సావొ టోమె, ప్రిన్సిపె

ఆఫ్రికాలో ఒక దేశం

1°N 7°E / 1°N 7°E / 1; 7

Democratic Republic of
São Tomé and Príncipe

República Democrática de
São Tomé e Príncipe
  (Portuguese)
Flag of São Tomé and Príncipe
జండా
Coat of arms of São Tomé and Príncipe
Coat of arms
నినాదం: "Unidade, Disciplina, Trabalho" (Portuguese)
"Unity, Discipline, Labour"
గీతం: Independência total
Total Independence
Location of  సావొ టోమె, ప్రిన్సిపె  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
Location of  సావొ టోమె, ప్రిన్సిపె  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

Location of São Tomé and Príncipe
రాజధానిSão Tomé
0°20′N 6°44′E / 0.333°N 6.733°E / 0.333; 6.733
అధికార భాషలుPortuguese
గుర్తించిన ప్రాంతీయ భాషలు
  • Forro
  • Angolar
  • Principense
పిలుచువిధం
  • São Toméan (Sao Tomean)[1]
  • Santomean
ప్రభుత్వంUnitary semi-presidential republic[2]
• President
Evaristo Carvalho
• Prime Minister
Jorge Bom Jesus
శాసనవ్యవస్థNational Assembly
Independence
• from Portugal
12 July 1975
విస్తీర్ణం
• మొత్తం
1,001[3] km2 (386 sq mi) (171th)
• నీరు (%)
Negligible
జనాభా
• 2016 estimate
199,910[4] (178th)
• 2012 census
178,739
• జనసాంద్రత
199.7/km2 (517.2/sq mi) (69th)
GDP (PPP)2017 estimate
• Total
$685 million[5]
• Per capita
$3,220[5]
GDP (nominal)2017 estimate
• Total
$355 million[5]
• Per capita
$1,668[5]
జినీ (2010)33.9[6]
medium
హెచ్‌డిఐ (2017)Increase 0.589[7]
medium · 143rd
ద్రవ్యంDobra (STN)
కాల విభాగంUTC+0 (GMT)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+239
ISO 3166 codeST
Internet TLD.st

సావో టోమె, ప్రిన్సిపె అధికారికంగా ;[8] " డెమొక్రటికు రిపబ్లికు ఆఫ్ సావో టోమే అండ్ ప్రిన్సిపె ". ఇది గైనీయా గల్ఫులోని ఒక ద్వీప దేశం. పశ్చిమసరిహద్దులో సెంట్రల్ ఆఫ్రికా ఈక్వెటోరియల్ తీరం. సావో టోమె, ప్రిన్సిపె రెండు ప్రధాన దీవులు సావో టోమె, ప్రిన్సిపె వైశాల్యం సుమారు 140 కిలోమీటర్లు (87 మైళ్ళు) ఉంది. గబాన్ వాయవ్య తీరానికి 250 - 225 కిలోమీటర్లు (155 - 140 మైళ్ళు).

15 వ శతాబ్దంలో పోర్చుగీసు అన్వేషకుల ఆవిష్కరణ వరకు ఈ ద్వీపాలు జనావాసాలు లేకుండా ఉన్నాయి. 16 వ శతాబ్దం అంతటా పోర్చుగీసువారు క్రమంగా వలసవచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వారు అట్లాంటికు బానిస వాణిజ్యం కోసం ఒక కీలక వాణిజ్య కేంద్రంగా సమష్టిగా సేవలు అందించారు. భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న సారవంతమైన అగ్నిపర్వత భూభాగం సమీపంలో సావో టోమె, ప్రిన్సిపె దీవులను చెరకు సాగుకొరకు అనుకూలప్రాంతంగా చేశాయి. తరువాత కాఫీ, కోకో వంటి నగదు పంటలు వచ్చాయి. లాభదాయకమైన మొక్కల ఆర్థిక వ్యవస్థను దిగుమతి చేసుకున్న తరువాత తోటలలో పనిచేయడానికి ఆఫ్రికా బానిసలపై ఎక్కువగా ఆధారపడింది. 1975 - 20 వ శతాబ్దాల్లో సాంఘిక అశాంతి, ఆర్థిక అస్థిరత చక్రభ్రమణం 1975 లో శాంతియుతమైన స్వాతంత్ర్యం పొందడంతో ముగిసింది. సావో టోమే, ప్రిన్సిపె ఆఫ్రికా అత్యంత స్థిరమైన, ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది.

1,99,910 (2016 అంచనాలు) [4] జనసంఖ్యతో సావో టోమె, ప్రిన్సిపె సేచెల్లిస్ తర్వాత రెండవ అతి చిన్న ఆఫ్రికా సార్వభౌమ దేశంగా గుర్తించబడుతుంది. అలాగే పోర్చుగీసు మాట్లాడే అతి చిన్న దేశం. దాని ప్రజలు ఆఫ్రికా, మేటికో సంతతికి చెందినవారే. ఎక్కువగా రోమన్ కాథలిక్కు మతాన్ని ఆచరిస్తున్నారు. పోర్చుగీసు పాలన వారసత్వం దేశం సంస్కృతి, ఆచారం, సంగీతంలో కూడా కనిపిస్తుంది. దీనిని ఐరోపా, ఆఫ్రికాలు ప్రభావితం చేస్తున్నాయి.

