంపిణీ వ్యవస్థ ప్రకటించింది లేదు. అయినప్పటికీ కొన్ని సంస్థలు కనీసం 3 నెలల కాలం వ్యాపారం చేసి ఉండాలి. చిన్న మొత్తంలో డబ్బును కలిగి ఉండాలి, సంస్థలు వ్యాపార ప్రణాళిక, ప్రతిపాదన అందించాలి, కనీసం ఒక హామీదారుని కలిగి ఉండాలి లేదా సమూహ సమావేశాలకు లేదా శిక్షణకు హాజరు కావాలి. సమూహం రుణాలు కోసం, సంస్థలలో దాదాపు సగం సమూహం సభ్యులు ఇతర సభ్యుల కొరకు హామీ ఉండడం అవసరం.
  • వడ్డీ రేటు: అవి ఎక్కువగా ఫ్లాటు ప్రాతిపదికన, కొన్ని తగ్గించబడేలా గణించబడతాయి. 90% పైగా సంస్థలకు నెలసరి వడ్డీ చెల్లింపులు అవసరమవుతాయి. 5,00,000 కెన్యన్లు షిల్లింగు వరకు సగటు వడ్డీ రేటు 30-40%. 5,00,000 కన్నా ఎక్కువ రుణాలకు కెన్యా షిల్లింగుల, వడ్డీ రేట్లు 71% వరకు పెరుగుతాయి.

గణాంకాలు

A Bantu Kikuyu woman in traditional attire
Population[118]
YearMillion
19506.1
200031.4
201648.5

2017 జనవరిలో కెన్యా సుమారు 48 మిలియన్ల జనాభాను కలిగి ఉంది.[83] కెన్యా యువ జనాభా అధికంగా కలిగి ఉంది. వేగంగా జనాభా పెరుగుదల కారణంగా 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు 73% ఉన్నారు.[119][120] గత శతాబ్దంలో 2.9 మిలియన్ల నుండి 40 మిలియన్ల మంది పౌరుల వరకు జనసంఖ్య అధికరించింది.[121]

కెన్యా రాజధాని నైరోబీ ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడలలో ఒకటైన కిబేరా నివాసంగా ఉంది. షంటీ టనులో (మురికివాడ) 1,70,000 కుటుంబాలు నివసిస్తున్నాయి.[122] ఇక్కడ 1 మిలియను స్థానికులు నివసిస్తున్నారు.[123] ఉత్తరప్రాంతంలో ఉన్న దదాబ్లోని యు.ఎన్.హెచ్.సి.ఆర్. బేసులో ప్రస్తుతం 5,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు.[124]

సంప్రదాయ సమూహాలు

A Nilotic Turkana woman wearing traditional neck beads

కెన్యా అత్యంత సంప్రదాయ, జాతి, భాషా వైవిధ్యత కలిగి ప్రజలు ఉన్నారు. దేశంలో 47 వేర్వేరు స్థానిక సంఘాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో బంటు ప్రజలు (67%), నీలోటీ ప్రజలు (30%) ఉన్నారు.[125] అరబ్బులు, భారతీయులు, ఐరోపావాసులు, అల్పసంఖ్యాక స్థానిక కుషిటి సమూహాలు కూడా ఉన్నాయి.[125][126]

కెన్యా నేషనలు బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్సు (కె.ఎన్.బి.ఎస్) ఆధారంగా కెన్యాలో మొత్తం జనాభా 3,86,10,097 ఉంది. వీరిలో సోమాలీ ప్రజలు (35,10,757), కసీయి (22,05,669), మిజికెండా (19,60,574), మేరు (16,58,108), లూవో (4,04,440), కలెంజిను (49,67,328), లుహియా (53,38,666), లువో (4,044,440) టర్కానా (988,592), మాసై (8,41,622), కంబా (38,93,157), . గతంలో ఎన్.ఎఫ్.డి.గా పిలువబడే కెన్యా నార్తు ఈస్టర్ను ప్రావిన్సులో స్థానిక జాతి సోమాలియన్లు అఫ్హికంగా నివసిస్తున్నారు. విదేశీమూలాలు కలిగిన ప్రజలలో సోమాలీ ప్రజలు (సోమాలియా నుండి), కెన్యా అరబ్బులు, ఆసియన్లు, యూరోపియన్లు ఉన్నారు.[127]

భాషలు

కెన్యాలోని పలు జాతి సమూహాలు సాధారణంగా వారి వారి మాతృభాషలలో మాట్లాడతారు. ఇంగ్లీషు, స్వాహిలి రెండు అధికారిక భాషలుగా ఉన్నాయి. ఇతర జాతులకు చెందిన ప్రజలతో సంభాషించడానికి ఈ భాషలు అనుసంధాన భాషలుగా వివిధస్థాయిలలో ఉపయోగించబడుతున్నాయి. కమ్యూనికేషన్ కోసం వివిధ స్థాయిలలో పటిమలో ఉపయోగించబడతాయి. వాణిజ్యం, విద్య, ప్రభుత్వకార్యాలయాలలో ఇంగ్లీషు విస్తారంగా వాడుకలో ఉంది.[128] పెరి-పట్టణ, గ్రామీణ నివాసితులు బహుభాషా సామర్ధ్యం తక్కువగా కలిగిన ప్రజలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తమ మాతృభాషలను మాత్రమే మాట్లాడుతున్నారు.[129]

కెన్యాలో ప్రధానంగా బ్రిటిషు ఇంగ్లీషు ఉపయోగించబడుతుంది. అదనంగా విలక్షణమైన స్థానిక మాండలికం, కెన్యా ఇంగ్లీషు భాషలను దేశంలోని కొన్ని సంఘాలకు చెందిన వ్యక్తులు ఉపయోగిస్తున్నారు. ఇది స్థానిక బాంటు భాషల (కిష్వాహి, కికుయు) నుండి ఉద్భవించిన ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంది.[130] వలసరాజ్యాల కాలం నుండి ఇది అభివృద్ధి చెందుతోంది. అమెరికా ఇంగ్లీషు లోని కొన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. కొన్ని పట్టణ ప్రాంతాలలో షెంగు మాండలికంలో కిస్వాహిలి ఆధారిత కేంటు భాష వాడుకలో ఉంది. ఇది ప్రాథమికంగా ష్వాహిలి, ఆంగ్ల మిశ్రమంతో కూడిన భాష. ఇది భాషా-మార్పిడికి ఉదాహరణ.[131]

