2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు
న్యూజీలాండ్ మసీదు కాల్పులు 2019 మార్చి 15న న్యూజీలాండ్ డేలైట్ సేవింగ్ కాలమానం ప్రకారం 13:40 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 6.10 నిమిషాలు) న్యూజీలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని అల్ నూర్ మసీదు, లిన్ వుడ్ ఇస్లామిక్ సెంటర్లలో జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం 40 మంది మరణించారని ఖచ్చితంగా తెలుస్తోంది.[1] అనేక కారు బాంబులు ఉన్నట్టు, వాటిని పట్టుకుని విజయవంతంగా డిఫ్యూజ్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.[4] 1997 రౌరిము ఊచకోత తర్వాత న్యూజీలాండ్ లో ఇంతటి భారీ కాల్పుల ఘటన మళ్ళీ ఇదే.[5][6][7] నలుగురు కలిసి ఈ దాడుల్లో పాల్గొన్నట్టు అంచనా వేస్తున్నారు. వారిలో 28-సంవత్సరాల ఆస్ట్రేలియన్ అయిన బ్రెంటాన్ టరాంట్ ఉన్నాడు. అతని తుపాకుల మీద, ఇంటర్నెట్ పోస్టుల్లోనూ నియో-నాజీ గుర్తులు, శ్వేత జాతి ఆధిక్య భావనకు చెందిన నినాదాలు రాసుకున్నాడు.[8][9] న్యూజీలాండ్ హెరాల్డ్ ప్రకారం దుండగుడు రాసుకున్న మేనిఫెస్టోలో వలసవాద వ్యతిరేక విధానానికి సంబంధించిన అంశాలున్నాయి.[10]
2019 న్యూజీలాండ్ మసీదు కాల్పులు | |
---|---|
ప్రదేశం | క్రైస్ట్ చర్చ్ నగరం, న్యూజీలాండ్ |
భౌగోళికాంశాలు | 43°31′58″S 172°36′42″E / 43.5329°S 172.6118°E |
తేదీ | 2019 మార్చి 15 13:40 (న్యూజీలాండ్ డేలైట్ సేవింగ్ కాలమానం) |
దాడి రకం | సామూహిక కాల్పులు |
మరణాలు | 40+[1] |
ప్రాణాపాయ గాయాలు | 50+[2] |
Suspected perpetrators | 4 [3][4] |
ఘటన
అల్ నూర్ మసీదు
రికార్టన్ ప్రాంతంలోని అల్ నూర్ మసీదు దాడులకు గురైన ప్రదేశాల్లో ఒకటి.[11]
చర్యలు
స్పందన
న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ఈ సంఘటనను ఖండిస్తూ ఇది న్యూజీలాండ్ చరిత్రలోని చీకటిరోజుల్లో ఒకటని పేర్కొన్నది.[10]