చరిత్ర

డిస్కవరీ

Map of São Tomé by Johannes Vingboons (1665).

1470 లో పోర్చుగీసు అన్వేషకులు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి ముందు సావొ టోమె, ప్రిన్సిపె దీవులు నిర్జనప్రాంతాలుగా ఉన్నాయి. జొవో డీ శాంటారెం, పెరొ ఎస్కొబారు ఈ ద్వీపాలను కనుగొన్నారు.

సావో టోమె ద్వీపంలో 1471 డిసెంబరు 21 ప్రాంతంలో ప్రిన్సిపె ద్వీపంలో 1472 జనవరి 17 న పోర్చుగీసురాకతో జనావాసాలు ఏర్పడ్డాయని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇతర ఆధారాలు అదే సమయంలో వైవిధ్యమైన సంవత్సరాలను తెలుయజేద్తున్నాయి. ప్రిన్సిపె పూర్వం శాంటో అంటావొ (సెయింటు ఆంటోని) అని పిలువబడింది. ఈ ద్వీపం పంచదార పంటపై విధులు చెల్లించిన పోర్చుగలు ప్రిన్సు పేరుతో 1502 లో " ఇల్హా డో ప్రిన్సిపె " (ప్రిన్సిపె ద్వీపాలు).

సావో టోమె మొదటి విజయవంతమైన పరిష్కారాన్ని 1493 లో అల్వారో కామిన్హా స్థాపించాడు. ఆయనకు భూమిని పోర్చుగీసు కిరీటం నుండి మంజూరు చేయబడింది. ప్రిన్సిపె 1500 లో ఇదే విధానంలో స్థిరపడ్డారు. అయితే స్థిరపడినవారిని ఆకర్షించడం చాలా కష్టమైనదని నిరూపించబడింది. మొట్టమొదటి నివాసితులలో ఎక్కువమంది పోర్చుగల నుండి పంపబడిన అవాంఛిత యూదులు.[9] ఈ సమయంలో స్థిరపడిన ప్రాంతం వ్యవసాయం, (ముఖ్యంగా చెరకు) కొరకు అనువైన సారవంతమైన అగ్నిపర్వత మట్టిని కనుగొంది.

పోర్చుగీసు సావోటొమె, ప్రిన్సిపె

1515 నాటికి సావో టోమె, ప్రిన్సిపె ఎల్మినాలో కేంద్రీకృత తీరప్రాంత బానిస వాణిజ్యం కొరకు బానిస మజిలీగా మారింది.[10]

సావో టోమేలోని సావో సెబాస్టియా మ్యూజియం

చెరకు తోటలు పెంపకం కార్మికులకు ఉపాధి కల్పించే ప్రక్రియ. పోర్చుగీసు ప్రధాన భూభాగం నుంచి పెద్ద సంఖ్యలో ఆఫ్రికన్లను బానిసలుగా చేయడం ప్రారంభమైంది. 16 వ శతాబ్దం మధ్య నాటికి పోర్చుగీసు స్థిరనివాసులు ద్వీపాలను ఆఫ్రికా అత్యున్నత చెరకు ఎగుమతి కేంద్రంగా మార్చారు. సావో టోమె, ప్రిన్సిపె వరుసగా 1522 - 1573 లో పోర్చుగీసు సామ్రాజ్య ఆధీనంలో నిర్వహించబడ్డాయి.

అయినప్పటికీ పాశ్చాత్య అర్థగోళంలో చక్కెర ఉత్పత్తి చేసే కాలనీల నుండి పోటీలు ద్వీపాలను గాయపరిచాయి. పెద్దసంఖ్యలో వచ్చిచేరుతున్న బానిసల జనాభాను నియంత్రించడం కష్టమైంది. పోర్చుగలు అనేక వనరులకు పెట్టుబడి పెట్టడంలో విఫలం అయింది. తరువాత శతాబ్దంలో సంవత్సరాలలో చక్కెర సాగు తగ్గింది. 17 వ శతాబ్దం మధ్యలో సావో టోమ్ యొక్క ఆర్థికవ్యవస్థ మార్పుచెందింది. పశ్చిమ, ఖండాంతర ఆఫ్రికా మధ్య బానిస వాణిజ్యంపై నౌకలు నిమగ్నమయ్యాయి.

19 వ శతాబ్దం ప్రారంభంలో రెండు నూతన వాణిజ్య పంటలు (కాఫీ, కోకోలు) ప్రవేశపెట్టబడ్డాయి. సారవంతమైన అగ్నిపర్వత నేలలు నూతన వాణిజ్య పంటల పరిశ్రమకు బాగా అనుకూలంగా ఉండేవి. పోర్చుగీసు కంపెనీలు, భూస్వాములు దాదాపు వ్యవసాయ భూములన్నింటినీ ఆక్రమించారు. తోటలు ("రోకాసు"గా పిలువబడేవి). దాదాపు అన్ని మంచి వ్యవసాయ భూములను ఆక్రమించాయి. [ఆధారం చూపాలి] 1908 నాటికి సావో టొమే ప్రపంచంలోని అతిపెద్ద కోకో ఉత్పత్తిదారుగా మారింది. ఇది దేశంలోని అతి ముఖ్యమైన పంటగా మారింది.