కెన్యాలో మొత్తం 69 భాషలు మాట్లాడతారు. వీరిలో ఎక్కువ మందికి వాడుకలో ఉన్న రెండు విస్తృత భాషా కుటుంబాలు: నైగరు-కాంగో (బంటు శాఖ), నిలో సహారను (నిలోటికు శాఖ) భాషలను బంటు, నీలోటికు ప్రజలకు వాడుకలో ఉన్నాయి. కుషిటికు, అరబు జాతికి చెందిన అల్పసంఖ్యాక ప్రజలకు ఆఫ్రోయాసిటికు భాష వాడుకలో ఉంది. భారతీయ, ఐరోపా నివాసితులకు ఇండో-యూరోపియను కుటుంబానికి చెందిన భాషలు వాడుక భాషగా ఉన్నాయి. మాట్లాడే భాషలతో ప్రత్యేకమైన కుటుంబాలకు చెందిన మైనారిటీలు మాట్లాడతారు.[132]

మతం

మొంబాసాలో హోలీ ఘోస్టు రోమను క్యాథలికు కేథడ్రాలు
వింగిలిలో ఉన్న మసీదు

కెన్యన్లలో మతపరంగా క్రైస్థవులు (83%) ఆధిక్యతలో ఉండగా వీరిలో 47.7% మంది ప్రొటెస్టంట్లు, 23.5% రోమను కాథలికులు ఉన్నారు.[133] ప్రెస్బిటేరియను చర్చి ఆఫ్ ఈస్టు ఆఫ్రికాలో కెన్యా, పరిసర దేశాలకు చెందిన 3 మిలియన్ల అనుచరులు ఉన్నారు.[134] చిన్న సంప్రదాయవాద సంస్కరించబడిన చర్చీలు ఉన్నాయి. ఆఫ్రికా ఎవాంజెలికలు ప్రెస్బిటేరియను చర్చి ఉంది.[135] కెన్యా ఇండిపెండెంటు ప్రెస్బిటేరియను చర్చి, ఈస్టు ఆఫ్రికా రిఫార్ండు చర్చి ఉన్నాయి. ఆర్థోడాక్సు క్రిస్టియానిటీ 6,21,200 మంది అనుచరులు ఉన్నారని భావిస్తున్నారు.[136] ప్రపంచంలోని ఏ దేశంలోని కెన్యా అత్యధిక సంఖ్యలో క్వేకర్లు (146,300 మంది సభ్యులు) ఉన్నారు.[137] నైరోబీలో మాత్రమే జ్యూయిషు సినగోగ్యూ ప్రజలు .

జనాభాలో 15% కలిగి ఉన్న ఇస్లాం రెండవ అతిపెద్ద మతముంగా ఉంది. కెన్యా ముస్లింలలో 60% కోస్తా ప్రాంతంలో (దేశంలోని 50% ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు) నివసిస్తున్నారు. తూర్పు ప్రాంతం ఎగువ భాగంలో 10% ముస్లిములు నివసిస్తున్నారు.[138] అనేక స్వీయ గుర్తింపులేని క్రైస్తవులు, ముస్లింలు (1.7%) కొన్ని సంప్రదాయ విశ్వాసాలతో స్థానిక ఆచారాలు కూడా ఆచరిస్తుంటారు. అయితే దేశవాళీ ఆచారాలను, జనాభాలో 1.7% ఆచరించే. నాస్థికులు జనాభాలో 2.4% ఉన్నారు.[133]

ఆఫ్రికాలోని అతి పెద్ద హిందూ జనాభాలో (సుమారుగా 60,287) ఉన్న దేశాలలో కెన్యాలో ఒకటి. వీరు అధికంగా భారతీయ సంతతికి చెందిన వారుగా ఉన్నారు. బహాయి మతస్థులు (4,30,000) జనాభాలో 1% ఉన్నారు. దేశంలో ఒక చిన్న బౌద్ధ సమాజం కూడా ఉంది.

ఆరోగ్యం

Outpatient Department of AIC Kapsowar Hospital[139] in Kapsowar.

కెన్యా ప్రైవేటు రంగం ఉప-సహారా ఆఫ్రికాలో అత్యంత అధునాతన, ప్రగతిశీలమైనది. దేశంలోని ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ప్రధాన ఆరోగ్య సంరక్షణ ప్రదాతలుగా దేశం పేద ప్రజలకు కూడా ఆరోగ్యసేవలు అందిస్తున్నాయి. సౌకర్యాలు, సిబ్బంది పరంగా లాభరహిత, ప్రభుత్వ ఆరోగ్య రంగాల కంటే ప్రైవేటు హెల్తు సెక్టారు బృహత్తరమైనదిగా ఉంటూ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఒక ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం కెన్యాలో పేదలలో దాదాపు సగం మంది (20%) వారి పిల్లలు అనారోగ్యంలో ఉన్నసమయంలో అనారోగ్యం ప్రైవేటు ఆరోగ్య సదుపాయాన్ని ఉపయోగిస్తారని వెల్లడించింది.[140]