రైకాసు వ్యవస్థ అధికారులకు అత్యున్నత నిర్వహణ అధికారాన్ని ఇచ్చింది. ఆఫ్రికా వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఆరోపణలకు దారితీసింది. 1876 ​​లో పోర్చుగలు అధికారికంగా బానిసత్వాన్ని రద్దు చేసినప్పటికీ ఒప్పంద కార్మికుల నియామకం కొనసాగింది. సైంటిఫిక్ అమెరికా పత్రిక 1897 మార్చి 13 లో సంచికలో సావో టోమె బానిసలను నిరంతరం ఉపయోగించడం మాటలు, చిత్రాలలో నమోదు చేసింది.

20 వ శతాబ్దం ప్రారంభంలో అంగోలా ఒప్పంద నిర్బంధ కార్మికులు అసంతృప్తికరమైన పని పరిస్థితులకు గురయ్యారనే ఆరోపణలపై అంతర్జాతీయంగా వివాదాస్పదమైన విషయంగా మారింది. 20 వ శతాబ్దంలో శ్రామిక అశాంతి, అసంతృప్తి (1953 లో) కొనసాగింది. 1953 లో చెలరేగిన అల్లర్ల అసంతృప్తితో ముగిసాయి. దీనిలో అనేక వందల మంది ఆఫ్రికా కార్మికులు వారి పోర్చుగీసు యజమానులు ఒక ఘర్షణలో చంపబడ్డారు. ఈ "బాటేపా ఊచకోత" ద్వీపాల కాలనీల చరిత్రలో ప్రధాన సంఘటనగా మిగిలిపోయింది. దాని వార్షికోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా గమనిస్తుంది.

స్వాతంత్రం (1975)

The cathedral of São Tomé

1950 ల చివరినాటికి ఆఫ్రికా ఖండంలో ఉద్భవిస్తున్న ఇతర దేశాలు తమ స్వతంత్రాన్ని కోరినప్పుడు, సావో టొమేలోని ఒక చిన్న సమూహం సావో టోమే, ప్రిన్సిపె స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఏర్పాటు చేసింది. ఇది చివరికి గాబన్ సమీపంలో స్థావరాన్ని స్థాపించింది. 1960 లలో ఉద్యమం తీవ్రరూపందాల్చింది. 1974 ఏప్రిల్ ఏప్రెలులో పోర్చుగల్లోని కయేటనో నియంతృత్వాన్ని పడగొట్టడంతో సంఘటనలు త్వరితంగా మారాయి.

కొత్త పోర్చుగీసు పాలన దాని విదేశీ కాలనీల రద్దుకు కట్టుబడి ఉంది. 1974 నవంబరులో వారి ప్రతినిధులు అల్జియర్సులోని ఎం.ఎల్.ఎస్.టి.పి.తో సమావేశమై సార్వభౌమత్వాన్ని బదిలీ చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. పరివర్తన ప్రభుత్వ కాలం తరువాత సావో టోమే, ప్రిన్సిపె 1975 జూలై 12 న స్వతంత్రాన్ని సాధించింది. మొదటి అధ్యక్షుడిగా ఎమ్ఎల్ఎస్టిపి కార్యదర్శిగా ఉన్న మాన్యువల్ పింటో డా కోస్టాగా ఎన్నికయ్యారు.

1990 లో సావో టోమె ప్రజాస్వామ్య సంస్కరణ, రాజ్యాంగ మార్పులకు లోబడిన మొట్టమొదటి ఆఫ్రికా దేశాలలో ఒకటైంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీల చట్టబద్ధత - 1991 లో ఎన్నికలకు దారితీసింది. ఎన్నికలు అహింసాయుతమైనవిగా, స్వేచ్ఛాయితమైనవిగా, పారదర్శకమైనవిగా భావించబడ్డాయి. 1986 నుంచి బహిష్కరణలో ఉన్న మాజీ ప్రధానమంత్రి మిక్యూల్ ట్రోవుడా స్వతంత్ర అభ్యర్థిగా తిరిగి వచ్చి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1996 లో సావో టోమె రెండవ బహుళ-పార్టీ అధ్యక్ష ఎన్నికలో ట్ర్రోవుడా తిరిగి ఎన్నికయ్యారు.

డెమోక్రటికు కన్వర్జెన్సు పార్టీ (పిడిసి) జాతీయ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకుంది. ఎం.ఎల్.ఎస్.టి.పి. ఒక ముఖ్యమైన, అల్పసంఖ్యాక మైనారిటీ పార్టీగా మారింది. 1992 చివరిలో మునిసిపలు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఇందులో ఏడు ప్రాంతీయ మండలాలలో అయిదుగురు విజయం సాధించడంతో ఎంఎల్ఎస్టిపి మెజారిటీ సీట్లు గెలుచుకుంది. 1994 అక్టోబరులో ప్రారంభ శాసన ఎన్నికలలో ఎం.ఎల్.ఎస్.టి.పి. అసెంబ్లీ సీట్ల సంఖ్యను గెలుచుకుంది. ఇది 1998 నవంబరు ఎన్నికలలో చాలా సీట్లను గెలుచుకుంది.