ప్రైవేటు ఆరోగ్య సౌకర్యాలు అధికమైన లభ్యత, బలమైన బ్రాండ్లు, విలువ-అదనంగా రోగి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ అందించే చికిత్సకు అధికంగా ప్రాచుర్యం పొందాయి. ప్రజా ఆరోగ్య సౌకర్యాలలో అందించిన కొద్దిపాటి సామూహిక సంరక్షణకు ఇవి భిన్నంగా ఉంటాయి. ప్రైవేటు ఆరోగ్య సౌకర్యాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. అన్ని ఆర్థిక సమూహాలకు సేవలు అందిస్తాయి. అగా ఖాను ఆసుపత్రి, మొంబాసా హాస్పిటలు వంటి ఆసుపత్రులు అభివృద్ధి చెందిన ప్రపంచంలో అనేక మంది ఇష్టపడే ఆసుపత్రులతో సమానంగా సేవలు అందిస్తుంటాయి. అయితే ధనవంతులకు, బీమా చేయించుకున్నవారికి ఖరీదైన చికిత్స అందుబాటులో ఉంటాయి. అనేక సరసమైన, తక్కువ ధర కలిగిన ప్రైవేటు వైద్య సంస్థలు, క్లినిక్లు ఉన్నాయి. ఇవి సాధారణ, మధ్యతరగతి నివాసితులకు సులభంగా అందుబాటులో ఉంటాయి. అన్ని నమోదిత వైద్య సదుపాయాలు కౌంటీ ప్రభుత్వ, జాతీయ నియంత్రణ సంస్థల ఆరోగ్య అధికారుల ఉమ్మడి బహుళ-కేడరు బృందం సాధారణ పర్యవేక్షణ, సహాయక సందర్శనలకు లోబడి పనిచేస్తుంటాయి. అదనపు మద్దతు, నాణ్యత హామీ, అభివృద్ధి ప్రక్రియలు వంటి ప్రభుత్వం-దాత ఉమ్మడి నిధులతో టుంజా ఫ్యామిలీ నెట్వర్కు వంటి ఒక సామాజిక ఫ్రాంచైజు కింద నిర్వహించబడుతుంది.

కౌంటీ ప్రభుత్వాలు, ఇతర కృత్రిమ చట్టవ్యవస్థల ద్వారా " లేమన్ త్రో లిమిటెడు లయబిలిటీ కంపెనీ " వైద్యసేవలను నియంత్రిస్తుంది. లేమన్ల ఎక్కువగా వైద్య నిపుణులచే వైద్య వ్యవహారాలను నిర్వహిస్తున్న ఇతర దేశాల వలె కాకుండా కృత్రిమ చట్టబద్ధమైన స్థానిక వైద్యవ్యవస్థ దేశమంతటా విస్తృతంగా వ్యాపించి ఉంది.[141]

ఆరోగ్య రంగం, ఆరోగ్య సౌకర్యాలను ప్రత్యేక చట్టాల ద్వారా రక్షించబడవు. ఆరోగ్య సిబ్బంధి వ్యాజ్యం, భావోద్వేగ, భౌతిక దుర్వినియోగానికి గురవుతారు.

ప్రైవేటు ఆరోగ్య సౌకర్యాలు వైవిధ్యమైనవి అత్యంత శక్తివంతమైనవిగా ఉంటాయి. సులువుగా వర్గీకరించతగిన ప్రజా ఆరోగ్య సౌకర్యాలలాగా వర్గీకరించడానికి క్లిష్టంగా ఉంటాయి. వీటిలో కమ్యూనిటీ-హెల్తు వర్కర్ల చేత నిర్వహించబడుతున్న డిస్పెన్సరీలను (మొదటి స్థాయి సౌకర్యాలు), నర్సుల సాయంతో నిర్వహించబడుతున్న (రెండవ స్థాయి సౌకర్యాలు), క్లినికలు ఆఫీసర్లు నిర్వహించబడుతున్న (మూడవ స్థాయి సౌకర్యాలు), ఉప-జిల్లా ఆసుపత్రులు (ఐదవ స్థాయి సౌకర్యాలు) వీటిని మెడికలు ఆఫీసర్లు కాని మెడికలు ప్రాక్టిషనర్లు నిర్వహిస్తారు, నేషనలు రిఫరలు ఆసుపత్రులు (6 వ స్థాయి సౌకర్యాలు) వీటిని అంగీకరించబడిన వైద్యనిపుణుల (కన్సల్టెంట్లు, ఉప-నిపుణులు) చేత నిర్వహించబడుతుంటాయి.

కెన్యా ప్రభుత్వ సేవలో క్లినికలు అధికారుల వైద్య నిపుణులు, వైద్య అధికారులు, వైద్యులను సూచించే పట్టిక

నర్సులు అన్ని రంగాలలోని ఫ్రంటు-లైను హెల్తు కేరు ప్రొవైడర్ల అతిపెద్ద సమూహంలో క్లినికలు అధికారులు, వైద్య అధికారులు, వైద్య నిపుణులు ఉన్నారు. కెన్యా నేషనలు బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్సు ఆధారంగా 2011 లో దేశంలో నమోదు చేయబడిన 65,000 అర్హత కలిగిన నర్సులు ఉన్నారు; 43 మిలియన్ల మంది పౌరులకు 8,600 క్లినికలు అధికారుల, 7,000 మంది వైద్యులు (అధికారిక రిజిస్టర్ల నుండి వచ్చిన ఈ సంఖ్యలు సిబ్బంధిలో చనిపోయిన లేదా వదిలిపెట్టిన వారు కూడా ఉండవచ్చు. ఈ కార్మికుల అసలు సంఖ్య తక్కువగా ఉండవచ్చు).[142]

గ్రామీణ, పట్టణ నివాసుల ద్వారా ఎంపిక చేయబడిన అభ్యాసకులు సంప్రదాయ వైద్యం (మూలికా శాస్త్రవేత్తలు, మంత్రగత్తె వైద్యులు, విశ్వాసం నొప్పి నివారణలు) తక్షణమే అందుబాటులో ఉంటారు. వీరిని గ్రామీణప్రజలు, పట్టణప్రజలు కూడా వీరిని మొదటి, చివరి చికిత్సల కొరకు విశ్వసిస్తూ సంప్రదిస్తుంటారు.

ఆరోగ్యం రంగంలో ప్రధాన విజయాలు సాధించినప్పటికీ, కెన్యా ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. 2009 లో ఆయుఃపరిమితి సుమారు 55 సంవత్సరాలకు తగ్గాయి - 1990 సంవత్సరానికి కంటే ఐదు సంవత్సరాల తక్కువగా ఉంది.[143] శిశు మరణ రేటు 2012 లో 1,000 మందికి సుమారు 44 మంది మరణించారు.[144] 2011 లో ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా ప్రకారం 42% జననాలు మాత్రమే నైపుణ్యం కలిగిన ఆరోగ్య నిపుణులు హాజరయ్యారు.[145]

పేదరికం వ్యాధులు నేరుగా దేశ ఆర్థిక పనితీరు, సంపద పంపిణీతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి: కెన్యన్ల సగం మంది పేదరిక స్థాయి కంటే తక్కువగా నివసిస్తున్నారు. మలేరియా, ఎయిడ్స్, న్యుమోనియా, డయేరియా, పోషకాహార లోపం, మధుమేహ వ్యాధులు పెద్ద భారంగా ఉన్నాయి. ప్రధానంగా పిల్లల మరణానికి కారణమౌతూ ఉంటాయి; బలహీనమైన విధానాలు, అవినీతి, ఆరోగ్య పరంగా లేనివారికి, బలహీనమైన నిర్వహణ, ప్రజా ఆరోగ్య రంగంలో పేలవమైన నాయకత్వం ఎక్కువగా విమర్శించబడుతూ ఉంటాయి. 2009 అంచనాల ప్రకారం, ఎయిడ్సు ప్రాబల్యం అనేది వయోజన జనాభాలో 6.3%.[146] 2011 UNAIDS రిపోర్టు కెన్యాలో హెచ్ఐవి అంటువ్యాధి మెరుగుపడుతుందని సూచించింది. ఎందుకంటే హెచ్.ఐ.వి. వ్యాప్తి యువత (వయస్సు 15-24), గర్భిణీ స్త్రీలలో క్షీణిస్తుంది.[147] 2006 లో కెన్యా 15 మిలియన్ల మలేరియా కేసులను అంచనా వేసింది.[148]

మహిళలు

Kenyan women in Nairobi

కెన్యాలో మొత్తం సంతానోత్పత్తి రేటు 2012 లో మహిళకు 4.49 మంది పిల్లలుగా అంచనా వేయబడింది.[149] కెన్యా ప్రభుత్వం 2008-09 సర్వే ఆధారంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 4.6%. వివాహిత మహిళల్లో గర్భధారణ వినియోగ రేటు 46%గా ఉంది. [150] ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉంటాయి. పాక్షికంగా మహిళలలో సత్నా ఆచారం కారణంగా, [88] ఇది సుమారు 27% నికి చేరుకుంది.[151]అయినప్పటికీ ఈ అభ్యాసం క్షీణిస్తుంది. దేశం మరింత ఆధునికీకరించబడి 2011 లో దేశంలో కూడా ఆచరణను నిషేధించింది.[152] వలసవాదానికి ముందు మహిళలకు ఆర్థికపరంగా అధికారం లభించింది. వలసలలో భూమి పరాయీకరణ కారణంగా మహిళలకు భూమిని అందుబాటు అరుదై నియంత్రణ కోల్పోయింది. [153] వారు ఆర్థికంగా పురుషులపై మరింత ఆర్థికంగా ఆధారపడతారు.[153] పురుషుల ఆధిపత్యంలో స్త్రీలు జీవించే సంస్కృతి వలసవాద క్రమంలో ఉద్భవించింది. [153] పెరుగుతున్న విద్య కారణంగా వివాహం వయస్సు అధికరిస్తుంది.[154] మానభంగం అపవిత్రత, battering ఎల్లప్పుడూ తీవ్రమైన నేరాలుగా చూడలేదు.[155] లైంగిక వేధింపుల నివేదికలు ఎప్పుడూ తీవ్రంగా భావించబడలేదు.[155]

విద్య

School children in a classroom.
An MSc student at Kenyatta University in Nairobi.

పిల్లలు ఐదు సంవత్సరాల వయస్సు వరకు నర్సరీ స్కూలు, కిండరు గార్టెను విద్యకు ప్రైవేటు రంగం విద్యాసంస్థలకు హాజరవుతారు. ఇది ఒకటి నుండి మూడు సంవత్సరాలు (కె.జి1, కె.జి2, కె.జి3) వరకు కొనసాగుతుంది. ఇటీవల వరకు ప్రభుత్వ విధానాలలో ఇది చేర్చబడలేదు. ఇది ప్రైవేటు నిధులతో పనిచేస్తుంది.[156]

ప్రాథమిక అధికారిక విద్య ఆరు సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. ఎనిమిది సంవత్సరాలు ప్రాథమిక పాఠశాలలో, నాలుగు సంవత్సరాలు ఉన్నత పాఠశాల విద్య ఉంటుంది. ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలలో ఉచితంగా ఉంటుంది. హాజరైనవారు వృత్తిపరమైన యువత - గ్రామ పాలిటెక్నికులో చేరవచ్చు లేదా ఒక శిక్షణా కార్యక్రమంలో తమ స్వంత ఏర్పాట్లు చేసుకోవచ్చు. రెండు సంవత్సరాలపాటు దుస్తులు చేయడం, వడ్రంగి, మోటారు వాహన మరమ్మత్తు, ఇటుకలు తయారీ, రాతి పనులు వంటి వ్యాపారాన్ని నేర్చుకోవచ్చు.[157]

ఉన్నత పాఠశాల పూర్తి చేసినవారు పాలిటెక్నికు లేదా ఇతర సాంకేతిక కళాశాలలో చేరవచ్చు. మూడేళ్లపాటు అధ్యయనం చేయవచ్చు లేకుంటే విశ్వవిద్యాలయానికి నేరుగా హాజరై నాలుగేళ్ల పాటు అధ్యయనం చేయవచ్చు. పాలిటెక్నికులు కళాశాలల నుండి పట్టభద్రులు తరువాత శ్రామికశక్తిలో చేరి తరువాత ఒక ప్రత్యేకమైన డిప్లొమా అర్హతను పొందవచ్చు. ఒకటి లేదా రెండు సంవత్సరాల శిక్షణ తర్వాత విశ్వవిద్యాలయంలో చేరవచ్చు- సాధారణంగా వారి రెండవ, మూడవ, మూడవ సంవత్సరంలో. ఉన్నత డిప్లొమా బ్యాచులరు డిగ్రీకి బదులుగా కొన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టు-గ్రాడ్యుయేటు అధ్యయనాలకు ప్రత్యక్ష లేదా వేగవంతమైన ప్రవేశం సాధ్యపడుతుంది.