2001 జూలైలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇండిపెండెంటు డెమోక్రటికు యాక్షను పార్టీ, ఫ్రడికు డి మెనెజెసు మద్దతు ఇచ్చిన అభ్యర్థి మొదటి రౌండ్లో ఎన్నికై సెప్టెంబరు 3 న బాధ్యతలు స్వీకరించాడు. 2002 మార్చిలో పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. తరువాతి నాలుగు సంవత్సరాలలో స్వల్పకాలిక ప్రతిపక్ష నేతృత్వంలోని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

అవినీతి ఆరోపణలు, చమురు ఆదాయాలు చాలావరకు విభజించబడలేదు అన్న ఆరోపణలతో 2003 జూలైలో ఒక వారం సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. రాజీప్రయత్నాల తరువాత ఒక ఒప్పందం ఆధారంగా అధ్యక్షుడు డి మెనెజెస్ కార్యాలయానికి తిరిగి వచ్చారు. [ఆధారం చూపాలి] జాతీయ అసెంబ్లీ ఎన్నికలలో ఒక ప్రో-ప్రెసిడెన్షియల్ సంకీర్ణం తగినంత సీట్లు సాధించిన తరువాత కొత్తప్రభుత్వం ఏర్పడిన తరువాత 2006 మార్చిలో సహజీవనం కాలం ముగిసింది.[11]

2006 జూలై 30 న అధ్యక్ష ఎన్నికలలో ఫ్రాడికు డె మెనిజేసు కార్యాలయంలో రెండో ఐదు-సంవత్సరాల పదవీకాలాన్ని సులభంగా గెలిచాడు. ఎన్నికలలో ఇద్దరు అభ్యర్థులైన ప్యాట్రిసు ట్రోవుడా (మాజీ ప్రెసిడెంట్ మైగ్యూలు ట్రోవుడా కుమారుడు), స్వతంత్ర నీలో గుమరాసులను ఓడించాడు. స్థానిక ఎన్నికలు 1992 తరువాత మొదటగా 2006 ఆగస్టు 27 న జరిగింది. పాలక సంకీర్ణ సభ్యులు ఆధిపత్యం వహించారు. [ఆధారం చూపాలి] 2009 ఫిబ్రవరి 12 న అధ్యక్షుడు ఫ్రాండ్యూ డి మెనెజెస్ను పడగొట్టడానికి విఫల ప్రయత్నం జరిగింది. తిరుగుబాటుదారుల కుట్రదారులు ఖైదు చేయబడి తరువాత అధ్యక్షుడు డి మెనెజెసు నుండి క్షమాపణ పొందారు.[12]

భౌగోళికం

Ilhéu das Rolas
The Pico Cão Grande

అకాడెనికు గల్ఫు ఆఫ్ గినియాలో ఉపస్థితమైన సావో టోమే, ప్రిన్సిపె దీవులు వరుసగా గాబాన్ వాయవ్య తీరాన 300 - 250 కిలోమీటర్ల (190 - 160 మీ) దూరమ్లో ఆఫ్రికా రెండవ అతి చిన్న దేశంగా ఉంది. ప్రధాన ద్వీపాలు రెండూ కూడా కామెరూన్ అగ్నిపర్వత పర్వత శ్రేణిలో భాగంగా ఉన్నాయి. ఇది నైరుతి వైపున అన్నోబోను దీవులను, ఈశాన్యంలో గినియా గల్ఫు సముద్రతీరంలో బయోకో (ఈక్వటోరియల్ గినియాలోని రెండు భాగాలు) ఉన్నాయి.

సావో టోమె 50 కి.మీ (30 మై) పొడవు, 30 కి.మీ (20 మై) వెడల్పు ఉంటుంది. రెండు ద్వీపాలలో ఎక్కువ పర్వతాలు ఉన్నాయి. దీని శిఖరాలు (పికో డి సావో టోం) 2,024 మీ (6,640 అ) కి ఎత్తుకు చేరుకున్నాయి. ప్రిన్సిపె 30 కి.మీ (20 మై) పొడవు, 6 కి.మీ (4 మై) వెడల్పు ఉంటుంది. దీని శిఖరాలు (పికో డి ప్రిన్సిపికి ) 948 మీ (3,110 అ) - చేరుతుంది. రెండు ద్వీపాలలో పర్వతాలలో జనించి పర్వతాల నుండి దట్టమైన అరణ్యప్రాంతాలలో ప్రవహించి భూమి మీదకు దిగి వ్యవసాయక్షేత్రాలను దాటి సముద్రంలో సంగమిస్తాయి. సావో టొమె ద్వీపానికి దిగువన " ఇల్హ్యు డాసు రోలాస్ " ద్వీపబిందువుల నుండి పయనిస్తూ భూమధ్య రేఖాప్రాంతం ఉంటుంది.

పికో కావో గ్రాండే (గ్రేట్ డాగ్ శిఖరం) అనేది దక్షిణ సావో టోమె 0 ° 7'0 " ఉత్తర అక్షాంశం, 6 ° 34'00" తూర్పు రేఖాంశంలో మైలురాయిగా అగ్నిపర్వత ప్లగు శిఖరం ఉంటుంది. పరిసర భూభాగం కంటే ఇది 300 మీ (1,000 అడుగులు) ఎత్తులో ఉంది. సముద్ర మట్టానికి 663 మీ (2,175 అడుగులు) ఎత్తులో ఉంది.