పాఠశాలలో ఒక మాసాయి అమ్మాయి

కెన్యాలో ఉన్న పబ్లికు యూనివర్సిటీలు అత్యున్నత వాణిజ్య సంస్థలయ్యాయి. అర్హత ఉన్న ఉన్నత పాఠశాల గ్రాడ్యుయేట్లలో కొద్దిమంది మాత్రమే ఎంపిక చేయబడిన కార్యక్రమాలలో పరిమిత ప్రభుత్వ-స్పాన్సర్షిప్పులో చేరతారు. చాలామంది సాంఘిక శాస్త్రాలలో చేరతారు. ఇవి చౌకగా ఉంటాయి. లేదా స్వీయ-ప్రాయోజిత విద్యార్థులు వారి అధ్యయనాల మొత్తం వ్యయాన్ని చెల్లిస్తారు. అర్హతగల విద్యార్థులలో చాలామందికి పబ్లికు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాలిటెక్నిక్కులలో మధ్య స్థాయి డిప్లొమా కార్యక్రమాలకు అర్హత పొందడం లేదు.

కెన్యా వయోజన జనాభాలో 38.5% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు.[158] చాలా విస్తృత ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి; ఉదాహరణకు నార్తు ఈస్ట్రన్ ప్రావింసుతో పోలిస్తే (అతి తక్కువ 8.0%) నైరోబీ అక్షరాస్యత (87.1%) అధికం. ప్రీస్కూలు ఇది మూడు నుండి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది విద్యావ్యవస్థలో అంతర్భాగమైన భాగంగా ఉంటూ స్టాండర్డు 1 (ఫస్టు గ్రేడు) ప్రవేశానికి కీలకమైన అవసరం. ప్రాథమిక విద్య చివరిలో విద్యార్థులు ప్రాథమిక విద్య కెన్యా సర్టిఫికేటు (KCPE) ను పొందవచ్చు. ఇది సెకండరీ స్కూలున్ వృత్తి శిక్షణకు వెళ్లే వారిని నిర్ణయిస్తుంది. ఈ పరీక్ష ఫలితాలు సెకండరీ పాఠశాలలో ప్రవేశార్హతకు అవసరమవుతుంది.[157]

ప్రాథమిక పాఠశాల 6-7 నుండి 13-14 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థులకు ఉద్దేశించబడింది. సెకండరీ స్థాయికి వెళ్లేవారికి, విశ్వవిద్యాలయాలకు, వృత్తిపరమైన శిక్షణకు- ఉపాధికి వెళ్లడానికి నిర్ణయించే కెన్యా సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను ముగింపులో జాతీయ పరీక్ష ఉంది. విద్యార్థులు ఎన్నుకోబడిన ఎనిమిది విషయాలలో పరీక్షలు జరుపుతారు. అయితే ఇంగ్లీషు, కిష్వాహిలు, గణిత శాస్త్రాలు తప్పనిసరి విషయాలుగా ఉంటాయి.

కెన్యా యూనివర్సిటీసు అండు కాలేజెసు సెంట్రలు ప్లేస్మెంటు సర్వీసు (గతంలో జాయింటు అడ్మిషన్సు బోర్డు) ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో చేరడానికి విద్యార్థులను ఎంచుకోవడానికి బాధ్యత వహిస్తుంది. పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలు కాకుండా అనేక ప్రైవేటు పాఠశాలలు, ఉన్నాయి. అదేవిధంగా అనేక విదేశీ విద్యాసంస్థలకు అనువుగా అనేక అంతర్జాతీయ పాఠశాలలు ఉన్నాయి.

దేశంలో ఆకట్టుకునే వాణిజ్య విధానంపట్ల ఆసక్తులు ఉన్నప్పటికీ కెన్యా విద్యాసంస్థలు, ఉన్నత విద్యావ్యవస్థలు స్థానిక కార్మిక విఫణి అవసరాలకు భిన్నమైనవిగా ఉన్నందున అధిక సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారని విమర్శించబడుతున్నాయి. విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లు ఆధునిక కార్యాలయంలో సరిపోయేలా అర్హత సాధించడానికి పోరాడుతున్నారు.[159]

సంస్కృతి

Kenyan boys and girls performing a traditional dance
Nation Media House which hosts the Nation Media Group

కెన్యా సంస్కృతి బహుళ సంప్రదాయాలను కలిగి ఉంటుంది. కెన్యాకు ప్రముఖ సంస్కృతిని గుర్తించలేదు. దేశం విభిన్న వర్గాల వివిధ సంస్కృతులను కలిగి ఉంటుంది.

తీరప్రాంత స్వాహిలి, పశ్చిమ ప్రాంతాలలో అనేక ఇతర బంటు కమ్యూనిటీలు, వాయవ్య ప్రాంతంలో నిలోటికు సమాజాలు ఉన్నాయి. మాసాయి సంస్కృతి పర్యాటకులకు బాగా తెలుసు. కెన్యా జనాభాలో చాలా తక్కువ భాగం ఉన్నప్పటికీ. వారు వారి విస్తారమైన ఎగువ శరీర అలంకారం ఆభరణాల కోసం ప్రసిద్ధి చెందారు.

అదనంగా కెన్యా విస్తృతమైన సంగీతం, టెలివిజను, థియేటరు సన్నివేశాలు ఉన్నాయి.

మాధ్యమం

కెన్యా పలు మాధ్యమాలు ఉన్నాయి. అవి దేశీయంగానూ, అంతర్జాతీయంగా ప్రసారాలు అందజేస్తున్నాయి. వారు వార్తలు, వాణిజ్యం, క్రీడలు, వినోదకార్యక్రమాలు అందిస్తున్నాయి.

ప్రబల కెన్యా వార్తాపత్రికలు:

  • ది డైలీ నేషన్; నేషను మీడియా గ్రూపు (ఎన్.ఎం.జి) భాగం (అతిపెద్ద మార్కెట్టు వాటా)
  • ది స్టాండర్డు
  • ది స్టారు
  • ది పీపులు
  • ఈస్టు ఆఫ్రికా వీక్లీ
  • తైఫా లియో
  • కెన్యాలో ఉన్న టెలివిజన్ స్టేషన్లు:

కెన్యాలోని టెలివిషను స్టేషన్లు:

  • కెన్యా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషను (కె.బి.సి)
  • సిటిజెన్ టీవీ
  • కెన్యా టెలివిజను నెట్వర్కు (కె.టి.ఎన్)
  • ఎన్.టి.వి. (నేషను మీడియా గ్రూపు భాగం (ఎన్.ఎం.జి) )
  • కిస్ టెలివిజను
  • కె 24 టెలివిజను
  • కాస్- టి.వి.