వాతావరణం

సముద్ర మట్టం వద్ద ఉష్ణమండల వాతావరణం 27 ° సెం (80.6 ° ఫా) సగటు వార్షిక ఉష్ణోగ్రతలు, తేలికపాటి రోజువారీ వైవిధ్యంతో వేడి, తేమతో ఉంటుంది. ఉష్ణోగ్రత 32 ° సెం (89.6 ° ఫా) కంటే అరుదుగా పెరుగుతుంది. అంతర్గత అధిక ఎత్తులలో సగటు వార్షిక ఉష్ణోగ్రత 20 ° సెం (68 ° ఫా), రాత్రులు సాధారణంగా చల్లగా ఉంటాయి. వార్షిక వర్షపాతం నైరుతి వాలులలో 5,000 మి.మీ (196.9 అం) నుండి ఉత్తర లోతట్టు ప్రాంతాలలో 1,000 మి.మీ (39.4 అం) వరకు ఉంటుంది. వర్షాకాలం అక్టోబరు నుండి మే వరకు ఉంటుంది.

వన్యజీవితం

సావో టోమె, ప్రిన్సిపెలలో పెద్ద సంఖ్యలో స్థానిక క్షీరదాలు లేవు (సావో టోమే షూరు, అనేక గబ్బిల జాతులు స్థానికంగా ఉన్నప్పటికీ). ప్రపంచంలోని అతి పెద్ద ఐబిస్ (సావో టొమ్ ఐబిస్), ప్రపంచంలోని అతి పెద్ద సన్బర్డు (దిగ్గజం సన్బర్డ్), అరుదైన సావో టోమె అనేక బెగోనియా భారీ జాతులు ఉన్నాయి. సావో టోమ్, ప్రిన్సిపి ఒక ముఖ్యమైన సముద్ర తాబేలు గూడు ప్రదేశం, ఇందులో హాక్సుబిలు తాబేళ్లు (ఎరెట్మోచేలేసు ఇంబ్రికాటా) ఉన్నాయి.

ఆర్ధికం

Cocoa in São Tomé
Ossame fruit (pepper) in São Tomé and Príncipe

19 వ శతాబ్దం నుంచి సావో టోమే, ప్రిన్సిపె ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. స్వతంత్ర సమయములో పోర్చుగీసుకు చెందిన తోటల పెంపకం ప్రాంతంలో 90% ఆక్రమించింది. స్వాతంత్ర్యం తరువాత ఈ తోటల నియంత్రణ వివిధ ప్రభుత్వ-యాజమాన్య వ్యవసాయ సంస్థలకు పంపబడింది. సావో టోమె ప్రధాన పంట కోకో. ఇది 95% వ్యవసాయ ఎగుమతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇతర ఎగుమతి పంటలలో కోప్రా, పామ్ కెర్నలు, కాఫీ ఉన్నాయి.

స్థానిక వినియోగానికి అనుగుణంగా దేశీయ ఆహార పంట ఉత్పత్తి సరిపోదు. అందువలన దేశంలో ఎక్కువ భాగం ఆహారాన్ని దిగుమతి చేస్తుంది.[13] 1997 లో దేశం ఆహార అవసరాలలో సుమారు 90% దిగుమతి చేయబడుతున్నట్లు అంచనా వేయబడింది.[13] ఇటీవలి సంవత్సరాలలో ఆహార ఉత్పత్తిని విస్తరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి. అనేక ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి. ఎక్కువగా విదేశీ దాతల ద్వారా ఆర్థిక సహాయం చేయబడ్డాయి.

సావో టోమ్ నగరంలో ఒక మార్కెట్ ప్రదేశం
సావో టోమ్ టౌన్ సెంటరు
సావో టోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు

వ్యవసాయం కాకుండా ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు చేపలు పట్టడం. ఒక చిన్న పారిశ్రామిక రంగం స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడంలో, కొన్ని ప్రాథమిక వినియోగ వస్తువుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్నాయి. సుందరమైన ద్వీపాలు పర్యాటక సామర్ధ్యం కలిగివున్నాయి. ప్రభుత్వం దాని మూలాధార పర్యాటక పరిశ్రమల మౌలికసౌకర్యాలను మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ రంగం సుమారు 11% ఉపాధి కల్పిస్తూ ఉంది.

స్వాతంత్ర్యం తరువాత దేశంలో కేంద్రీకృతమై ఉన్న ఆర్థికవ్యవస్థ అనేక రాష్ట్రాల యాజమాన్యం, నియంత్రణలో ఉంది. అసలు రాజ్యాంగం మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు హామీ ఇస్తుంది. ప్రైవేటు యాజమాన్యం కలిగిన సహకార సంస్థలు, బహిరంగంగా యాజమాన్య ఆస్తి, ఉత్పాదక సాధనాలుగా ఉన్నాయి.

1980 లు - 1990 లలో సావో టోమె ఆర్థిక వ్యవస్థ ప్రధాన కష్టాలను ఎదుర్కొంది. ఆర్థిక వృద్ధి మందగించింది, కోకో ఎగుమతులు విలువ, వాల్యూమ్ రెండింటిలోనూ పడిపోయాయి. పెద్ద బ్యాలెన్సు-చెల్లింపుల లోటును సృష్టించాయి. ప్లాంటేషను భూమిని స్వాధీనం చేసుకుంది. ఫలితంగా కోకో ఉత్పత్తి పూర్తిగా పతనమైంది. అదే సమయంలో కోకో, అంతర్జాతీయ ధర పతనం అయింది.