ఈ అన్ని భూగోళ ఛానెల్లు డి.వి.బి. టి2 డిజిటలు టి.వి. సిగ్నల ద్వారా ప్రసారం చేయబడతాయి.

సాహిత్యం

Kenyan author Ngũgĩ wa Thiong'o.

కెన్యాకు బాగా తెలిసిన రచయితలలో ఒకరు ఇగ్కుగు వా థియోన్గో. అతని నవల, వీప్ నాట్, చైల్డు, బ్రిటీషు ఆక్రమణ సమయంలో కెన్యాలో జీవితానికి ఒక ఉదాహరణగా ఉంటాయి. కథ కెన్యనుల జీవితాల మీద మాయు మౌ ప్రభావాలను వివరించింది. ఇతివృత్తాల కలయిక-విద్య, ప్రేమ-ఇది ఆఫ్రికా లోని ఉత్తమ నవలలలో ఒకటిగా చేయటానికి సహాయపడింది.

2003 లో ఎం.జి. వస్సంజీ నవల " ది-బిట్వీను వరల్డు ఆఫ్ విక్రం లాలు " గిలెరు ప్రైజును 2003 లో గెలుచుకుంది. కలోనియలు కెన్యా, కాలనియలు తరువాత కాలానికి చెందిన కెన్యాలో భారతదేశ వారసత్వం కలిగిన కెన్యాపౌరుడు అతని కుటుంబం మారుతున్న రాజకీయ వాతావరణాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ జీవితగమనం చేయడాన్ని వివరించే కెన్యా కాల్పనిక చరిత్ర ఇది.

2003 నుంచి సాహిత్య పత్రిక క్వని?. కెన్యా సమకాలీన సాహిత్యాన్ని ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా కెన్యా పెన్-ఆఫ్రికా దృక్పధాన్ని ప్రదర్శిస్తున్న పాలు కిప్చుంబా (కిప్వెండుయి, కబ్వాట్టు) వంటి అభివృద్ధి చెందుతున్న బహుముఖ రచయితలను పెంపొందించుకుంటోంది. (చైనా 21 వ సెంచరీలో: ఆఫ్రికాలో వ్యూహం శోధన (2017) లో చూడండి.[160]

సంగీతం

Popular Kenyan musician Jua Cali.

40 ప్రాంతీయ భాషల వివిధ రకాలైన జానపద సంగీతంతో కెన్యా ప్రముఖ సంగీత రూపాల వైవిధ్య వర్గీకరణను కలిగి ఉంది.[161]

ప్రసిద్ధ కెన్యా సంగీతంలో డ్రమ్స్ అత్యంత ప్రబలమైన వాయిద్యం. డ్రం బీట్సు చాలా క్లిష్టంగా ఉంటాయి. స్థానిక లయ, దిగుమతి చేసుకున్న లయలతో (ప్రత్యేకంగా కాంగోసు కాచాచా రిథం) కలిగి ఉంటాయి. పాపులరు కెన్యా సంగీతంలో సాధారణంగా అనేక ఇతర సంగీతప్రక్రియలు భాగంగా ఉంటాయి. ఇటీవల ఘనమైన గిటార్ సోలోలు ఉంటాయి. అనేక స్థానిక హిప్-హాప్ కళాకారులు కూడా ఉన్నారు. వీరిలో జువాలీ కాలీ అఫ్రో-పాపు బ్యాండ్లు, సుట్టీ సోలు, అకేటీ, బెంగా వంటి స్థానిక కళాప్రదర్శనలుచేసే సంగీతకారులు ఉన్నారు.

సాహిత్యం చాలా తరచుగా కిష్వాలీ లేదా ఆంగ్ల భాషలో ఉన్నాయి. కాంగోసు సంగీతకారుల నుండి తీసుకున్న లింగలా వంటి అంశం కూడా ఉంది. సాహిత్యాలు కూడా స్థానిక భాషలలో వ్రాయబడ్డాయి. అర్బను రేడియో సాధారణంగా ఇంగ్లీషు సంగీతాన్ని మాత్రమే కలిగి ఉంది. అయినప్పటికీ అనేక ప్రాంతీయ రేడియో స్టేషన్లు ఉన్నాయి.

జిలిజొపెండా బాణిలో 1960 లు, 70 లు, 80 లలో డౌడీ కబాకా, ఫధలి విలియం, సుకుమా బిను ఆన్గారో వంటి సంగీత కళాకారుల రికార్డులు తయారు చేయబడ్డాయి. స్థానిక ప్రజలకి ముఖ్యంగా కెన్యా బ్రాడ్కాస్టింగు కార్పొరేషను కిషోవాలు సేవ (పూర్వం కెన్యా లేదా వి.ఒ.కె వాయిసు అని పిలుస్తారు) అందుబాటులో ఉంది.

ఇసూకుటి ఒక నృత్య ప్రక్రియ. దీనిని లుహియా ప్రజలు ప్రదర్శిస్తారు. ఇసుకూటి అనే సాంప్రదాయిక డ్రం బీటు లుయా ఉప ఉప తెగలు నిర్వహిస్తుంది. ఒక చైల్డ్, పెళ్లి, అంత్యక్రియల వంటి అనేక సందర్భాలలో దీనిని ప్రదర్శిస్తారు. ఇతర సాంప్రదాయ నృత్యాలలో లువోలో ప్రజలలో ఒహాంగ్లా, మిజికెండా ప్రజలలో నజిలె, కికుయు ప్రజలలో ముగిథి, స్వాహిలి ప్రజలలో తారబు ఉన్నాయి.

అదనంగా కెన్యా పెరుగుతున్న క్రిస్టియను గోస్పెలు మ్యూజికు ఉంది. ప్రముఖ స్థానిక గోస్పెలు సంగీతకారులలో కెన్యా బాయ్సు కోయిరు ఉన్నాయి.

1960 ల చివరలో ముఖ్యంగా విక్టోరియా సరోవరం చుట్టూ ఉన్న ప్రాంతంలో బెంగా సంగీతం ప్రసిద్ధి చెందింది. పాప్ సంగీతాన్ని సూచించడానికి బెంగా అనే పదం అప్పుడప్పుడు వాడబడుతుంది. బాసు, గిటారు, పెర్క్యూషను సాధారణంగా సాధన చేయబడుతుంటాయి.

క్రీడలు

Jepkosgei Kipyego and Jepkemoi Cheruiyot at London 2012 Olympics 5,000 meters

కెన్యా అనేక క్రీడలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. వాటిలో క్రికెటు, రైలింగు, ఫుట్బాలు, రగ్బీ యూనియను, ఫీల్డు హాకీ, బాక్సింగు ఉన్నాయి. మద్యదూరం-దూరం, సుదూర అథ్లెటిక్సులో ఆధిపత్యదేశంగా పేరు గాంచింది. ఒలింపిక్సు, కామన్వెల్తు గేమ్సు ఛాంపియంసును వివిధ దూరపు కార్యక్రమాలలో (ముఖ్యంగా 800 మీ, 1,500 మీ, 3,000 మీ స్టీపులెచేసు), 5,000 మీ, 10,000 మీ, మారథాను కెన్యా క్రీడాకారులు పాల్గొంటారు. మొరాకో, ఇథియోపియా క్రీడాకారులు ఈ పోటీలలో ఆధిపత్యాన్ని తగ్గించినప్పటికీ, కెన్యా అథ్లెట్లు (ముఖ్యంగా కలంజిను) దూరపరుగు పోటీలలో ప్రపంచాధిపత్యం చేస్తున్నాయి. నాలుగు సార్లు మహిళల బోస్టను మారథాను విజేత, రెండుసార్లు ప్రపంచ ఛాంపియను అయిన కాథరిను దెరెడా, 800 మీ, ప్రపంచ రికార్డు హోల్డరు డేవిడు రొడీషియా, మాజీ మారథాను ప్రపంచ రికార్డు హోల్డరు పాలు టార్గాటు, జాను గుగి కెన్యా అత్యుత్తమ క్రీడాకారులుగా ఉన్నారు.

బీజింగ్ ఒలంపిక్సు 6 బంగారు, 4 వెండి, 4 కాంస్య పతకాలతో కెన్యా అనేక పతకాలను గెలుచుకుంది. ఇది 2008 లో ఒలింపిక్సులో ఆఫ్రికాలో అత్యంత విజయవంతమైన దేశంగా నిలిచింది. పమేలా జెలిమొ మహిళల 800 మీ విజయం సాధించి తరువాత ఐ.ఎ.ఎ.ఎఫ్, గోల్డెను లీగు జాక్పాటులో విజయం సాధించింది. శామ్యూలు వంజీరులను పురుషుల మారథానులో విజయం సాధించాడు. పదవీ విరమణ చేసిన ఒలింపికు, కామన్వెల్తు క్రీడల విజేత కిప్చోజీ కైనో 1970 లలో కెన్యా ప్రస్తుత దూరపు పరుగుపోటీలో పాల్గొనే క్రూడాకారులకు సహకరించాడు. కామన్వెల్తు చాంపియను హెన్రీ రోనో అద్భుతమైన స్ట్రింగు ప్రపంచ రికార్డు ప్రదర్శనల జరిగింది. ఇటీవల కెన్యా అథ్లెటిక్సు సర్కిల్సులో వివాదాస్పదంగా ఉంది. కెన్యా అథ్లెటిక్సు ఇతర దేశాలకు (ప్రధానంగా బహ్రయిన్, కతర్) ప్రాతినిధ్యం వహించటం వివాదాస్పదం అయింది.[162] కెన్యా క్రీడా మంత్రిత్వశాఖ ఈ వైఫల్యాలను ఆపడానికి ప్రయత్నించింది. కాని వారు దీనిని కొనసాగించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి బెర్నార్డు లగాతు తాజాగా ఎన్నికవేయబడ్డాడు.[162] ఈ లోపాలు చాలా వరకు ఆర్థిక కారణాల మూలంగా జరుగుతున్నాయి.[163] కెన్యా ప్రభుత్వానికి అథ్లెటిక్సు సంపాదనలకు విధించే పన్ను సంబంధించిన నిర్ణయాలు కూడా ఫిరాయింపుకు కారణం కావచ్చు.[164] తమ దేశపు బలమైన జాతీయ జట్టుకు అర్హత సాధించలేని కొందరు శ్రేష్టమైన కెన్యా రన్నర్లు ఇతర దేశాల తరపున పోటీ చేయడం ద్వారా తమ దేశంలో జాతీయ జట్టు తరఫున పోటీచేసే అవకాశం సులభంగా పొందవచ్చు.[165]

Kenyan Olympic and world record holder in the 800 meters, David Rudisha.

గత దశాబ్దంలో కెన్యా ఆఫ్రికాలోని మహిళల వాలీబాలు క్రీడలో ఆధిపత్య శక్తిగా ఉంది. ఈ క్లబ్బులు, జాతీయ జట్టు గత దశాబ్దంలో పలు ఖండాతర ఛాంపియన్షిప్లను గెలుచుకుంది.[166][167] మహిళల జట్టు ఏ ప్రముఖ విజయం లేకుండా ఒలింపిక్సు, ప్రపంచ ఛాంపియన్షిప్పు పోటీలలో పాల్గొంది. క్రికెటు అనేది మరొక ప్రముఖ క్రీడ, ఇది కూడా అత్యంత విజయవంతమైన జట్టు క్రీడగావర్గీకరించబడింది. 1996 నుండి క్రికెటు ప్రపంచ కప్పులో కెన్యా పోటీపడింది. వారు ప్రపంచంలోని అత్యుత్తమ జట్లను నిరాశపరుస్తూ 2003 టోర్నమెంటులో సెమీ ఫైనలుకు చేరుకున్నారు. ఇనాగ్యురలు వరల్డు క్రికెటు లీగు డివిజన్ 1 ను నైరోబీలో నిర్వహించడానికి కెన్యా అనుమతి సాధించింది. ప్రపంచ టి 20 లో పాల్గొన్నారు. వారు ఐ.సి.సి. క్రికెటు ప్రపంచ కప్పు 2011 లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుత కెప్టెన్ రకేపు పటేలు.[168]