దాని ఆర్థిక తిరోగమనకు ప్రతిస్పందనగా ప్రభుత్వం దీర్ఘకాల ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. 1987 లో ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి ( నిర్మాణ సర్దుబాటు కార్యక్రమాన్ని అమలు చేసింది. పరస్టాటల్సు, అలాగే వ్యవసాయ, వాణిజ్య, బ్యాంకింగు, పర్యాటక రంగాలలో నిర్వహణలో ఎక్కువ ప్రైవేటు యాజమాన్యం పాల్గొనడాన్ని ఆహ్వానించింది. 1990 ల ప్రారంభం నుండి ఆర్థిక సంస్కరణల దృష్టి విస్తృతంగా ప్రైవేటీకరణ (ముఖ్యంగా ప్రభుత్వ రంగ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు) చేయబడింది.

యు.ఎన్. డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్రపంచ బ్యాంకు, ఐరోపా సమాఖ్య, పోర్చుగలు, తైవాను, ఆఫ్రికా డెవెలప్మెంటు బ్యాంకులతో సావో టొమే ప్రభుత్వం సాంప్రదాయకంగా వివిధ దాతల నుండి విదేశీ సహాయం పొందింది. 2000 ఏప్రెలులో బాంకో సెంట్రల్ డి సావో టొమే ఇ ప్రిన్సిపె సహకారంతో ఐ.ఎం.ఎఫ్. 2001 లో ద్రవ్యోల్బణాన్ని 3%కి తగ్గించటానికి సావో టోమె పేదరికం తగ్గింపు, అభివృద్ధి సౌకర్యాన్ని ఆమోదించింది. ఇది 4% అభివృద్ధికి మద్ధతును ఇస్తూ ద్రవ్యలోటును తగ్గించడానికి సహకరించింది.

2000 చివరిలో సావో టోమె ఐ.ఎం.ఎఫ్. - ప్రపంచ బ్యాంకు భారీ రుణాల పేద దేశాల చొరవ కింద గణనీయమైన రుణ తగ్గింపుకు అర్హత సాధించింది. 2003 జూలైలో తిరుగుబాటు ప్రయత్నం, తదుపరి అత్యవసర వ్యయం కారణంగా ఈ తగ్గింపు ఐ.ఎం.ఎఫ్. ద్వారా తిరిగి అంచనా వేయబడుతోంది. సంధి తరువాత ఐ.ఎం.ఎఫ్. దేశం స్థూల ఆర్థిక స్థితిని విశ్లేషించడానికి సావో టోమెకు ఒక మిషన్ను పంపాలని నిర్ణయించుకుంది. ఈ అంచనా కొనసాగుతున్నది. నివేదిక ప్రకారం పెండింగులో ఉన్న చమురు చట్టాన్ని ప్రభుత్వం పేలవంగా నిర్వచించని ఇన్కమింగు చమురు ఆదాయాన్ని ఎలా నిర్వహిస్తుందన్నది లెజిస్లేషను నిర్ణయించాలి. ఆర్థిక పరిస్థితిని మార్చడానికి అయినా అంచనా వేయాలి.

సమాంతరంగా ప్రైవేటు పర్యాటక కార్యక్రమాలు ప్రోత్సహించటానికి కొన్ని ప్రయత్నాలు చేయబడ్డాయి. కానీ వాటి పరిధి పరిమితంగానే ఉంది. .[14]

సాన్ టోమ్ పిన్నిహైలో వాయిస్ ఆఫ్ అమెరికా అనే అమెరికా ఇంటర్నేషనల్ బ్రాడు కాస్టింగు బ్యూరో కార్యక్రమాలు సావో టోమె నుండి ప్రసారం చేయబడుతున్నాయి.[15] పింహెరియాలో ఈ స్టేషను ఉంది.[16]

పోర్చుగలు సావో టోమె అతిపెద్ద వ్యాపార భాగస్వాములలో ఒకటి, ముఖ్యంగా దిగుమతులకు మూలంగా ఉంది. ఆహారం, తయారు చేసిన వస్తువులు, యంత్రాలు, రవాణా పరికరాలు (ప్రధానంగా ఐరోపా సామాఖ్య) నుండి దిగుమతి చేయబడతాయి.

2011 మార్చి యురోమనీ కంట్రీ రిస్కు ర్యాంకింగులో సావో టోమె, ప్రిన్సిపె ప్రపంచదేశాలలో 174 వ సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తించబడింది.[17]