లూకాసు ఒన్యాంగో ఒక ప్రొఫెషనలు రగ్బీ లీగు ఆటగాడిగా కెన్యాకు ప్రాతినిధ్యం వహించాడు. వీరు ఆంగ్ల క్లబ్బు " ఓల్ధం " కలిసి క్రీడలలో పాల్గొన్నారు. మాజీ సూపరు లీగు జట్టుతో ఆయన విల్నెసు వైకింగ్సు, రగ్బీ యూనియను తరఫున సలెషార్కుతో ఆడాడు.[169] రగ్బీ యూనియను ప్రజాదరణ (ముఖ్యంగా వార్షిక సఫారి సెవెన్సు టోర్నమెంటుతో) పెరుగుతోంది. 2006 సీజను కోసం ఐ.ఆర్.బి. సెవెన్సు వరల్డు సిరీస్లో కెన్యా సెవెన్సు జట్టు 9 వ స్థానంలో నిలిచింది. 2016 లో జట్టు సింగపూరు సెవెన్సు ఫైనల్సులో ఫిజిని ఓడించింది. ప్రపంచ సీరీసు ఛాంపియనుషిప్పును సాధించి (దక్షిణాఫ్రికా తరువాత) కెన్యా రెండవ ఆఫ్రికా దేశంగా నిలిచింది.[170][171][172] కెన్యా ఫుటు బాలులో ప్రాంతీయ వేదికగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఆపివేసిన కెన్యా ఫుట్బాల్ సమాఖ్యలో, [173] అంతర్గతంగా ఆధిపత్యాలు ఘర్షణలకు గురయ్యాయి. ఫలితంగా దీనిని " ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. సస్పెంసు చేసింది. ఇది 2007 మార్చిలో ఎత్తివేయబడింది.

మోటారు ర్యాలీ రంగంలో కెన్యా ప్రపంచ ప్రఖ్యాత సఫారి రాలీకి నిలయంగా ఉంది. ఇది సాధారణంగా ప్రపంచంలోని అత్యంత కఠినమైన ర్యాలీలలో ఒకటిగా గుర్తించబడింది.[174] ఇది ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2002 ఈవెంటు తరువాత పలు సంవత్సరాల కాలం మినహాయింపు తరువాత ప్రపంచ ర్యాలీ ఛాంపియన్షిప్పులో పాల్గొన్నది. కెన్యాకు చెందిన బిజోర్ను వాల్డెగార్డు, హన్నూ మికోల, టామీ మకికెను, శేఖర్ మెహతా, కార్లోసు సైన్సు, కోలిను మక్రే వంటి అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన ఉత్తమ ర్యాలీ డ్రైవర్లలో కొంతమంది ర్యాలీలో విజయం సాధించారు. ఈ ర్యాలీ ఇప్పటికీ ఆఫ్రికా ర్యాలీ ఛాంపియన్షిప్పులో భాగంగా వార్షికంగా నిర్వహించబడుతుంది. అయితే తదుపరి రెండు సంవత్సరాలలో ప్రపంచ ర్యాలీ ఛాంపియన్షిప్పులో చేరడానికి నిర్వాహకులు తిరిగి అనుమతించబడతారు.

నైరోబీ అనేక అతిపెద్ద ఖండాంతర క్రీడల కార్యక్రమాలు నిర్వహించింది. ఎఫ్.ఐ.బి.ఎ. ఆఫ్రికా చాంపియన్షిప్పు 1993 లో కెన్యా జాతీయ బాస్కెటు బాలు జట్టు అగ్ర నాలుగు స్థానాలలో నిలిచింది. ఈ రోజు వరకు ఇది దాని ఉత్తమ ప్రదర్శనగా గుర్తించబడుతుంది.[175]

ఆహారం

Ugali and sukuma wiki, staples of Kenyan cuisine

కెన్యన్లకు సాధారణంగా ఒకరోజుకు మూడుమార్లు భోజనం తీసుకుంటారు. ఉదయం ఆహారాన్ని కియాంషా కైన్వా అంటారు, మధ్యాహ్నం భోజనం చికులా చ మచ్చా అంటారు, సాయంత్రం భోజనం చికులా చ జీయోని ("చాజియో") అని అంటారు. మధ్యలో వారు 10 గంటలకు టీ సేవనాన్ని చాయ్ య సా నాను అంటారు. సాయంత్రం 4 గంటలకు టీ చై యా సా కుమి అంటారు. ఉదయపు ఆహారంలో సాధారణంగా బ్రెడు, చపాతీ, మహ్మరి, ఉడికించిన తియ్యటి బంగాళాదుంపలు లేదా ఇతర దుంపలతో టీ లేదా గంజి తీసుకుంటారు. అనేక గృహాలలో గిథేరి ఒక సాధారణ భోజనం సమయం వంటకంగా ఉంటుంది. కూరగాయలు, పుల్లని పాలు (ముర్సికు), మాంసం, చేపలు లేదా ఇతర వంటకాలతో ఉగాలి సాధారణంగా భోజనం సమయంలో లేదా సాయంత్రపు అల్పాహారంగా తీసుకుంటారు. ప్రాంతీయ వైవిధ్యాలు, ప్రాంతీయ వంటకాలు కూడా ఉన్నాయి.

పశ్చిమ కెన్యాలో: లువోలో చేప సాధారణ వంటకం; ర్యాలీ లోయ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న కలెజినులకు ముర్సిక-పుల్లని పాలు ఒక ప్రధాన పానీయం.

నైరోబీ వంటి నగరాలలోని ఫాస్టుఫుడు రెస్టారెంట్లలో స్టీర్సు, కె.ఎఫ్.సి.[176] సబ్వే వంటి ఆహారాలు అందించే ఫాస్టు ఫుడు రెస్టారెంట్లు ఉన్నాయి.[177] అనేక చేపలు, చిప్సు దుకాణాలు కూడా ఉన్నాయి.[178]

బయటి లింకులు

Kenya గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Government

మూలాలు