Petroleum exploration

Central Bank of São Tomé and Príncipe

2001 లో సావో టోమే, నైజీరియా, నైజర్ డెల్టా జియోలాజిక్ ప్రావిన్సులోని రెండు దేశాలకు సంబధంఉందని భావించబడిన జలాలలో పెట్రోలియం కోసం ఉమ్మడిగా అన్వేషణచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. సుదీర్ఘ చర్చల తరువాత 2003 ఏప్రిల్ ఏప్రెలులో అంతర్జాతీయ చమురు సంస్థల వేలం కొరకు ఉమ్మడి అభివృద్ధి జోను తెరవబడింది. జె.డి.జెడ్ తొమ్మిది బ్లాకులుగా విభజించబడింది. 2004 ఏప్రెలులో బ్లాకు ఒకటి, చెవ్రాన్ టెక్సాకో, ఎక్సాన్మొబిలు, నార్వే సంస్థ, ఈక్విటీ ఎనర్జీ, ప్రకటించబడ్డాయి, సావో టోమె $ 123 మిలియన్ల బిడులో 40%, నైజీరియాలో 60% వాటాను పొందింది. 2004 అక్టోబరులో ఇతర బ్లాకులని లావాదేవి అప్పటికీ పరిశీలనలో ఉన్నాయి. సావో టోమె తన పెట్రోలియం రంగం అభివృద్ధి కోసం బ్యాంకు నుండి $ 2 మిలియన్ల అమెరికా డాలర్ల కంటే ఎక్కువ సంపాదించింది.[18]

బ్యాంకింగు

" బాంకో సెంట్రల్ డీ సావో టోమె ఈ ప్రిస్సిపె " కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానం, బ్యాంకింగు పర్యవేక్షణకు బాధ్యత వహిస్తుంది. దేశంలో ఆరు బ్యాంకులు ఉన్నాయి. అతిపెద్ద, పురాతనమైనది బాంకో ఇంటర్నేషనషనలు డి సావో టొమే ఇ ప్రిన్సిపె ఇది పోర్చుగలు ప్రభుత్వ-యాజమాన్య కాయిక్సు గెరెలు డి డెపోసిటోస్ అనుబంధ సంస్థ. 2003 లో బ్యాంకింగు చట్టాన్ని మార్చి అనేక ఇతర బ్యాంకుల ప్రవేశానికి దారితీసే వరకు ఇది వాణిజ్య బ్యాంకింగు మీద గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది.

గణాంకాలు

São Tomé and Príncipe's population in thousands between 1961 and 2003
A scene of Santomean Tchioli, Auto de Floripes Festival

కేప్ వర్దె జాతీయ గణాంకాల సంస్థ (ఐ.నె.ఎ) సహాయంతో 2011 లో మొట్టమొదటి జనాభా గణన నిర్వహించబడింది.[19]

2010 నాటికి మొత్తం జనాభా 1,63,784 గా అంచనా వేయబడింది.[20] దాదాపు 1,57,000 మంది సావో టోమె ద్వీపంలో, ప్రిన్సిపె ద్వీపంలో 6,000 మంది నివసిస్తున్నారు.

1470 నుండి పోర్చుగీసు వారు ద్వీపాలకు తీసుకెళ్లబడిన వివిధ దేశాల ప్రజల నుండి వచ్చారు. 1970 వ దశకంలో రెండు ముఖ్యమైన ప్రజా ఉద్యమాలు జరిగాయి- 4,000 మంది పోర్చుగీసు నివాసితులలో చాలామందికి వెనుకకు వెళ్లగా అంగోలాలో ఉన్న చెందిన అనేక వందల సావో టోమె శరణార్థులు తిరిగి దేశంలో ప్రవేశించారు.

సప్రదాయ సమూహాలు

సావో టోమే, ప్రిన్సిపెలోని ప్రత్యేక జాతి సమూహాలు:

  • బెనిన్, గబాన్, కాంగో రిపబ్లిక్, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, అంగోలా (ఈ ప్రజలు కూడా పిలుస్తారు) నుండి పోర్చుగీసు వలసవాదులు, ఆఫ్రికా బానిసల వారసులైన మేస్టికోసు (మిశ్రమ-రక్తం), ఫిల్హో డా టెర్రా లేదా "చిల్డ్రన్ ఆఫ్ ది ల్యాండ్") ఆరంభకాల స్థావరానికి తీసుకురాబడ్డారు.
  • అంగోలార్లు:- 1540 నౌకలధ్వంసం నుండి బయటపడిన అంగోలా బానిసల ప్రముఖ వారసులు. వీరు ప్రస్తుతం జీవనాధార చేపలుపట్టి సంపాదిస్తారు.
  • ఫారోలు:- బానిసత్వం రద్దు చేసినప్పుడు విముక్త బానిసలు వారసులు.
  • సర్వీకైలు:- అంగోలా, మొజాంబిక్, కేప్ వెర్డే నుండి తీసుకు రాబడిన ఒప్పంద కార్మికులు. వీరు ఒప్పంద కార్మికులుగా తాత్కాలికంగా ద్వీపాల్లో నివసిస్తున్నారు.
  • టాంగాలు:- ద్వీపాలలో జన్మించిన సర్వీకార్టుల పిల్లలు.
  • ఐరోపియన్లు, ప్రాథమికంగా పోర్చుగీస్.
  • ఆసియన్లు, ఎక్కువగా చైనీస్, మాకావా ప్రజలు (మిశ్రమ పోర్చుగీసు, చైనీస్ సంతతికి చెందిన చైనా లోనిమకౌకు ప్రజలు) ఉన్నారు.

భాషలు

సావో టోమె, ప్రిన్సిపె అధికారిక, జాతీయ భాష పోర్చుగీసు. ఇది 98.4% మంది ప్రజలకు వాడుకభాషగా ఉంది. వారి స్థానిక భాషగా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది 15 వ శతాబ్దం ముగింపు తర్వాత ద్వీపాలలో వాడుకభాషగా మారింది. పోర్చుగీసు, పోర్చుగీసు క్రియోల్సు పునర్నిర్మించిన భాషావైవిధ్యాలు కూడా ఉన్నాయి: ఫారో, ఒక క్రియోల్ భాష (36.2%), కేప్ వెర్డియన్ క్రియోలు (8.5%), అంగోలారు (6.6%), ప్రిన్సిపె భాష (1%). ఫ్రెంచి (6.8%), ఇంగ్లీషు (4.9%) విదేశీ భాషలుగా పాఠశాలల్లో బోధించబడుతున్నాయి.

మతం

Religion in São Tomé and Príncipe [21]

  Catholic Church (71.9%)
  Other Christian (10.2%)
  Other or Non Religious (17.9%)

ఎక్కువమంది నివాసితులు రోమన్ కాథలికు చర్చి స్థానిక శాఖకు చెందినవారు. ఇది పోర్చుగలులోని చర్చితో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. సెవెంత్-డే అడ్వెంటిస్టులు, ఇతర ఎవాంజెలికలు ప్రొటెస్టంట్ల గణనీయమైన ప్రొటెస్టంటు అల్పసఖ్యాకులు కూడా ఉన్నారు. ఒక చిన్నదైనా అభివృద్ధి చెందుతున్న ముస్లిం జనాభా ఉంది.

Nossa Senhora do Rosário Church, in Santo António

విద్యా విధానం

సావో టోమె, ప్రిన్సిపెలో నాలుగు సంవత్సరాల నిర్బంధ విద్య అమలులో ఉంది.[22] 2001 నాటికి సావో టోమె, ప్రిన్సిపె ప్రాథమిక పాఠశాల నమోదు, హాజరు రేట్లు అందుబాటులో లేవు.[22]

విద్యా వ్యవస్థలో ఉన్న తరగతుల కొరత, తగినంత శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత, తక్కువగా చెల్లించబడుతున్న ఉపాధ్యాయులు వేతనాలు, సరిపోని పాఠ్యపుస్తకాల, సామగ్రి, అధిక పునరావృత రుసుము, బలహీనమైన విద్యా ప్రణాళిక, పేలవమైన నిర్వహణ, పాఠశాల నిర్వహణలో కమ్యూనిటీ ప్రమేయం లేకపోవడం వంటి ప్రధానసమస్యలు విద్యాభివృద్ధికి ఆటంకంగా మారింది.[22] పాఠశాల వ్యవస్థ కొరకు దేశీయ నిధుల మంజూరు తక్కువగా ఉంది. ప్రభుత్వం విదేశీనిధి సహాయానికి విద్యావ్యవస్థను వదిలివేసింది.[22]

తృతీయస్థాయి సంస్థలలో నేషనలు లైసియం (సావో టోమే, ప్రిన్సిపె), సావో టోమె, ప్రిన్సిపె విశ్వవిద్యాలయం ప్రాధాన్యత వహిస్తుంది.

సంస్కృతి

Lagoa Azul Lighthouse

São Toméan culture is a mixture of African and Portuguese influences.

సంగీతం

సావో టోమెను ప్రజలు " యుసుయా ", సోకొపె లయలకు ప్రసిద్ధి చెందాయి. ప్రిన్సిపె డెక్సా బీటుకు ఆవాసంగా ఉంది. పోర్చుగీసు బాల్రూము నృత్యాలు ఈ లయల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాయి.

చిలోలీ ఒక నాటకీయ కథను చెప్పే సంగీత నృత్య ప్రదర్శన. కాంగో నృత్యం ఒక సంగీతం, నృత్య, రంగస్థల కలయిక.

ఆహారం

ప్రధానమైన ఆహారాలలో చేపలు, సముద్ర ఆహారాలు, బీన్సు, మొక్కజొన్న, వండిన అరటి ప్రాధాన్యతవహిస్తూ ఉన్నాయి.[23][24] పైనాపిలు, అవోకాడో, అరటి వంటి ఉష్ణమండల పండ్లు వంటలలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. సావో టోమె వంటలో కారమైన మసాలాల ఉపయోగం ప్రముఖంగా ఉంది.[23] కాఫీ ఒక మసాలాగా, సీజనింగులా వివిధ వంటలలో ఉపయోగిస్తారు.[23] అల్పాహారం వంటలలో తరచుగా ముందురోజు రాత్రి భోజనం నుండి మిగిలిపోయిన ఆహారపదార్ధాల ఆధారంగా పునఃసృష్టించి ఉంటాయి. గ్రుడ్డుదోశలు ప్రసిద్ధి చెందాయి.[24]

క్రీడలు

సామె టొమే, ప్రిన్సిపిలో ఫుట్ బాల్ అత్యంత ప్రసిద్ధ క్రీడగా ఉంది. " సావో టోమే, ప్రిన్సిపె జాతీయ ఫుట్బాల్ జట్టు " సావో టోమే " నేషనలు అసోసియేషను ఫుట్ బాలు జట్టు " లను సావో టొమే ఫుట్బాలు ఫెడరేషను నియంత్రిస్తుంది. ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికా ఫుట్బాలు (సి.ఎ.ఎఫ్), ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. సభ్యత్వం కలిగి ఉంది.[25]

మూలాలు